టాలీవుడ్లో మళ్లీ కొంత విరామం తర్వాత ఓ భారీ చిత్రం రాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ రూపొందించిన ‘దేవర’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అర్ధరాత్రి 1 గంట నుంచే స్పెషల్ షోలు వేయాలని చిత్ర బృందం చాలా రోజుల ముందే నిర్ణయించుకుంది. తెలంగాణలో ఆల్రెడీ అనుమతులు కూడా వచ్చేశాయి. ఏపీలో కూడా పర్మిషన్లు రావడం లాంఛనమే కావచ్చు.
ఐతే అర్ధరాత్రి షోల కోసం అభిమానుల్లో ఉండే ఆసక్తిని వాడుకుని దోపిడీకి పాల్పడం ఆనవాయితీగా మారిపోయింది. ఈ షోలను ఒక రేటుకు కొనేసి.. డిమాండును బట్టి అయిన కాడికి టికెట్ల రేట్లు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు రూ.2-3 వేల మధ్య రేట్లు పెట్టేస్తున్నారు. సలార్ లాంటి కొన్ని సినిమాలకు ఇలా బాగా సొమ్ము చేసుకున్నారు. ఇది అభిమానుల్లో అసంతృప్తికి కారణమవుతోంది.
తమ ఆసక్తిని మరీ ఇలా క్యాష్ చేసుకోవడం సబబా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘దేవర’ మూవీకి ఇలా జరక్కుండా చూడాలనుకుంటున్నారట. వేరే వాళ్లకు హక్కులు అమ్మకుండా.. డిస్ట్రిబ్యూటర్లే స్పెషల్ షోల బాధ్యత తీసుకోబోతున్నారట. అఫీషియల్గానే ఒక రేటు పెట్టి బయట కాకుండా థియేటర్లలోనే అమ్మకాలు చేయనున్నారట. అభిమానులకు అందుబాటులో ఉండేలా రూ.1000తో టికెట్లు అమ్మే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వేరే వాళ్లకు హక్కులు అమ్మితే వచ్చే ఆదాయం కంటే ఇలా రీజనబుల్ రేటు పెట్టి షో బాధ్యత తీసుకుంటేనే ఎక్కువ లాభం వస్తుందని.. అభిమానులు కూడా సంతోషిస్తారని భావించి.. ‘దేవర’ షోలను ప్రైవేటు వ్యక్తులెవరికి అమ్మకూడదని డిసైడైనట్లు తెలుస్తోంది.
ఇలా రీజనబుల్ రేట్లతో టికెట్లను అందుబాటులోకి తెచ్చి థియేటర్లో లేదా బుక్ మై షో ద్వారా టికెట్లను అమ్మితే.. పద్ధతి ప్రకారం ఈ షోలను నిర్వహిస్తే అందరూ సంతోషంగా ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ షోలపై త్వరలోనే క్లారిటీ రావచ్చు.
This post was last modified on September 18, 2024 9:52 am
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…