లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి చేసిన ఆరోపణలు నివురు గప్పిన నిప్పులా మొదలై ఇప్పుడు ఏకంగా పెద్ద బిల్డింగుల దాకా పాకుతున్నాయి. ఇండస్ట్రీ తరఫున ఫిలిం ఛాంబర్ జోక్యం చేసుకుని దీని మీద విచారణ జరుపుతున్నామని, తొంబై రోజుల్లో రిపోర్ట్ సిద్ధం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పూనమ్ కౌర్ ఏకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఉద్దేశించి ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది. అప్పుడే తన ఫిర్యాదు మీద చర్య తీసుకుని ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదని చెప్పడంతో షాక్ తినడం అందరి వంతయ్యింది.
నిజానికి క్యాస్టింగ్ కౌచ్ వివాదాలు కొత్త కాదు. ప్రతి బాషా పరిశ్రమలో ఉన్నవే. ఇటీవలే హేమ రిపోర్ట్ మలయాళం పరిశ్రమలో రేపిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఏకంగా అమ్మ సంఘం నుంచి మోహన్ లాల్ రాజీనామా చేసే దాకా వెళ్ళింది. జానీ మాస్టర్ మీద అభియోగాలు వచ్చిన కొన్ని గంటల్లోనే జనసేన కార్యకలాపాల నుంచి దూరం పెట్టడంతో దీనికి రాజకీయ రంగు పులిమేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించడం సహజం. ఇంకా కేసు నిరూపితం కాకపోయినా ఆధారాలు బలంగా ఉన్నాయనే టాక్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అంతు చిక్కడం లేదు. వ్యవహారం మాత్రం చాలా వేడిగా ఉంది.
ఇదిలా ఉంటే ఆ అమ్మాయికి ఒక స్టార్ హీరో తన సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పినట్టుగా వచ్చిన వార్త ఇంకో ట్విస్ట్. దానికి అధికారిక ధృవీకరణ లేకపోయినా వేగంగా పాకిపోతోంది. ఇలాంటి కాంట్రావర్సిలు కొంత కాలం పాటు మీడియాలో హాట్ టాపిక్ గా ఉండి తర్వాత చల్లారిపోవడం పలుమార్లు జరిగింది కాబట్టి ఈసారి ఏమవుతుందో ముందే ఊహించలేని స్థితి నెలకొంది. డాన్సర్ అసోసియేషన్ సైతం ఇష్యూని సీరియస్ గా తీసుకుంది. ఇంకా ఎవరెవరు ఏఏ రూపంలో బయటికి వస్తారో, ఎలాంటి కొత్త విషయాలు పుట్టుకొస్తాయో ఇదంతా ఒక సస్పెన్స్ మూవీని తలపిస్తోంది. క్లైమాక్స్ ఎక్కడ ఉంటుందో మరి.
This post was last modified on September 17, 2024 4:50 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…