గత నెల విడుదలై భారీ విజయం అందుకున్న ఆయ్ థియేట్రికల్ గా మంచి రెవిన్యూ సాధించింది. అయితే బిగ్ స్క్రీన్ మీద మిస్ అయిన ప్రేక్షకులు భారీగానే ఉన్నారు. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో ఓటిటి ప్రీమియర్ మొదలైన సంగతి తెలిసిందే.
ఆడుతున్న టైంలో జరగని డిబేట్ ఇప్పుడు డిజిటల్ లో వచ్చాక రాజుకోవడం విచిత్రం. అదేంటో చూద్దాం. క్లైమాక్స్ కి ముందు బాలకృష్ణ అభిమాని అయిన హీరోయిన్ తండ్రికి ఎప్పుడో ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవి ఫ్యాన్ అయిన హీరో నాన్న కొట్టడమనే ట్విస్టుని ఒక పాత్ర ద్వారా చిన్న ఎలివేషన్ ఇచ్చి రివీల్ చేస్తారు. ఇది బాగా పేలిన సన్నివేశం. పెద్దగా వివాదమూ కాదు.
కానీ ఇప్పుడు మాత్రం ఉద్దేశపూర్వకంగానే దర్శకుడు ఆ ఎపిసోడ్ పెట్టారని బాలయ్య, చిరు ఫ్యాన్స్ పరస్పరం ట్రోలింగ్ కి దిగిపోతున్నారు. ఇది మా రేంజని మెగా ఫాలోయర్స్ కవ్విస్తుండగా దానికి ధీటుగా నందమూరి అభిమానులు పాత సినిమాల్లోని వీడియోలు బయటికి తీస్తున్నారు.
ఉదాహరణకు దొంగమొగుడులో ఎన్టీఆర్ వేటగాడు ఆడుతున్న థియేటర్ ముందు చిరంజీవి గుడ్డివాడిగా బ్లాక్ టికెట్లు అమ్ముకునే సీన్ ఉంటుంది. దాన్ని షేర్ చేస్తున్నారు. దానికి ప్రతిగా ఆదిత్య 369లో బాలయ్య టేప్ రికార్డర్ లో జగదేకవీరుడు అతిలోకసుందరి పాటని ప్లే చేసే బిట్ ని బయటిని తీశారు.
ఇలా నువ్వా నేనాని పరస్పరం ఇద్దరి ఫ్యాన్స్ కవ్వించుకుంటూనే ఉన్నారు. నిజానికి స్టార్ హీరోలకు ఎలాంటి భేషజాలు ఉండవు కాబట్టే అవతలి వాళ్ళ రెఫరెన్సులు తమ సినిమాల్లో వాడుకుంటారు. సమరసింహారెడ్డి స్ఫూర్తితోనే ఇంద్రలో నటించానని చిరు ఈ మధ్యే బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలో చెప్పారు.
దానికి కొద్దిరోజుల ముందే రామ్ చరణ్ నాకు చాలా క్లోజని బాలయ్య చెప్పిన వీడియో వైరలయ్యింది. ఇంత స్పష్టంగా వాళ్ళ మధ్య అనుబంధం కొనసాగుతూ ఉంటే ఆన్ లైన్ లో మాత్రం అభిమానులు కవ్వించుకోవడం విచిత్రం. ఇదే ఆయ్ కు మరోరకంగా పబ్లిసిటీ మెటీరియల్ గా మారిందంటే ఆశ్చర్యం లేదు.
This post was last modified on September 16, 2024 11:54 am
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…
అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఏపీ సీఎం…
కారణాలు ఎన్నున్నా హీరోలు వ్యక్తిగతంగా నిర్మాతలకు సారీ చెప్పే సందర్భాలు బహు అరుదుగా ఉంటాయి. స్క్రీన్ మీదే కాదు బయట…