గత నెల విడుదలై భారీ విజయం అందుకున్న ఆయ్ థియేట్రికల్ గా మంచి రెవిన్యూ సాధించింది. అయితే బిగ్ స్క్రీన్ మీద మిస్ అయిన ప్రేక్షకులు భారీగానే ఉన్నారు. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో ఓటిటి ప్రీమియర్ మొదలైన సంగతి తెలిసిందే.
ఆడుతున్న టైంలో జరగని డిబేట్ ఇప్పుడు డిజిటల్ లో వచ్చాక రాజుకోవడం విచిత్రం. అదేంటో చూద్దాం. క్లైమాక్స్ కి ముందు బాలకృష్ణ అభిమాని అయిన హీరోయిన్ తండ్రికి ఎప్పుడో ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవి ఫ్యాన్ అయిన హీరో నాన్న కొట్టడమనే ట్విస్టుని ఒక పాత్ర ద్వారా చిన్న ఎలివేషన్ ఇచ్చి రివీల్ చేస్తారు. ఇది బాగా పేలిన సన్నివేశం. పెద్దగా వివాదమూ కాదు.
కానీ ఇప్పుడు మాత్రం ఉద్దేశపూర్వకంగానే దర్శకుడు ఆ ఎపిసోడ్ పెట్టారని బాలయ్య, చిరు ఫ్యాన్స్ పరస్పరం ట్రోలింగ్ కి దిగిపోతున్నారు. ఇది మా రేంజని మెగా ఫాలోయర్స్ కవ్విస్తుండగా దానికి ధీటుగా నందమూరి అభిమానులు పాత సినిమాల్లోని వీడియోలు బయటికి తీస్తున్నారు.
ఉదాహరణకు దొంగమొగుడులో ఎన్టీఆర్ వేటగాడు ఆడుతున్న థియేటర్ ముందు చిరంజీవి గుడ్డివాడిగా బ్లాక్ టికెట్లు అమ్ముకునే సీన్ ఉంటుంది. దాన్ని షేర్ చేస్తున్నారు. దానికి ప్రతిగా ఆదిత్య 369లో బాలయ్య టేప్ రికార్డర్ లో జగదేకవీరుడు అతిలోకసుందరి పాటని ప్లే చేసే బిట్ ని బయటిని తీశారు.
ఇలా నువ్వా నేనాని పరస్పరం ఇద్దరి ఫ్యాన్స్ కవ్వించుకుంటూనే ఉన్నారు. నిజానికి స్టార్ హీరోలకు ఎలాంటి భేషజాలు ఉండవు కాబట్టే అవతలి వాళ్ళ రెఫరెన్సులు తమ సినిమాల్లో వాడుకుంటారు. సమరసింహారెడ్డి స్ఫూర్తితోనే ఇంద్రలో నటించానని చిరు ఈ మధ్యే బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలో చెప్పారు.
దానికి కొద్దిరోజుల ముందే రామ్ చరణ్ నాకు చాలా క్లోజని బాలయ్య చెప్పిన వీడియో వైరలయ్యింది. ఇంత స్పష్టంగా వాళ్ళ మధ్య అనుబంధం కొనసాగుతూ ఉంటే ఆన్ లైన్ లో మాత్రం అభిమానులు కవ్వించుకోవడం విచిత్రం. ఇదే ఆయ్ కు మరోరకంగా పబ్లిసిటీ మెటీరియల్ గా మారిందంటే ఆశ్చర్యం లేదు.
This post was last modified on September 16, 2024 11:54 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…