స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి భారీ వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్న బడ్జెట్ తో రూపొంది అసలు ఓపెనింగ్స్ అయినా వస్తాయానే అనుమానాలు తలెత్తినవి జనాన్ని థియేటర్లకు రప్పిస్తే వాటిని నిజంగా అద్భుతమే అనాలి.
గత రెండు నెలల్లో ఏకంగా నాలుగు ఉదాహరణలు దీనికి సాక్ష్యంగా నిలవడం టాలీవుడ్ లో ఉరకలేస్తున్న కొత్త రక్తం తాలూకు జోరుని చూపిస్తోంది. నీహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ వచ్చిన ‘కమిటీ కుర్రోళ్ళు’ విపరీతమైన పోటీ మధ్య థియేటర్ల కొరతలోనూ సూపర్ హిట్ కొట్టి వావ్ అనిపించుకుంది.
గీతా ఆర్ట్స్ 2 లాంటి పెద్ద బ్యానర్ నిర్మించినా రవితేజ, రామ్, విక్రమ్ లాంటి పెద్దోళ్లతో పోటీ పడాల్సి వచ్చిన ‘ఆయ్’ అనూహ్య విజయం సాధించడం అనూహ్యం. అంజి కె మణిపుత్ర డైరెక్షన్ అతనికి బోలెడు అవకాశాలు తెచ్చి పెడుతోంది. మంచి లాభాలు మూటగట్టుకునేలా చేసింది.
రానా సమర్పకుడిగా వ్యవహరించిన ’35 చిన్న కథ కాదు’ వసూళ్ల పరంగా గ్రేట్ అనిపించుకోకపోయినా ఉన్నంతలో మంచి రన్ సాధించి ఇటు రివ్యూలు అటు ఆడియన్స్ ఇద్దరితోనూ శభాష్ అనిపించుకుంది. ఇంకొంచెం బలమైన మార్కెటింగ్ చేసి ఉంటే తర్వాతి స్థాయికి వెళ్ళేదన్న కామెంట్ లో నిజం లేకపోలేదు.
ఇక తాజా సంచలనం ‘మత్తు వదలరా 2’ ఏకంగా బాక్సాఫీస్ బూజు దులుపుతోంది. ఊహించిన దానికన్నా భారీగా థియేటర్లను నింపేస్తోంది. సత్య కామెడీ మీద సూపర్ పాజిటివ్ టాక్ రావడం మైత్రి సంస్థకు లాభాలను కురిపిస్తోంది. ఇక్కడ చెప్పిన నాలుగు సినిమాల్లోనూ స్టార్లు లేరు.
ఉన్నది కేవలం కంటెంట్ మాత్రమే. యంగ్ టెక్నీషియన్స్ ప్రతిభతో విజయం సాధించాయి. ఇలాంటివి జనం కేవలం ఓటిటిలోనే చూస్తారనే భ్రమలను బద్దలు కొడుతూ థియేటర్లకు జనాన్ని రప్పించాలంటే ఏం చేయాలో ప్రత్యక్షంగా నిరూపించాయి. అప్ కమింగ్ ఫిలిం మేకర్స్ కు దిక్సూచిలా నిలబడ్డాయి.
This post was last modified on September 16, 2024 1:05 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…