న్యాచురల్ స్టార్ నాని తాజా బ్లాక్ బస్టర్ సరిపోదా శనివారం దిగ్విజయంగా వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగుపెట్టేసింది. దసరా తర్వాత అతి తక్కువ గ్యాప్ లో రెండో సారి ఈ మైలురాయిని అందుకున్న హీరోగా మరో ఘనతను స్వంతం చేసుకున్నాడు. ప్రభాస్ లాంటి టయర్ వన్ హీరోలను మినహాయిస్తే ఎవరి వల్ల ఇది సాధ్యం కాలేదు.
మధ్యలో హాయ్ నాన్న కూడా మంచి వసూళ్లనే రాబట్టింది కానీ మాస్ అప్పీల్ లేని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో కలెక్షన్లు కొంత పరిమితికి కట్టుబడాల్సి వచ్చింది. హిట్ 2 ది థర్డ్ కేస్ నిర్మాణంలో ఉండగానే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇక సక్సెస్ కేస్ స్టడీ ఎందుకు అయ్యాడో చూద్దాం.
నాని గత కొంత కాలంగా కాంబోలను నమ్ముకోవడం లేదు. తన కలయికలోనే అంటే సుందరానికి ఫ్లాప్ ఇచ్చిన వివేక్ ఆత్రేయకు మరో అవకాశం ఇచ్చి గొప్ప ఫలితం అందుకున్నాడు.
గత చిత్రం డిజాస్టరైనా దాన్ని పట్టించుకోకుండా ప్రొడ్యూసర్ గా తనకు రెండు హిట్లిచ్చిన శైలేష్ కొలనుకి ఎస్ చెప్పాడు. డెబ్యూ దర్శకులనే అనుమానం కన్నా వాళ్ళ కథలోని గొప్పదనం గుర్తించడం వల్లే శౌర్యువ్, శ్రీకాంత్ ఓదెల అనే కొత్త టాలెంట్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాయి.
గతంలో నాని వి, టక్ జగదీశ్, గ్యాంగ్ లీడర్ లాంటి పొరపాట్లు చేశాడు. వాటి నుంచి నేర్చుకున్న పాఠాలే స్క్రిప్టుల ఎంపికలో మరింత జాగ్రత్తగా అడుగులు వేసేలా చేస్తున్నాయి.
రజనీకాంత్ వెట్టయన్ లో రానా కన్నా ముందు అడిగింది నానినేనని అప్పట్లో మాట్లాడుకున్నారు. సూపర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం కన్నా తన ప్రాధ్యాన్యం ముఖ్యమనుకునే ఆలోచన వల్లే అలాంటి స్థిర నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. బలగం వేణుతో సినిమాని పెండింగ్ ఉంచడానికి కారణం క్వాలిటీ కోసమే.
ఓవర్సీస్ లో నాని మార్కెట్ బాగా బలపడింది. ఎన్ఆర్ఐలలో గ్యారెంటీ బ్రాండ్ పేరు తెచ్చుకున్నాడు. మాస్ కు తాను పర్ఫెక్ట్ గా నప్పుతానని దసరా, సరిపోదా శనివారంతో ఋజువు చేసుకున్న నాని భవిష్యత్ ప్లానింగ్ కూడా ఇదే తరహాలో ఉండబోతోందనేందుకు ఇంత కన్నా నిదర్శనం వేరే కావాలా.
This post was last modified on September 16, 2024 11:16 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…