తప్పు చేశారా? లేదా? అన్నది పక్కన పెడితే.. వరుస వివాదాలతో కొందరు సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తుంటాయి. ఆ కోవలోకే వస్తారు టాలీవుడ్.. కోలీవుడ్ లలో పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గడిచిన కొంతకాలంగా ఆయనపైన ఏదో ఒక వివాదంతో వార్తల్లో వ్యక్తిగా మారారు.
తాజాగా 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ ఒకరు జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదు ఇచ్చారు.
రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆయనపై బాధితురాలు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారు జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం బాధితురాలు ఉండే నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.
చెన్నై, ముంబయి.. హైదరాబాద్ లతో సహా వివిధ నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్ లకు వెళుతున్న వేళలోనూ.. హైదరాబాద్ లోని తన నివాసమైన నార్సింగ్ లోనూ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా పేర్కొన్నారు. నిజానికి రెండు రోజుల క్రితమే బాధితురాలు ఫిర్యాదు ఇచ్చింది. ఆలస్యంగా బయటకు వచ్చింది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా జానీ మాస్టర్ మీద అత్యాచారం.. బెదిరింపులకు పాల్పడటం.. గాయపర్చటం తదితర ఆరోపణలతో కేసు నమోదు చేశారు. గతంలోనూ పలు వివాదాల్లో జానీ మాస్టర్ పేరు తెర మీదకు వచ్చింది. 2015లో ఒక కాలేజీలో మహిళపై దాడి కేసులో జైలుశిక్షను కోర్టు విధించింది. ఈ ఉదంతంపై జానీ మాస్టర్ స్పందించాల్సి ఉంది.
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…
ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…
సినీ ప్రియులను అంతులేని విషాదంలో ముంచెత్తుతూ లెజెండరీ దర్శకులు భారతీరాజా కన్నుమూశారు. ఆయన జ్ఞాపకాలలో అభిమానులు గతాన్ని తలుచుకుంటున్నారు. పేరు…