తప్పు చేశారా? లేదా? అన్నది పక్కన పెడితే.. వరుస వివాదాలతో కొందరు సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తుంటాయి. ఆ కోవలోకే వస్తారు టాలీవుడ్.. కోలీవుడ్ లలో పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గడిచిన కొంతకాలంగా ఆయనపైన ఏదో ఒక వివాదంతో వార్తల్లో వ్యక్తిగా మారారు.
తాజాగా 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ ఒకరు జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదు ఇచ్చారు.
రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆయనపై బాధితురాలు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారు జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం బాధితురాలు ఉండే నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.
చెన్నై, ముంబయి.. హైదరాబాద్ లతో సహా వివిధ నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్ లకు వెళుతున్న వేళలోనూ.. హైదరాబాద్ లోని తన నివాసమైన నార్సింగ్ లోనూ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా పేర్కొన్నారు. నిజానికి రెండు రోజుల క్రితమే బాధితురాలు ఫిర్యాదు ఇచ్చింది. ఆలస్యంగా బయటకు వచ్చింది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా జానీ మాస్టర్ మీద అత్యాచారం.. బెదిరింపులకు పాల్పడటం.. గాయపర్చటం తదితర ఆరోపణలతో కేసు నమోదు చేశారు. గతంలోనూ పలు వివాదాల్లో జానీ మాస్టర్ పేరు తెర మీదకు వచ్చింది. 2015లో ఒక కాలేజీలో మహిళపై దాడి కేసులో జైలుశిక్షను కోర్టు విధించింది. ఈ ఉదంతంపై జానీ మాస్టర్ స్పందించాల్సి ఉంది.
This post was last modified on September 16, 2024 10:35 am
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…