ఒకప్పుడు సినిమాల్లో కథతో సంబంధం లేకుండా కమెడియన్లకు సెపెరేట్ ట్రాక్స్ ఉండేవి. వీటిని మెయిన్ రైటర్స్ తో కాకుండా వేరే రచయితలతో రాయించేవారు. ఎంతలేదన్నా పావు గంట నుంచి ఇరవై నిమిషాల దాకా పెట్టేవారు.
బ్రహ్మానందం, ధర్మవరపు, ఎంఎస్ నారాయణ, వేణుమాధవ్ అలా పేరు తెచ్చుకున్నవాళ్ళే. కానీ కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల ఇలా సాధ్యపడకపోవడంతో హీరో, అతని ఫ్రెండ్స్ మధ్య హాస్యాన్ని పుట్టించడమనే ట్రెండ్ మొదలైంది. ఎప్పటి నుంచి అంటే ఖచ్చితంగా చెప్పలేం కానీ ఇరవై దశకం నుంచి ఈ పోకడ ఎక్కువయ్యింది. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం సత్య.
నిన్న విడుదలైన మత్తు వదలరా 2కి పాజిటివ్ టాక్ రావడంలో సత్య పోషించిన పాత్ర చాలా కీలకం. బయటికి వచ్చిన ఆడియన్స్ శ్రీసింహ గురించి కాకుండా సత్య గురించే మాట్లాడుకుంటున్నారంటే దానికి కన్నా వేరే నిదర్శనం అక్కర్లేదు.
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం పగలబడి నవ్వించేలా పేల్చిన లైనర్స్, టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఒకదాన్ని మించి మరొకటి ఓ రేంజ్ లో చక్కిలిగింతలు పెట్టాయి. మత్తువదలరా 1లోనూ తన టాలెంట్ చూపించిన సత్యకు దర్శకుడు రితీష్ రానా ఈసారి దానికి రెట్టింపు స్కోప్ ఇచ్చాడు. ఎంతలా అంటే స్క్రీన్ ని తినేస్తాడేమో అని డౌట్ వచ్చే రేంజ్ లో.
నిజానికి సత్యలో ఇంత మంచి పొటెన్షియాలిటీ ఉందని గతంలో ఎన్నోసార్లు రుజువయ్యింది. హనుమాన్ లాంటి విజువల్ గ్రాండియర్ లో కనిపించేది కొన్ని నిమిషాలే అయినా తన ఉనికిని చాటుకున్నాడు.
డిజాస్టర్ మిస్టర్ బచ్చన్ లో కాస్త ఎంటర్ టైన్ చేసింది ఎవరయ్యా అంటే మళ్ళీ వినిపించే సమాధానం సత్య. రంగబలి ఫ్లాప్ అయినా దాని గురించి ఒక నలుగురు మాట్లాడుకున్నారంటే రీజనేంటో చెప్పనక్కర్లేదు. ఫైనల్ గా దర్శకులు గుర్తించాల్సింది ఒకటుంది. సత్య వాడుకున్నోళ్లకు వాడుకున్నంత ఇస్తాడు. కాకపోతే దాని ఉపయోగించుకునే టెక్నిక్, రాసే తెలివితేటలు ఉండాలి. మిగిలింది తను చూసుకుంటాడు.
This post was last modified on September 16, 2024 6:42 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…