ఏదో కొత్తగా ట్రై చేయాలని చూస్తున్న సుధీర్ బాబుకి గత కొన్నేళ్లుగా సక్సెస్ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఎవరూ రిస్క్ చేయని పాయింట్ తో హంట్ ఎంచుకున్నా, హీరోయిన్ ఓరియెంటెడ్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలో నటించినా ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఊర మాస్ టర్న్ తీసుకుని హరోంహర చేస్తే ఓ మోస్తరుగా సంతృప్తి పరిచిందే తప్ప అద్భుతాలు చేయలేదు. నిజానికి సుధీర్ బాబు సమ్మోహనం లాంటి మంచి ఫీల్ గుడ్, ఎమోషనల్ డ్రామాలకు బాగా నప్పుతాడు. కానీ ఇది కొంత కాలంగా మిస్సవ్వడంతో హిట్టు బాట తప్పింది. ఇప్పుడు రూటు మార్చాడు సుధీర్ బాబు.
నిన్న విడుదలైన మా నాన్న సూపర్ హీరో టీజర్ కు మంచి స్పందన కనిపిస్తోంది. సంపాదించే కొడుకుకు అతని జీవితంలోకి ఇద్దరు తండ్రులు వస్తే ఎలా ఉంటుందనే డిఫరెంట్ పాయింట్ తో దర్శకుడు అభిలాష్ ఏదో కొత్తగా చెప్పాలని ప్రయత్నించిన వైనం నిమిషంన్నరలోనే కనిపించింది. షియాజీ షిండే, సాయిచంద్ లతో రెండు వేర్వేరు ట్రాక్స్ కి సుధీర్ బాబుకి సింక్ చేసిన వైనం ఆసక్తి పెంచింది. యువి సంస్థ ఉత్పత్తి కావడంతో ప్రొడక్షన్ పరంగా మంచి క్వాలిటీ కనిపిస్తోంది. అందుకే గట్టి పోటీలో అక్టోబర్ 11 దసరా పండక్కు ఈ సినిమాని థియేటర్లకు తీసుకొస్తున్నారు.
ఇది చూశాక సుధీర్ బాబు చేయాల్సినవి ఇలాంటివే కదా అనిపిస్తుంది. రెగ్యులర్ మాస్, కమర్షియల్ మసాలా తనకు నప్పదు. మహేష్ బాబు అభిమానులు అందుకే కొన్ని సినిమాలకు తనను ఓన్ చేసుకోలేకపోతున్నారు. మా నాన్న సూపర్ హీరో లాంటివి కుటుంబ ప్రేక్షకులను దగ్గర చేస్తాయి. తద్వారా మార్కెట్ ని పెంచుకోవచ్చు. వెంకటేష్ తరహాలో ఫ్యామిలీ ఇమేజ్ బలంగా ఏర్పడితే ఆ తర్వాత మాస్ చేసినా పాసైపోతుంది. త్వరలో తన కొడుకు తెరంగేట్రం చేస్తాడని చెబుతున్న సుధీర్ బాబు ఇప్పుడీ సినిమా విషయంలో మాత్రం ఎమోషనల్ గా ఫీలవుతున్నాడు. కంటెంట్ అలా ఉంది మరి.
This post was last modified on September 13, 2024 3:14 pm
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…
అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఏపీ సీఎం…