మళ్లీ శుక్రవారం వచ్చేసింది. కొత్త సినిమాల సందడిని తెచ్చేసింది. ఈ వారం సినిమాలు యువ కథానాయకుల కెరీర్లకు చాలా కీలకంగా మారాయి. ‘మత్తువదలరా’తో ప్రామిసింగ్ డెబ్యూ ఇచ్చిన కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా.. ఆ తర్వాత హిట్ రుచి ఎరగలేదు.
తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, బాగ్ సాలే, ఉస్తాద్.. ఇలా వరుసగా ఫ్లాపులు ఎదురయ్యాయి. దీంతో కెరీర్ దాదాపుగా క్లోజ్ అయిపోయే పరిస్థితి తలెత్తింది. ఇక అతను పుంజుకోవడం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఐతే ఈ కష్ట కాలంలో మళ్లీ ‘మత్తువదలరా’ టీంనే నమ్ముకున్నాడతను.
ఆ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయి.. తర్వాత ‘హ్యాపీ బర్త్ డే’తో నిరాశపరిచిన రితేష్ రాణా.. సింహానే హీరోగా పెట్టి ‘మత్తువదలరా-2’ తీశాడు. చడీచప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుని నేరుగా టీజర్తో పలకరించిన ఈ చిత్రం.. శుక్రవారం థియేటర్లలోకి దిగుతోంది. ప్రోమోలు చూస్తే ఆసక్తికరంగా అనిపించాయి. థ్రిల్స్, ఎంటర్టైన్మెంట్ బాగానే ఉన్నట్లుంది. పబ్లిసిటీ కూడా గట్టిగా చేశారు.
ఈ సినిమా సింహాతో పాటు దర్శకుడు రితేష్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కెరీర్లకు కీలకం. మరోవైపు రాజ్ తరుణ్ నెల రోజుల వ్యవధిలో మూడో సినిమాతో రాబోతున్నాడు. పురుషోత్తముడు, తిరగబడరా సామీ చిత్రాలు అతడికి షాక్ మీద షాక్ ఇవ్వగా.. ఇప్పుడతను ‘భలే ఉన్నాడే’ మీద ఆశలు పెట్టుకున్నాడు. స్టార్ డైరెక్టర్ మారుతి బ్రాండ్తో వస్తున్న సినిమా ఇది. శివసాయి దర్శకుడు. శృంగారం విషయంలో తడబడే కుర్రాడి పాత్రను పోషించాడు రాజ్ ఇందులో. ట్రైలర్ చూస్తే కాన్సెప్ట్ ఎంటర్టైనింగ్గానే అనిపిస్తోంది. మరి సినిమా ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.
దీంతో పాటు కొత్త హీరో దిలీప్ ప్రకాష్ నటించిన ‘ఉత్సవం’ కూడా ఈ రోజే థియేటర్లలోకి దిగుతోంది. మరి యువ కథానాయకుల కెరీర్లకు కీలకంగా మారిన ఈ చిత్రం వారికెలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
This post was last modified on September 13, 2024 12:17 pm
మాములుగా సినిమాలు శతదినోత్సవాలు చేసుకుంటే అభిమానులకు అదో పండగ. ఎన్ని ఎక్కువ సెంటర్లలో ఆడితే అంత గర్వంగా చెప్పుకుంటారు. కానీ…
వైసీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్.. తన పార్టీ ఎమ్మెల్యేలను ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి 'గడపగడపకు మన ప్రభుత్వం'…
ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ను సైబరాబాద్ ఎస్ ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు రోజులుగా జానీ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర జనవరి 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకుంది. షూటింగ్…
అప్పుడెప్పుడో నెలల క్రితం సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు సంపత్ నందితో సితార సంస్థ గాంజా శంకర్ ని…
రేపు కొత్త శుక్రవారం అనే ఆనందం బాక్సాఫీస్ వద్ద కనిపించడం లేదు. కౌంట్ పరంగా సినిమాలైతే ఉన్నాయి కానీ దేనికీ…