టాలీవుడ్లో మళ్లీ బండ్ల గణేష్ హడావుడి మొదలైంది. తన ‘దేవుడు’ పవన్ కళ్యాణ్తో మళ్లీ ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు బండ్ల ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. ‘ఆంజనేయులు’ లాంటి ఫ్లాప్ మూవీతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్ను ‘తీన్ మార్’తో పెద్ద నిర్మాతను చేసింది పవన్ కళ్యాణే. ఆ సినిమా సరిగా ఆడలేదని తర్వాత ‘గబ్బర్ సింగ్’ ఇచ్చాడు పవన్. ఆ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసి బండ్లను ‘బ్లాక్బస్టర్’ ప్రొడ్యూసర్గా మార్చింది. ఆ ఊపులో మరి కొన్ని సినిమాలు నిర్మించి తర్వాత ఉన్నట్లుండి ప్రొడక్షన్ ఆపేశాడు.
ఇప్పుడు మళ్లీ సినిమాలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చిన బండ్ల.. టాలీవుడ్ టాప్ స్టార్లను దువ్వే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ ఎవరూ అతడికి కమిట్మెంట్ ఇవ్వలేదు. ఇంతలో పవన్ కళ్యాణ్ తనతో సినిమా చేయడానికి ఓకే చెప్పాడంటూ అప్ డేట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు బండ్ల.
ఐతే పవన్ సన్నిహితుల సమాచారం ప్రకారం బండ్లతో ఆయన సినిమా కార్యరూపం దాల్చడం అంత సులువేమీ కాదంటున్నారు. ఆయనకు ఇప్పటికే బోలెడన్ని కమిట్మెంట్లున్నాయి. 2024 ఎన్నికలకు ముందు ఇప్పటికే కమిటైన సినిమాలను పూర్తి చేయడం కూడా కష్టమే అన్నది వారి అభిప్రాయం. రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’నే ఇంకా పూర్తి చేయలేదు. ఆ తర్వాత క్రిష్ మూవీ, ఆపై హరీష్ శంకర్ చిత్రం.. తర్వాత సురేందర్ రెడ్డి సినిమా చేయాలి. వీటికే రెండేళ్లకు పైగా సమయం పడుతుంది.
ఇవి కాక ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ను కూడా పవన్ ముందుకు తేగా.. దాన్ని కూడా చేస్తానన్నట్లు సంకేతాలు ఇచ్చాడు పవన్. ఈ ఐదు సినిమాలను పూర్తి చేశాక కానీ బండ్లతో సినిమా చేయడానికి వీల్లేదు. ఐతే తాను మళ్లీ సినిమాలు నిర్మించాలనుకుంటున్నానంటూ పవన్ దగ్గర ప్రస్తావించి కమిట్మెంట్ కోరితే చూద్దాం, చేద్దాం అని పవన్ మాట వరసకు అంటే బండ్ల తొందరపడి ప్రకటన చేసేశాడని.. అసలు తన కోసం పవన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తాడో తెలియదు, ఆ టైమింగ్ను బట్టి దర్శకుడిని, కథను సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ అంత తేలిగ్గా తేలే విషయాలు కాదని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు.
This post was last modified on September 30, 2020 12:39 pm
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…