తెలుగు మార్కెట్ అనుభవిస్తూ కనీసం టైటిల్స్ మార్చకుండా ఇక్కడ వందలాది స్క్రీన్లలో తమ సినిమాలు రిలీజ్ చేసుకునే తమిళ హీరోలు ఏపీ తెలంగాణలో వరదలొచ్చాయనే సంగతే తెలియనంత మౌనంగా ఉండటం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. బలవంతంగా విరాళం ఇవ్వమని ఎవరూ చెప్పరు కానీ కనీస మాననీయ దృక్పథం అవసరం. కానీ కోలీవుడ్ హీరో శింబు ఒక్కడే 6 లక్షలు వరద విపత్తు సహాయక చర్యల కోసం డొనేషన్ గా ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. మన్మథ టైంలో ఉండేది కానీ ప్రస్తుతం శింబుకి టాలీవుడ్ లో మార్కెట్ లేదు. అందుకే డబ్బింగులు రావడం మానేశాయి.
అలాంటిది అతను ఇంత పెద్ద మనసు చేసుకోవడం విశేషమే. అయితే దీని వెనుక మరో ఆసక్తికరమైన కథ ఉందని ఇన్ సైడ్ టాక్. అదేంటంటే పవన్ కళ్యాణ్ ఓజి కోసం శింబు ఒక పాట పాడాడు. తమన్ స్వరపరిచిన ఆ క్రేజీ సాంగ్ రికార్డింగ్ గతంలోనే పూర్తయ్యింది. మాట్లాడుకున్న టైంలోనే పైసా రెమ్యునరేషన్ వద్దని శింబు ముందే చెప్పాడు. అయినా సరే ఒక నటుడికి ఇవ్వాల్సిన గౌరవార్థం నిర్మాత నుంచి అతనికి చెక్ వెళ్ళింది. పవన్ ఐడియాలజీని బాగా ఇష్టపడే శింబు ఆలస్యం చేయకుండా ఆ మొత్తాన్ని తీసుకోకుండా ఫ్లడ్ డొనేషన్ పేరిట తిరిగి తెలుగు ప్రజలకే ఇచ్చాడు.
ఇది అధికారికంగా బయటికి వచ్చిన టాక్ కాదు కానీ మొత్తానికి ఇదే మ్యాటరని అంతర్గత వర్గాల సమాచారం. అయినా ఇలా చేయడం కూడా గొప్పే. రూపాయి ఇవ్వడానికి పదిసార్లు ఆలోచించే ప్రపంచంలో కోట్లు సంపాదించినంత మాత్రాన అందరూ దాన ధర్మాలు చేస్తారని కాదు. అందులోనూ మనకు సంబంధం లేని పక్క రాష్ట్రం వరద గురించి ఆలోచించడం గొప్ప విషయమే. అందుకే శింబు మీద సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. భవిష్యత్తులో శింబు సినిమా ఏదైనా అనువాదం రూపంలో వచ్చి బాగుంటే కనక ఈసారి ఆదరణ దక్కుతుందేమో. అదే తనకు ఇవ్వాల్సిన గౌరవం.
This post was last modified on September 10, 2024 2:13 pm
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…