Movie News

పవన్ కళ్యాణ్ కాళ్లకు పరిస్థితుల బ్రేకులు

ఇటీవలే బ్యాలన్స్ ఉన్న సినిమాల దర్శక నిర్మాతలతో తానున్న చోటే సమావేశాలు పెట్టి వాటి స్టేటస్ తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఈ నెలలోనే షూటింగులు మొదలుపెట్టే దిశగా వాళ్లకు కొన్ని సూచనలు చేశారు. వీలైనంత మంగళగిరి, అమరావతి, గుంటూరు తదితర ప్రాంతాల్లోనే చిత్రీకరణ చేసుకోమని కూడా చెప్పారట. ఓజిలో కీలకమైన విదేశీ షెడ్యూల్ కు తప్ప హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ లకు ఎలాంటి ఇబ్బంది లేదు. రేపో మాపో సెట్లోకి అడుగు పెడతారని ఎదురు చూస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ ముందరి కాళ్లకు పరిస్థితులు స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డుపడుతున్నాయి.

ఇటీవలే బుడమేరు వరదలు విజయవాడని ముంచెత్తాయి. కోట్లలో ఆస్తి నష్టంతో పాటు వేలాది సామాన్య జనం రోడ్డున పడ్డారు. ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోబట్టి సరిపోయింది కానీ లేదంటే ఇంకా దారుణంగా ఉండేది. క్రమంగా బెజవాడ కోలుకుంటుందనే టైంలో ఇంకో ప్రాంతంలో భారీ వర్షాలతో ఏలేరు వరద ముంచెత్తింది.. నిన్న స్వయంగా పవనే కాకినాడ, పిఠాపురం పర్యటనకు వెళ్లి కళ్లారా జరిగిన విపత్తుని చూసి వచ్చారు. ఇలాంటి టైంలో పవన్ అసలు షూటింగ్ మూడ్ లో లేరని సన్నిహితుల మాట. వర్షాలకు ముందు వరకు సానుకూలంగా ఉన్నారు కానీ ఇప్పుడు ప్రజల గురించి ఆలోచన తప్ప వేరేది చేయడం లేదని అంటున్నారు.

సో దర్శకులు నిర్మాతలు మరికొంత కాలం ఎదురు చూడక తప్పేలా లేదు. ఇవన్నీ ఊహించనివి. ఆగస్ట్ లో ఎవరూ ఇలాంటి విపత్కాలం వస్తుందని అంచనా వేయలేదు. కారణాలు స్పష్టంగా తెలిసినా సరే పవన్ కళ్యాణ్ వరద బాధితులను కలవలేదని ప్రతిపక్షాలు నానా యాగీ చేయాలని చూశాయి. తర్వాత దానికి సరైన సమాధానం దొరికాక సైలెంటయ్యాయి. ఇప్పుడు పవన్ కనక వెంటనే షూటింగుల్లో ఉంటే మళ్ళీ ఇంకో రకమైన విమర్శలకు పదును పెడతాయి. పవన్ కేవలం ఎమ్మెల్యే అయితే సమస్య లేదు. ఉప ముఖ్యమంత్రి పదవీతో పాటు కీలక శాఖలకు మంత్రి కావడం వల్లే ఈ ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుంది.

This post was last modified on September 10, 2024 12:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

46 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

48 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago