అనుభవజ్ఞులైన విక్రమ్ కుమార్, ఇంద్రగంటి మోహనకృష్ణలు నేచురల్ స్టార్ నాని ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయారు. గ్యాంగ్లీడర్ అయినా యావరేజ్ రిపోర్టులు తెచ్చుకుంది కానీ ‘వి’ మాత్రం ప్రేక్షకుల తిరస్కారానికి గురయింది. దీంతో నాని ఇక టాలెంటెడ్ యంగ్స్టర్స్కు ఛాన్స్ ఇవ్వాలని ఫిక్సయ్యాడు. యువ దర్శకులకు తన రేంజ్ హీరో అవకాశమిస్తే వారికి అది ఖచ్చితంగా పెద్ద అఛీవ్మెంట్ అవుతుంది.
అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే దర్శకులుగా వారి భవిష్యత్తు బాగుంటుంది కనుక వారు మరింత ఎఫర్టస్ పెట్టి పని చేయడం గ్యారెంటీ. అందుకే నాని అలాంటి దర్శకులను ఐడెంటిఫై చేసి వాళ్లకు పెద్ద ప్లాట్ఫామ్ ఇస్తున్నాడు. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్తో ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని నాని చేయబోతున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత అతను ‘బ్రోచేవారెవరురా’ దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో ఒక చిత్రం చేయనున్నాడు.
తాజాగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ దర్శకుడు స్వరూప్తో కూడా ఒక సినిమా ఖాయం చేసుకున్నాడు. వరుసగా ఇంతమంది టాలెంటెడ్ యువ దర్శకులతో పని చేయనున్న నాని లైనప్ ఆసక్తికరంగా వుంది. వీటన్నిటి కంటే ముందుగా ‘టక్ జగదీష్’ షూటింగ్ పూర్తి చేస్తాడు. అక్టోబర్ మూడవ వారంలో తిరిగి షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే నాని ‘శ్యామ్ సింగ రాయ్’ మొదలు పెట్టేస్తాడు.
This post was last modified on September 28, 2020 10:08 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…