అనుభవజ్ఞులైన విక్రమ్ కుమార్, ఇంద్రగంటి మోహనకృష్ణలు నేచురల్ స్టార్ నాని ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయారు. గ్యాంగ్లీడర్ అయినా యావరేజ్ రిపోర్టులు తెచ్చుకుంది కానీ ‘వి’ మాత్రం ప్రేక్షకుల తిరస్కారానికి గురయింది. దీంతో నాని ఇక టాలెంటెడ్ యంగ్స్టర్స్కు ఛాన్స్ ఇవ్వాలని ఫిక్సయ్యాడు. యువ దర్శకులకు తన రేంజ్ హీరో అవకాశమిస్తే వారికి అది ఖచ్చితంగా పెద్ద అఛీవ్మెంట్ అవుతుంది.
అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే దర్శకులుగా వారి భవిష్యత్తు బాగుంటుంది కనుక వారు మరింత ఎఫర్టస్ పెట్టి పని చేయడం గ్యారెంటీ. అందుకే నాని అలాంటి దర్శకులను ఐడెంటిఫై చేసి వాళ్లకు పెద్ద ప్లాట్ఫామ్ ఇస్తున్నాడు. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్తో ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని నాని చేయబోతున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత అతను ‘బ్రోచేవారెవరురా’ దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో ఒక చిత్రం చేయనున్నాడు.
తాజాగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ దర్శకుడు స్వరూప్తో కూడా ఒక సినిమా ఖాయం చేసుకున్నాడు. వరుసగా ఇంతమంది టాలెంటెడ్ యువ దర్శకులతో పని చేయనున్న నాని లైనప్ ఆసక్తికరంగా వుంది. వీటన్నిటి కంటే ముందుగా ‘టక్ జగదీష్’ షూటింగ్ పూర్తి చేస్తాడు. అక్టోబర్ మూడవ వారంలో తిరిగి షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే నాని ‘శ్యామ్ సింగ రాయ్’ మొదలు పెట్టేస్తాడు.
This post was last modified on September 28, 2020 10:08 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…