ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితురాలిగా మారిపోయిన అలియా భట్ కొత్త సినిమా జిగ్రా అక్టోబర్ 11 విడుదల కానుంది. నిజానికి దీనికి ముందు అనుకున్న తేదీ అక్టోబర్ 2.
గాంధీ జయంతితో మొదలుపెట్టి దసరా సెలవుల దాకా లాంగ్ సీజన్ దొరుకుతుందనే ఉద్దేశంతో అలా ప్లాన్ చేసుకున్నారు. అయితే దేవర పార్ట్ వన్ సెప్టెంబర్ 27 వస్తున్న నేపథ్యంలో కేవలం వారం గ్యాప్ లో జిగ్రాని దించడం రిస్క్ అవుతుంది. ఎందుకంటే జిగ్రా నిర్మాతల్లో ఒకరైన ధర్మా ప్రొడక్షన్స్ హిందీ వెర్షన్ దేవరని నార్త్ మార్కెట్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది కనక సర్దుబాటు తప్పలేదు.
దీంతో తారక్ కోసం అలియా ఆలస్యంగా వస్తోందని ముంబై టాక్. అలాని జిగ్రాకి పోటీ లేదని కాదు. సౌత్ మార్కెట్ లో తీవ్రమైన కాంపిటీషన్ ఉంది. రజనీకాంత్ వెట్టయన్, గోపీచంద్ విశ్వం, ధృవ సర్జ మార్టిన్ లు భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నాయి. ఇవి ఖచ్చితంగా అలియా ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తాయి. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నాగ చైతన్య కాబోయే శ్రీమతి శోభిత ధూళిపాళ ఒక కీలక పాత్ర చేయడం విశేషం. తోడబుట్టిన వాడి కోసం ఎంత దూరమైనా వెళ్లి ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదురుకునే పాత్రలో అలియా భట్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందట.
స్త్రీ 2 నుంచి బాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరోలే చతికిలపడుతున్న టైంలో కేవలం కంటెంట్ ని నమ్ముకుని అయిదు వందల కోట్ల వైపు పరుగులు పెట్టడం ఎవరూ ఊహించలేదు. అందుకే బయ్యర్లు కాంబినేషన్లను నమ్ముకోకుండా జనాల్లో అంచనాలు రేపిన వాటి మీదే పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏడాది రాకీ రాణికి ప్రేమ్ కహాని తర్వాత అలియా మళ్ళీ తెరపై కనిపించలేదు. బిడ్డకు జన్మనిచ్చాక ఒప్పుకున్న సినిమా ఆల్పా ఒకటే. ఇది స్పై థ్రిల్లర్. జిగ్రా అంతకు ముందే పూర్తయ్యింది. తర్వాత బ్రహ్మాస్త్ర పార్ట్ 2 దేవా ఉంటుంది.
This post was last modified on September 6, 2024 5:42 am
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…
అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఏపీ సీఎం…