ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితురాలిగా మారిపోయిన అలియా భట్ కొత్త సినిమా జిగ్రా అక్టోబర్ 11 విడుదల కానుంది. నిజానికి దీనికి ముందు అనుకున్న తేదీ అక్టోబర్ 2.
గాంధీ జయంతితో మొదలుపెట్టి దసరా సెలవుల దాకా లాంగ్ సీజన్ దొరుకుతుందనే ఉద్దేశంతో అలా ప్లాన్ చేసుకున్నారు. అయితే దేవర పార్ట్ వన్ సెప్టెంబర్ 27 వస్తున్న నేపథ్యంలో కేవలం వారం గ్యాప్ లో జిగ్రాని దించడం రిస్క్ అవుతుంది. ఎందుకంటే జిగ్రా నిర్మాతల్లో ఒకరైన ధర్మా ప్రొడక్షన్స్ హిందీ వెర్షన్ దేవరని నార్త్ మార్కెట్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది కనక సర్దుబాటు తప్పలేదు.
దీంతో తారక్ కోసం అలియా ఆలస్యంగా వస్తోందని ముంబై టాక్. అలాని జిగ్రాకి పోటీ లేదని కాదు. సౌత్ మార్కెట్ లో తీవ్రమైన కాంపిటీషన్ ఉంది. రజనీకాంత్ వెట్టయన్, గోపీచంద్ విశ్వం, ధృవ సర్జ మార్టిన్ లు భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నాయి. ఇవి ఖచ్చితంగా అలియా ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తాయి. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నాగ చైతన్య కాబోయే శ్రీమతి శోభిత ధూళిపాళ ఒక కీలక పాత్ర చేయడం విశేషం. తోడబుట్టిన వాడి కోసం ఎంత దూరమైనా వెళ్లి ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదురుకునే పాత్రలో అలియా భట్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందట.
స్త్రీ 2 నుంచి బాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరోలే చతికిలపడుతున్న టైంలో కేవలం కంటెంట్ ని నమ్ముకుని అయిదు వందల కోట్ల వైపు పరుగులు పెట్టడం ఎవరూ ఊహించలేదు. అందుకే బయ్యర్లు కాంబినేషన్లను నమ్ముకోకుండా జనాల్లో అంచనాలు రేపిన వాటి మీదే పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏడాది రాకీ రాణికి ప్రేమ్ కహాని తర్వాత అలియా మళ్ళీ తెరపై కనిపించలేదు. బిడ్డకు జన్మనిచ్చాక ఒప్పుకున్న సినిమా ఆల్పా ఒకటే. ఇది స్పై థ్రిల్లర్. జిగ్రా అంతకు ముందే పూర్తయ్యింది. తర్వాత బ్రహ్మాస్త్ర పార్ట్ 2 దేవా ఉంటుంది.
This post was last modified on September 6, 2024 5:42 am
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…