Movie News

తారక్ కోసం అలియా భట్ ఆలస్యం

ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితురాలిగా మారిపోయిన అలియా భట్ కొత్త సినిమా జిగ్రా అక్టోబర్ 11 విడుదల కానుంది. నిజానికి దీనికి ముందు అనుకున్న తేదీ అక్టోబర్ 2.

గాంధీ జయంతితో మొదలుపెట్టి దసరా సెలవుల దాకా లాంగ్ సీజన్ దొరుకుతుందనే ఉద్దేశంతో అలా ప్లాన్ చేసుకున్నారు. అయితే దేవర పార్ట్ వన్ సెప్టెంబర్ 27 వస్తున్న నేపథ్యంలో కేవలం వారం గ్యాప్ లో జిగ్రాని దించడం రిస్క్ అవుతుంది. ఎందుకంటే జిగ్రా నిర్మాతల్లో ఒకరైన ధర్మా ప్రొడక్షన్స్ హిందీ వెర్షన్ దేవరని నార్త్ మార్కెట్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది కనక సర్దుబాటు తప్పలేదు.

దీంతో తారక్ కోసం అలియా ఆలస్యంగా వస్తోందని ముంబై టాక్. అలాని జిగ్రాకి పోటీ లేదని కాదు. సౌత్ మార్కెట్ లో తీవ్రమైన కాంపిటీషన్ ఉంది. రజనీకాంత్ వెట్టయన్, గోపీచంద్ విశ్వం, ధృవ సర్జ మార్టిన్ లు భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నాయి. ఇవి ఖచ్చితంగా అలియా ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తాయి. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నాగ చైతన్య కాబోయే శ్రీమతి శోభిత ధూళిపాళ ఒక కీలక పాత్ర చేయడం విశేషం. తోడబుట్టిన వాడి కోసం ఎంత దూరమైనా వెళ్లి ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదురుకునే పాత్రలో అలియా భట్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందట.

స్త్రీ 2 నుంచి బాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరోలే చతికిలపడుతున్న టైంలో కేవలం కంటెంట్ ని నమ్ముకుని అయిదు వందల కోట్ల వైపు పరుగులు పెట్టడం ఎవరూ ఊహించలేదు. అందుకే బయ్యర్లు కాంబినేషన్లను నమ్ముకోకుండా జనాల్లో అంచనాలు రేపిన వాటి మీదే పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏడాది రాకీ రాణికి ప్రేమ్ కహాని తర్వాత అలియా మళ్ళీ తెరపై కనిపించలేదు. బిడ్డకు జన్మనిచ్చాక ఒప్పుకున్న సినిమా ఆల్పా ఒకటే. ఇది స్పై థ్రిల్లర్. జిగ్రా అంతకు ముందే పూర్తయ్యింది. తర్వాత బ్రహ్మాస్త్ర పార్ట్ 2 దేవా ఉంటుంది.

This post was last modified on September 6, 2024 5:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

17 minutes ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

1 hour ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

2 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

4 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

4 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

4 hours ago