రేపు విడుదల కాబోతున్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం మీద తమిళనాడు కాకుండా ఇతర రాష్ట్రాల్లో తక్కువ హైప్ ఉండటం చూసి ట్రేడ్ ఆశ్చర్యపోతోంది. కాంబోలతో సంబంధం లేకుండా మాములుగా విజయ్ సినిమా అంటేనే ప్రత్యేకమైన క్రేజ్ వచ్చేస్తుంది. అందులోనూ ఏపీ తెలంగాణలో తుపాకీ నుంచి లియో దాకా అతని మార్కెట్ అంతకంతా పెరుగుతూ పోయిందే తప్ప తగ్గలేదు. కానీ గోట్ విషయంలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఉండటం షాక్ కలిగిస్తోంది. ఇక బిసి సెంటర్స్ లో ఎలా ఉందో వేరే చెప్పనక్కర్లేదు. కౌంటర్ సేల్స్ మీదే ఆధారపడాలి.
దర్శకుడు వెంకట్ ప్రభు బ్రాండ్, యువన్ శంకర్ రాజా ఇచ్చిన వీక్ ఆల్బమ్, అంచనాలు పెంచని ట్రైలర్ ఇవన్నీ గోట్ కు ప్రతికూలంగా మారాయి. వీటిని పక్కనపెడితే ఈ ప్యాన్ ఇండియా మూవీకి తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లని ట్రేడ్ రిపోర్ట్. ఇంత మొత్తం రావాలంటే మాములు టాక్ వస్తే సరిపోదు. విక్రమ్, జైలర్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలి. ఆ రెండూ రిలీజ్ కు ముందు బజ్ పెంచుకున్నవి. గోట్ కు ఆ సానుకూలత లేదు. పైగా ఎప్పటిలాగే విజయ్ లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపించడంతో ఎక్కువ శాతం ప్రేక్షకుల దృష్టిలో పడలేదు.
సో గోట్ ముందు పెద్ద సవాల్ ఉంది. కంటెంట్ మీద నమ్మకంతో హైదరాబాద్ లో తెల్లవారుఝామున 4 గంటలకు స్పెషల్ షోలు వేయడానికి అనుమతులు తెచ్చుకున్నారు. కొంచెం ఆలస్యమైనా పర్మిషన్లు అయితే వచ్చేశాయి. వీటికి వచ్చే టాక్ చాలా కీలకం కానుంది.. విజయ్ డ్యూయల్ రోల్ చేసిన ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంలో మీనాక్షి చౌదరి, స్నేహ, ప్రభుదేవా, ప్రశాంత్, మౌనరాగం మోహన్ లాంటి పెద్ద క్యాస్టింగ్ ఉంది. బడ్జెట్ కూడా రెండు వందల కోట్లకు పైగా పెట్టారట. ట్విస్ట్ ఏంటంటే విజయ్ ఎక్స్ హ్యాండిల్ లో ఆగస్ట్ 17 తర్వాత ఎలాంటి అప్డేట్ లేకపోవడమే. రిలీజ్ పోస్టర్ కూడా పంచుకోలేదు.
This post was last modified on September 4, 2024 5:31 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…