సినిమా కోసం తమిళ నటుడు విక్రమ్ ఎంతగా తపిస్తాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాను పోషించే పాత్ర కోసం ఎంతగా అయినా శ్రమించడానికి, అవతారం మార్చుకోవడానికి అతను సిద్ధం. హీరోగా తనకు తొలి బ్రేక్ ఇచ్చిన సేతు సినిమాలో ఒక చోట పాత్ర నల్లగా, బలహీనంగా కనిపించాలని అంటే అందుకోసం తిండి మాని, గంటల తరబడి ఎండలో నిలబడ్డ డెడికేషన్ అతడిది. ఇంకా కెరీర్లో ఎన్నో పాత్రల కోసం ఒళ్లు హూనం చేసుకున్న చరిత్ర అతడికి ఉంది.
ఐతే కాశి సినిమా కోసం తాను పడ్డ కష్టంతో తన చూపే పోయే ప్రమాదంలో పడ్డానని.. కొన్ని రోజులు చూపు మందగించిందని విక్రమ్ వెల్లడించడం విశేషం. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్రమ్ ఈ విషయం తెలిపాడు.
తెలుగులో ఆర్పీ పట్నాయక్ హీరోగా నటించిన శీను వాసంతి లక్ష్మి సినిమా మాతృకే కాశి. ఈ చిత్రంలో విక్రమ్ అంధుడిగా నటించాడు. ఈ మూవీ మంచి హిట్ కావడమే కాక అనేక అవార్డులూ గెలుచుకుంది. ఐతే ఈ సినిమా కోసం కొన్ని నెలల పాటు కళ్లు పైకి పెట్టి నిజమైన అంధుడిలా కనిపించేలా నటించానని.. దీని వల్ల తన కళ్లు దెబ్బ తిన్నాయని విక్రమ్ తెలిపాడు. వైద్యుడిని కలిస్తే.. చూపు మందగించిన విషయం ధ్రువీకరిస్తూ ఇలాగే ఇంకొన్ని రోజులు చేస్తే చూపు పూర్తిగా పోయేదని చెప్పినట్లు విక్రమ్ చెప్పాడు.
తన కెరీర్లో ఇలా ఎక్కువ కష్టపడి ప్రమాదం కొనితెచ్చుకున్న సినిమా ఐ అని వెల్లడించాడు విక్రమ్. ఆ సినిమా కోసం 82 కిలోల నుంచి 52 కిలోలకు బరువు తగ్గానని.. పాత్ర కోసం ఇంకా బరువు తగ్గాలనుకుంటున్న సమయంలో డాక్టర్ తనను హెచ్చరించినట్లు తెలిపాడు విక్రమ్. ఇంకా బరువు తగ్గితే అవయవాలు పని చేయడం మానేస్తాయని.. ప్రాణమే పోతుందని హెచ్చరించడంతో తాను ఆ ప్రయత్నం మానుకున్నానని చెప్పాడు. ఐతే సినిమా కోసం, పాత్ర కోసం ఎంతైనా కష్టపడడానికి తాను ఎప్పుడూ సిద్ధమని, అది తనకెంతో ఆనందాన్నిస్తుందని విక్రమ్ చెప్పడం విశేషం.
This post was last modified on September 4, 2024 10:59 am
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…