సినిమా కోసం తమిళ నటుడు విక్రమ్ ఎంతగా తపిస్తాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాను పోషించే పాత్ర కోసం ఎంతగా అయినా శ్రమించడానికి, అవతారం మార్చుకోవడానికి అతను సిద్ధం. హీరోగా తనకు తొలి బ్రేక్ ఇచ్చిన సేతు సినిమాలో ఒక చోట పాత్ర నల్లగా, బలహీనంగా కనిపించాలని అంటే అందుకోసం తిండి మాని, గంటల తరబడి ఎండలో నిలబడ్డ డెడికేషన్ అతడిది. ఇంకా కెరీర్లో ఎన్నో పాత్రల కోసం ఒళ్లు హూనం చేసుకున్న చరిత్ర అతడికి ఉంది.
ఐతే కాశి సినిమా కోసం తాను పడ్డ కష్టంతో తన చూపే పోయే ప్రమాదంలో పడ్డానని.. కొన్ని రోజులు చూపు మందగించిందని విక్రమ్ వెల్లడించడం విశేషం. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్రమ్ ఈ విషయం తెలిపాడు.
తెలుగులో ఆర్పీ పట్నాయక్ హీరోగా నటించిన శీను వాసంతి లక్ష్మి సినిమా మాతృకే కాశి. ఈ చిత్రంలో విక్రమ్ అంధుడిగా నటించాడు. ఈ మూవీ మంచి హిట్ కావడమే కాక అనేక అవార్డులూ గెలుచుకుంది. ఐతే ఈ సినిమా కోసం కొన్ని నెలల పాటు కళ్లు పైకి పెట్టి నిజమైన అంధుడిలా కనిపించేలా నటించానని.. దీని వల్ల తన కళ్లు దెబ్బ తిన్నాయని విక్రమ్ తెలిపాడు. వైద్యుడిని కలిస్తే.. చూపు మందగించిన విషయం ధ్రువీకరిస్తూ ఇలాగే ఇంకొన్ని రోజులు చేస్తే చూపు పూర్తిగా పోయేదని చెప్పినట్లు విక్రమ్ చెప్పాడు.
తన కెరీర్లో ఇలా ఎక్కువ కష్టపడి ప్రమాదం కొనితెచ్చుకున్న సినిమా ఐ అని వెల్లడించాడు విక్రమ్. ఆ సినిమా కోసం 82 కిలోల నుంచి 52 కిలోలకు బరువు తగ్గానని.. పాత్ర కోసం ఇంకా బరువు తగ్గాలనుకుంటున్న సమయంలో డాక్టర్ తనను హెచ్చరించినట్లు తెలిపాడు విక్రమ్. ఇంకా బరువు తగ్గితే అవయవాలు పని చేయడం మానేస్తాయని.. ప్రాణమే పోతుందని హెచ్చరించడంతో తాను ఆ ప్రయత్నం మానుకున్నానని చెప్పాడు. ఐతే సినిమా కోసం, పాత్ర కోసం ఎంతైనా కష్టపడడానికి తాను ఎప్పుడూ సిద్ధమని, అది తనకెంతో ఆనందాన్నిస్తుందని విక్రమ్ చెప్పడం విశేషం.
This post was last modified on September 4, 2024 10:59 am
తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ రెండు పదుల వయసులో కూడా లేని స్థితిలో క్యాన్సర్ బారిన పడి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంట్లో ఉన్న గోశాలకు పండగ వచ్చింది. సుమారు 30 గోవులను ఈ గోశాలలో పెంచు తున్నారు.…
డెబ్యూతోనే సెన్సేషనల్ హిట్ అందుకుని ఆ తర్వాత వరస డిజాస్టర్లతో టాలీవుడ్ మార్కెట్ కోల్పోయిన హీరోయిన్ కృతి శెట్టి మలయాళం…
"తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ.. చిట్టినాయుడు. మేం చంద్రబాబు నాయుడితోనే కొట్టాడినం. ఈయనెం త?" అని బీఆర్ ఎస్…
హీరోయిన్గా రెజీనా కసాండ్రా.. ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ.. ఇంకా చాలామంది ప్రముఖ…
సినిమాల ప్రమోషన్లు రోజు రోజుకూ కొంత పుత్తలు తొక్కుతున్నాయి. ఒక మూసలో సాగిపోతే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కష్టం కాబట్టి..…