Movie News

చ‌నిపోయిన సోద‌రి.. ఏఐ సాయంతో పాట‌

లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇళ‌య‌రాజా కుటుంబంలో సంగీతంతో అనుబంధం ఉన్న వాళ్లు చాలామంది ఉన్నారు. ఆయ‌న సోద‌రుడు గంగై అమ‌ర‌న్ సంగీత ద‌ర్శ‌కుడే. కొడుకు యువ‌న్ శంక‌ర్ రాజా స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే.

ఇళ‌య‌రాజా త‌న‌యురాలైన దివంగ‌త భ‌వ‌తారిణి గాయ‌ని, సంగీత ద‌ర్శ‌కురాలు. ఆమె కొన్ని నెల‌ల కింద‌టే క్యాన్స‌ర్ వ్యాధితో చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. అయినా స‌రే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్‌) ఆమెతో పాడించాల‌నుకున్న పాట‌ను ఏఐ సాయంతో పూర్తి చేసిన‌ట్లు ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు వెల్ల‌డించాడు. గంగై అమ‌ర‌న్ త‌న‌యుడైన వెంక‌ట్‌కు కూడా భ‌వ‌తారిణి సోద‌రే అవుతుంది. ఈ అనుభ‌వం గురించి మాట్లాడుతూ ఓ ఇంట‌ర్వ్యూలో వెంక‌ట్ భావోద్వేగానికి గుర‌య్యాడు.

గోట్ మూవీలో కోసం కంపోజ్ చేయాల‌నుకున్న‌ చిన్న చిన్న కంగళ్‌ సాంగ్‌ థీమ్‌ గురించి యువన్‌ నాకు చెప్పాడు. ఆ పాటను భవతారిణితో పాడించాలని నిర్ణయించుకున్నాం. కానీ ఆ సమయంలో త‌ను అనారోగ్యంతో ఉంది. కోలుకుని చెన్నై వచ్చాక పాడతారనుకున్నాం. ట్యూన్‌ పూర్తయిన రోజే దురదృష్టవశాత్తూ ఆమె మరణించింది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో ‘లాల్‌ సలామ్‌’ సినిమాలోని ఓ పాటలో దివంగత గాయకుడు రాహుల్‌ హమీద్‌ గాత్రాన్ని వినిపించినప్పుడు.. మనమెందుకు అలా చేయకూడదని యువన్‌ను అడిగా. ఆ టెక్నాలజీ గురించి రెహమాన్ టీంను అడిగి తెలుసుకున్నాం. భవతారణి రా వాయిస్‌ తీసుకుని, మరో సింగర్‌ ప్రియదర్శిని సాయంతో ఏఐ ద్వారా మంచి అవుట్‌పుట్‌ తీసుకురాగలిగాం. ట్యూన్‌ బాగా నచ్చడంతో స్వయంగా విజయ్‌ ఈ పాటలో భాగ‌మ‌వుతాన‌న్నారు. అలా విజయ్‌, భవతారణిల గాత్రంతో రూపొందిన ఈ పాటకు మంచి ఆదరణ దక్కింది అని వెంక‌ట్ ప్ర‌భు వెల్ల‌డించాడు. భ‌వ‌తారిణి తెలుగులో గుండెల్లో గోదారి సినిమాలో’నను నీతో నిను నాతో కలిపింది గోదారి’ పాట పాడింది. ఆమె గ‌తంలో ఉత్త‌మ గాయనిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది.

This post was last modified on September 4, 2024 10:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జైల్లో ఎంజాయ్ చేసిన అంబటి

ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…

16 minutes ago

చేదుగా ఉన్నా నిజం చెప్పిన దిల్ రాజు

ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…

53 minutes ago

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…

3 hours ago

‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!

తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…

3 hours ago

పుష్ప స్టైల్ లో లోకేష్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను వీక్షించడం…

3 hours ago

డిల్లీ వేదికపై చైనా రోబో.. ఏంటి వివాదం?

ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…

4 hours ago