లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కుటుంబంలో సంగీతంతో అనుబంధం ఉన్న వాళ్లు చాలామంది ఉన్నారు. ఆయన సోదరుడు గంగై అమరన్ సంగీత దర్శకుడే. కొడుకు యువన్ శంకర్ రాజా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే.
ఇళయరాజా తనయురాలైన దివంగత భవతారిణి గాయని, సంగీత దర్శకురాలు. ఆమె కొన్ని నెలల కిందటే క్యాన్సర్ వ్యాధితో చనిపోయిన సంగతి తెలిసిందే. అయినా సరే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్) ఆమెతో పాడించాలనుకున్న పాటను ఏఐ సాయంతో పూర్తి చేసినట్లు దర్శకుడు వెంకట్ ప్రభు వెల్లడించాడు. గంగై అమరన్ తనయుడైన వెంకట్కు కూడా భవతారిణి సోదరే అవుతుంది. ఈ అనుభవం గురించి మాట్లాడుతూ ఓ ఇంటర్వ్యూలో వెంకట్ భావోద్వేగానికి గురయ్యాడు.
గోట్ మూవీలో కోసం కంపోజ్ చేయాలనుకున్న చిన్న చిన్న కంగళ్ సాంగ్ థీమ్ గురించి యువన్ నాకు చెప్పాడు. ఆ పాటను భవతారిణితో పాడించాలని నిర్ణయించుకున్నాం. కానీ ఆ సమయంలో తను అనారోగ్యంతో ఉంది. కోలుకుని చెన్నై వచ్చాక పాడతారనుకున్నాం. ట్యూన్ పూర్తయిన రోజే దురదృష్టవశాత్తూ ఆమె మరణించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ‘లాల్ సలామ్’ సినిమాలోని ఓ పాటలో దివంగత గాయకుడు రాహుల్ హమీద్ గాత్రాన్ని వినిపించినప్పుడు.. మనమెందుకు అలా చేయకూడదని యువన్ను అడిగా. ఆ టెక్నాలజీ గురించి రెహమాన్ టీంను అడిగి తెలుసుకున్నాం. భవతారణి రా వాయిస్ తీసుకుని, మరో సింగర్ ప్రియదర్శిని సాయంతో ఏఐ ద్వారా మంచి అవుట్పుట్ తీసుకురాగలిగాం. ట్యూన్ బాగా నచ్చడంతో స్వయంగా విజయ్ ఈ పాటలో భాగమవుతానన్నారు. అలా విజయ్, భవతారణిల గాత్రంతో రూపొందిన ఈ పాటకు మంచి ఆదరణ దక్కింది అని వెంకట్ ప్రభు వెల్లడించాడు. భవతారిణి తెలుగులో గుండెల్లో గోదారి సినిమాలో’నను నీతో నిను నాతో కలిపింది గోదారి’ పాట పాడింది. ఆమె గతంలో ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది.
This post was last modified on September 4, 2024 10:50 am
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…