లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కుటుంబంలో సంగీతంతో అనుబంధం ఉన్న వాళ్లు చాలామంది ఉన్నారు. ఆయన సోదరుడు గంగై అమరన్ సంగీత దర్శకుడే. కొడుకు యువన్ శంకర్ రాజా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే.
ఇళయరాజా తనయురాలైన దివంగత భవతారిణి గాయని, సంగీత దర్శకురాలు. ఆమె కొన్ని నెలల కిందటే క్యాన్సర్ వ్యాధితో చనిపోయిన సంగతి తెలిసిందే. అయినా సరే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్) ఆమెతో పాడించాలనుకున్న పాటను ఏఐ సాయంతో పూర్తి చేసినట్లు దర్శకుడు వెంకట్ ప్రభు వెల్లడించాడు. గంగై అమరన్ తనయుడైన వెంకట్కు కూడా భవతారిణి సోదరే అవుతుంది. ఈ అనుభవం గురించి మాట్లాడుతూ ఓ ఇంటర్వ్యూలో వెంకట్ భావోద్వేగానికి గురయ్యాడు.
గోట్ మూవీలో కోసం కంపోజ్ చేయాలనుకున్న చిన్న చిన్న కంగళ్ సాంగ్ థీమ్ గురించి యువన్ నాకు చెప్పాడు. ఆ పాటను భవతారిణితో పాడించాలని నిర్ణయించుకున్నాం. కానీ ఆ సమయంలో తను అనారోగ్యంతో ఉంది. కోలుకుని చెన్నై వచ్చాక పాడతారనుకున్నాం. ట్యూన్ పూర్తయిన రోజే దురదృష్టవశాత్తూ ఆమె మరణించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ‘లాల్ సలామ్’ సినిమాలోని ఓ పాటలో దివంగత గాయకుడు రాహుల్ హమీద్ గాత్రాన్ని వినిపించినప్పుడు.. మనమెందుకు అలా చేయకూడదని యువన్ను అడిగా. ఆ టెక్నాలజీ గురించి రెహమాన్ టీంను అడిగి తెలుసుకున్నాం. భవతారణి రా వాయిస్ తీసుకుని, మరో సింగర్ ప్రియదర్శిని సాయంతో ఏఐ ద్వారా మంచి అవుట్పుట్ తీసుకురాగలిగాం. ట్యూన్ బాగా నచ్చడంతో స్వయంగా విజయ్ ఈ పాటలో భాగమవుతానన్నారు. అలా విజయ్, భవతారణిల గాత్రంతో రూపొందిన ఈ పాటకు మంచి ఆదరణ దక్కింది అని వెంకట్ ప్రభు వెల్లడించాడు. భవతారిణి తెలుగులో గుండెల్లో గోదారి సినిమాలో’నను నీతో నిను నాతో కలిపింది గోదారి’ పాట పాడింది. ఆమె గతంలో ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది.
This post was last modified on September 4, 2024 10:50 am
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…