Movie News

ఔను….వాళ్ళందరూ మిస్సయ్యారు

నిన్న జరిగిన బాలకృష్ణ యాభైయ్యవ నట స్వర్ణోత్సవ వేడుక కనులపండలా జరిగింది కానీ కొన్ని అంశాల్లో పక్కనపెట్టలేనివి ఉన్నాయి. మొదటిది అక్కినేని నాగార్జున గైర్హాజరు. బిగ్ బాస్ సీజన్ 8 షూటింగ్ కారణమని అన్నపూర్ణ స్టూడియో వర్గాలు చెబుతున్నప్పటికీ కాసేపు వచ్చి వెళ్లి ఉంటే బాగుండేదనే అభిప్రాయం జనంలో లేకపోలేదు.

ఇద్దరి మధ్య విభేదాల గురించి ఆ మధ్య కొన్ని ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. వాటికి ప్యాచ్ జరిగేలా ఈ సెలబ్రేషన్ ఉపయోగడుతుందని అందరూ అనుకున్నారు. కానీ కుదరలేదు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ ఉన్న అరుదైన ఫ్రేమ్ లో మిస్సయ్యింది నాగే.

ఇక రెండో విషయం జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం. తల్లి, భార్యతో కలిసి కర్ణాటక పుణ్యక్షేత్రాల సందర్శనలో తారక్ బిజీగా ఉన్నాడు. మిత్రులు రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ తో కలిసి దర్శననీయ స్థలాలను చుట్టేస్తున్నాడు. ఎప్పటికప్పుడు వాటి ఫోటోలను, వీడియోలను క్రమం తప్పకుండా సోషల్ మీడియాకు ఇస్తున్నాడు. నిజానికి ఈ ట్రిప్ తర్వాతయినా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ బాలయ్య 50 జరుగుతున్న టైంలోనే వెళ్లడం చూస్తే ఈవెంట్ కు అసలు ఆహ్వానం వెళ్లిందా లేదానే అనుమానాలు ఫ్యాన్స్ లో తలెత్తుతున్నాయి. అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా కనిపించకపోవడం వీటికి మరింత బలం చేకూర్చింది.

ఇక చివరి క్షణం వరకు వస్తాడని ప్రచారం జరిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. కమిటీ సభ్యులు వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానిస్తే సానుకూలంగా స్పందించాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న నెగటివిటీని దృష్టిలో పెట్టుకుని వద్దన్నారా లేక వేరే రీజన్ ఉందా అంటే ఖచ్చితంగా చెప్పలేం.

కారణాలు ఏమైనా నాగ్, తారక్, బన్నీ లేకపోవడం కొంత లోటుగా అనిపించిన మాట వాస్తవం. ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్ వచ్చి ఉంటే బాగుండేది కానీ స్థానికంగా అందుబాటులో లేని కారణంగా సాధ్యపడలేదు కాబట్టి ప్రత్యేకంగా ఎంచి చూపించలేం.

ఎందరో దర్శకులు, కొత్త తరం హీరోలు, పక్క రాష్ట్రం నుంచి వచ్చిన శివ రాజ్ కుమార్, ఉపేంద్ర లాంటి స్టార్లు ఇలా మల్టీస్టారర్ సంబరంగా అనిపించినా క్షణాల్లో ఈ ముగ్గురు ఉంటే ఇంకా నిండుగా ఉండేది. ఈ నెల 22న ఏపిలో బాలయ్య కోసం మరో స్వర్ణోత్సవం చేస్తున్నారనే టాక్ ఉంది. ఒకవేళ ఇది నిజమైతే ముందు వచ్చిన వారందరినీ చూడలేం కానీ చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డిలతో పాటు మిస్సయిన మరికొందరు వస్తారేమో వేచి చూడాలి.

This post was last modified on September 2, 2024 2:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

2 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

4 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

7 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

8 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

9 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

9 hours ago