Movie News

ఔను….వాళ్ళందరూ మిస్సయ్యారు

నిన్న జరిగిన బాలకృష్ణ యాభైయ్యవ నట స్వర్ణోత్సవ వేడుక కనులపండలా జరిగింది కానీ కొన్ని అంశాల్లో పక్కనపెట్టలేనివి ఉన్నాయి. మొదటిది అక్కినేని నాగార్జున గైర్హాజరు. బిగ్ బాస్ సీజన్ 8 షూటింగ్ కారణమని అన్నపూర్ణ స్టూడియో వర్గాలు చెబుతున్నప్పటికీ కాసేపు వచ్చి వెళ్లి ఉంటే బాగుండేదనే అభిప్రాయం జనంలో లేకపోలేదు.

ఇద్దరి మధ్య విభేదాల గురించి ఆ మధ్య కొన్ని ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. వాటికి ప్యాచ్ జరిగేలా ఈ సెలబ్రేషన్ ఉపయోగడుతుందని అందరూ అనుకున్నారు. కానీ కుదరలేదు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ ఉన్న అరుదైన ఫ్రేమ్ లో మిస్సయ్యింది నాగే.

ఇక రెండో విషయం జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం. తల్లి, భార్యతో కలిసి కర్ణాటక పుణ్యక్షేత్రాల సందర్శనలో తారక్ బిజీగా ఉన్నాడు. మిత్రులు రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ తో కలిసి దర్శననీయ స్థలాలను చుట్టేస్తున్నాడు. ఎప్పటికప్పుడు వాటి ఫోటోలను, వీడియోలను క్రమం తప్పకుండా సోషల్ మీడియాకు ఇస్తున్నాడు. నిజానికి ఈ ట్రిప్ తర్వాతయినా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ బాలయ్య 50 జరుగుతున్న టైంలోనే వెళ్లడం చూస్తే ఈవెంట్ కు అసలు ఆహ్వానం వెళ్లిందా లేదానే అనుమానాలు ఫ్యాన్స్ లో తలెత్తుతున్నాయి. అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా కనిపించకపోవడం వీటికి మరింత బలం చేకూర్చింది.

ఇక చివరి క్షణం వరకు వస్తాడని ప్రచారం జరిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. కమిటీ సభ్యులు వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానిస్తే సానుకూలంగా స్పందించాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న నెగటివిటీని దృష్టిలో పెట్టుకుని వద్దన్నారా లేక వేరే రీజన్ ఉందా అంటే ఖచ్చితంగా చెప్పలేం.

కారణాలు ఏమైనా నాగ్, తారక్, బన్నీ లేకపోవడం కొంత లోటుగా అనిపించిన మాట వాస్తవం. ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్ వచ్చి ఉంటే బాగుండేది కానీ స్థానికంగా అందుబాటులో లేని కారణంగా సాధ్యపడలేదు కాబట్టి ప్రత్యేకంగా ఎంచి చూపించలేం.

ఎందరో దర్శకులు, కొత్త తరం హీరోలు, పక్క రాష్ట్రం నుంచి వచ్చిన శివ రాజ్ కుమార్, ఉపేంద్ర లాంటి స్టార్లు ఇలా మల్టీస్టారర్ సంబరంగా అనిపించినా క్షణాల్లో ఈ ముగ్గురు ఉంటే ఇంకా నిండుగా ఉండేది. ఈ నెల 22న ఏపిలో బాలయ్య కోసం మరో స్వర్ణోత్సవం చేస్తున్నారనే టాక్ ఉంది. ఒకవేళ ఇది నిజమైతే ముందు వచ్చిన వారందరినీ చూడలేం కానీ చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డిలతో పాటు మిస్సయిన మరికొందరు వస్తారేమో వేచి చూడాలి.

This post was last modified on September 2, 2024 2:10 pm

Share

Recent Posts

జోగి ఫ్యామిలీలో `కోడ‌లి` కుదుపు!

వైసీపీ నేత‌, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఫ్యామిలీలో కోడ‌లు చేసిన ఆరోప‌ణలు పెను కుదుపున‌కు…

35 minutes ago

కొత్త సినిమాల్లో పొలిటికల్ పంచులు చూశారా?

సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…

1 hour ago

థియేటర్ చెక్స్… నాయకుడి పద్దతి బాగుంది

జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…

1 hour ago

రఘురామ వెరీ హ్యాపీ: ఆకివీడు రామాల‌యానికి సుప్రీం ఓకే!

ఏపీలో గ‌త 2 మాసాల కింద‌టి వ‌ర‌కు తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయిన ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, ఉండి నియోజ‌క‌వ‌ర్గం…

1 hour ago

కొట్టే హ‌క్కు పోలీసుల‌కు ఉందా?: సుప్రీంకోర్టు ఘాటు ప్ర‌శ్న‌

ప్ర‌జ‌లు, శాంతియుతంగా నిర‌స‌న చేస్తున్న‌వారిని కొట్టే హ‌క్కు పోలీసుల‌కు ఉందా? అని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…

2 hours ago

సొంత పార్టీ లేన‌ట్టే… సాయిరెడ్డి వెనుక‌డుగు రీజ‌నిదేనా?

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడ‌తాన‌ని కొన్నాళ్ల కింద‌టే ప్ర‌క‌టించారు.…

2 hours ago