నిన్న సాయంత్రం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిన బాలకృష్ణ 50వ స్వర్ణోత్సవం అంత వర్షంలోనూ ఘనంగా ముగిసింది. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా సెలబ్రిటీలతో పాటు అశేష సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కొత్త జనరేషన్ యువ హీరోలు బాలయ్య పట్ల తమ మనసులో గూడుకట్టుకున్న అభిమానాన్ని ప్రదర్శించారు. సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ కలిసిన అయిదారుసార్లు నిజాయితీ ఉన్నవాళ్ళను బాలయ్య ఖచ్చితంగా ఇష్టపడతారని అర్థమయ్యిందని, ఆయన అనుభవమంత లేని వయసులో స్ఫూర్తిగా తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.
విజయ్ దేవరకొండ మాటల్లో యాభై సంవత్సరాల పాటు నటనలో ఉండటమే కాక వైద్య రంగంలోనూ ముద్ర వేసిన బాలయ్య గారి ఆసుపత్రిలో తనకు తెలిసిన వాళ్ళు చికిత్స తీసుకున్న ఉదంతాన్ని గుర్తు చేశాడు. లైగర్ షూటింగ్ లో మొదటిసారి కలుసుకున్న జ్ఞాపకాన్ని పంచుకుని ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకున్నాడు. నాని ప్రసంగిస్తూ తన వయసు కన్నా పదేళ్లు ఎక్కువగా ఈ వేడుకలు జరుగుతున్నాయని, ఒక్కసారి కలిసిన, మాట్లాడిన వెంటనే ఎవరైనా ఇష్టపడే వ్యక్తిత్వమని, ఇలాగే మరో వంద సంవత్సరాలు ఇంకో వంద సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపాడు.
దగ్గుబాటి రానా తన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ బాలయ్య సినిమా విడుదల రోజే పుట్టాను కాబట్టి అల్లరి చేయడం వచ్చేసిందని చెబుతూ జై బాలయ్య నినాదంతో ముగించాడు. మంచు విష్ణు మాట్లాడుతూ నాన్న మోహన్ బాబు, బాలకృష్ణ గారి వల్లే ఇప్పుడీ స్థానంలో ఉన్నానని, స్వచ్ఛమైన హృదయంతో ఆయన చేసిన సేవలు ఎవరికి సాధ్యం కావని గౌరవం చాటుకున్నాడు. చిన్నప్పుడు డాన్సుల గురించి అడవి శేష్ పంచుకోగా అల్లరి నరేష్ సరదా మనిషిగా బాలయ్యని అభివర్ణించారు. ఇందరు కొత్త జనరేషన్ హీరోల నోటి వెంట బాలకృష్ణ వ్యకిత్వం గురించి వింటున్నప్పుడు కలిగే ఆనందం కన్నా ఫ్యాన్స్ ఇంకేం కోరుకుంటారు.
This post was last modified on September 2, 2024 10:59 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…