Movie News

కుర్రోళ్ళు ఇచ్చిన ధైర్యంతో 35 ప్రీమియర్లు

ఏదైనా సినిమాకు ముందు రోజు ప్రీమియర్లు వేయాలంటే నిర్మాతలకు టెన్షన్ తోనే తల బద్దలైపోతోంది. ఎంతో నమ్మకంతో తీసుంటారు కానీ ఏ మాత్రం తేడా వచ్చినా అర్ధరాత్రి దాటే లోపే టాక్ డ్యామేజ్ చేస్తోంది. ఇటీవలే మిస్టర్ బచ్చన్ ఈ తప్పు చేయడం వల్ల ఓపెనింగ్స్ ప్రభావితం చెంది డిజాస్టర్ టాక్ ని మరింత వేగంగా పాకేలా చేసింది. అలాని అందరికీ ఇలా జరగలేదు. గతంలో మేజర్, 777 ఛార్లీ, హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్లు ఒక రోజు ముందే స్పెషల్ షోలతో బ్రహ్మాండమైన లబ్ది పొందాయి. ఇటీవలే కమిటీ కుర్రోళ్ళు లాంటి చిన్న చిత్రం ఈ సాహసం చేసి సూపర్ హిట్ కి దారులు వేసుకుంది.

ఆయ్ తీసిన కుర్రకారు సైతం ఇదే ఫార్ములా వాడి ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. వీళ్ళిచ్చిన స్ఫూర్తితో 35 చిన్న కథ కాదు సైతం ఎర్లీ ప్రీమియర్లకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 6 విడుదల కాబోతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు రెండు రోజులు ముందే అంటే నాలుగు, అయిదు తేదీల్లో షోలు వేయబోతున్నారు. హైదరాబాద్ బుకింగ్స్ ఆల్రెడీ మొదలుపెట్టారు. ఇతర ప్రధాన కేంద్రాల్లో వేసే ఆలోచన చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన నిర్ణయం రేపో ఎల్లుండో వెలువడనుంది. నివేదా థామస్ ప్రధాన పాత్ర పోషించిన 35 చిన్న కథ కాదుకి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

ఇంత ధైర్యంతో ముందెకెళ్తున్నారంటే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉన్నట్టే. ఒకరకంగా ఇది మంచి స్ట్రాటజీ. ఎందుకంటే వినాయకచవితికి పోటీ గట్టిగానే ఉంది. అయిదున విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం, ఏడున సుహాస్ జనక అయితే గనకతో పాటు రాజ్ తరుణ్ భలే ఉన్నాడే థియేటర్లలో అడుగు పెడుతున్నాయి. తమిళ డబ్బింగ్ మూవీని పక్కనపెడితే మిగిలినవన్నీ చిన్న బడ్జెట్ తో రూపొందినవే. ఈ మధ్య సినిమా బాగుంటే చాలు కొత్తా పాత ఆర్టిస్టుల తేడా ప్రేక్షకులు ఆదరిస్తున్న తరుణంలో 35 చిన్న కథ కాదు ఆ ధైర్యంతోనే అడుగులు వేస్తోంది. ట్రైలర్ హోమ్లీగా, ఆకట్టుకునేలా కట్ చేయడం హైప్ తెచ్చేలా ఉంది. 

This post was last modified on November 23, 2024 4:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

46 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

48 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago