Movie News

గబ్బర్ సింగ్ వెనుక త్రివిక్రమ్ శ్రీనివాస్

ఎల్లుండి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతున్న గబ్బర్ సింగ్ ఎన్నో విశేషాలను వెలికి తీస్తోంది. ఇవాళ జరిగిన ప్రీ రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి. అందులో ఈ సినిమా వెనుక ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రమేయం గురించి కూడా ఉంది. నిర్మాత బండ్ల గణేష్ దాన్ని వివరించారు. దబాంగ్ బ్లాక్ బస్టర్ అయినప్పుడు తీన్ మార్ షూటింగ్ సమయంలో సోను సూద్ దాన్ని కొనమని సూచించడంతో హీరోకు చెప్పకుండా గణేష్ హక్కులను తీసుకుని వచ్చారు. అయితే పవన్ కళ్యాణే నిర్మాతగా దాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్లాన్ చేసుకుని ఫోటో షూట్ చేశారు.

తర్వాత ఒక రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ బండ్ల గణేష్ ని పిలిచి ఇది నువ్వే ప్రొడ్యూసర్ గా చేసుకోమని చెప్పగానే అలా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. ఆయన చెప్పకపోయినా దీని వెనుక మరో కోణం కూడా ఉంది. 2011లో తీన్ మార్ ఫెయిలయ్యింది. నిర్మాతగా బండ్ల బ్యానర్ కు ఇది పెద్ద కుదుపు. ఆ సినిమాకు రచయితగా సంభాషణలు రాసింది త్రివిక్రమే. దాని వల్ల నష్టపోయాడు కాబట్టి మళ్ళీ రికవర్ కావాలంటే ఇంకో హిట్ సినిమా పడాలనే ఉద్దేశంతో గబ్బర్ సింగ్ తిరిగి ఇతని చేతిలో పెట్టారు. కట్ చేస్తే అది అంచనాలకు మించి ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టేసింది.

పవన్ ఎన్ని సినిమాలు చేసినా గబ్బర్ సింగ్ మాత్రం అభిమానులకు చాలా స్పెషల్ గా నిలిచిపోయింది. అంత ఎనర్జీతో ఆయనని చూసిన ఆడియన్స్ థియేటర్లలోనే డాన్సులు చేశారు. సినిమాని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు రీ రిలీజ్ వేళ టికెట్ల కోసం ఏర్పడుతున్న డిమాండ్ చూస్తుంటే సరికొత్త మైలురాళ్ళు నమోదు కావడం ఖాయమే అనిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి గతంలో అసందర్భంగా చేసిన కొన్ని కామెంట్లకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పిన బండ్ల గణేష్ తన బ్రతుకుకో పరమార్థం కలిగించిన సంఘటన ఇదేనని గబ్బర్ సింగ్ నిర్మాణం వెనుక ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.

This post was last modified on August 31, 2024 4:21 pm

Share
Show comments
Published by
Satya
Tags: Trivikram

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

36 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago