ఎల్లుండి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతున్న గబ్బర్ సింగ్ ఎన్నో విశేషాలను వెలికి తీస్తోంది. ఇవాళ జరిగిన ప్రీ రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి. అందులో ఈ సినిమా వెనుక ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రమేయం గురించి కూడా ఉంది. నిర్మాత బండ్ల గణేష్ దాన్ని వివరించారు. దబాంగ్ బ్లాక్ బస్టర్ అయినప్పుడు తీన్ మార్ షూటింగ్ సమయంలో సోను సూద్ దాన్ని కొనమని సూచించడంతో హీరోకు చెప్పకుండా గణేష్ హక్కులను తీసుకుని వచ్చారు. అయితే పవన్ కళ్యాణే నిర్మాతగా దాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్లాన్ చేసుకుని ఫోటో షూట్ చేశారు.
తర్వాత ఒక రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ బండ్ల గణేష్ ని పిలిచి ఇది నువ్వే ప్రొడ్యూసర్ గా చేసుకోమని చెప్పగానే అలా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. ఆయన చెప్పకపోయినా దీని వెనుక మరో కోణం కూడా ఉంది. 2011లో తీన్ మార్ ఫెయిలయ్యింది. నిర్మాతగా బండ్ల బ్యానర్ కు ఇది పెద్ద కుదుపు. ఆ సినిమాకు రచయితగా సంభాషణలు రాసింది త్రివిక్రమే. దాని వల్ల నష్టపోయాడు కాబట్టి మళ్ళీ రికవర్ కావాలంటే ఇంకో హిట్ సినిమా పడాలనే ఉద్దేశంతో గబ్బర్ సింగ్ తిరిగి ఇతని చేతిలో పెట్టారు. కట్ చేస్తే అది అంచనాలకు మించి ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టేసింది.
పవన్ ఎన్ని సినిమాలు చేసినా గబ్బర్ సింగ్ మాత్రం అభిమానులకు చాలా స్పెషల్ గా నిలిచిపోయింది. అంత ఎనర్జీతో ఆయనని చూసిన ఆడియన్స్ థియేటర్లలోనే డాన్సులు చేశారు. సినిమాని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు రీ రిలీజ్ వేళ టికెట్ల కోసం ఏర్పడుతున్న డిమాండ్ చూస్తుంటే సరికొత్త మైలురాళ్ళు నమోదు కావడం ఖాయమే అనిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి గతంలో అసందర్భంగా చేసిన కొన్ని కామెంట్లకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పిన బండ్ల గణేష్ తన బ్రతుకుకో పరమార్థం కలిగించిన సంఘటన ఇదేనని గబ్బర్ సింగ్ నిర్మాణం వెనుక ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.
దేశంలో నేరాల స్థితి గతులు మారుతున్నాయా? ఒకప్పుడు నిరక్షరాస్యులు, కొద్దిమాత్రంగా చదువుకున్న వారే నేరాలకు పాల్పడేవారా? కానీ.. ఇప్పుడు ఉన్నతస్థాయి…
కేరాఫ్ కంచరపాలెం చిత్రంతో అరంగేట్రంలోనే ఇటు ఇండస్ట్రీని, అటు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన దర్శకుడు వెంకటేష్ మహా. కానీ…
వచ్చే ఎన్నికలతోపాటు.. పార్టీ పరంగా దూకుడుగా వ్యవహరించేందుకు ముఖ్యంగా వైసీపీ వంటి పార్టీలకు చెక్ పెట్టేందుకు.. సీనియర్ నాయకులు కావాలని…
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం విడుదల తేదీకి అఫీషియల్ ముద్ర పడిపోయింది. అక్టోబర్ 2…
హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ సమీప రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం…
అదేంటో గానీ… పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కు ఎటు వెళ్లినా విమర్శల జడివానే తప్పడం లేదు. సాధారణ…