ఈ మధ్య ఏదో ఒక ప్రత్యేకత లేనిదే ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను చూడటం లేదు. అందుకే నిజ జీవిత సంఘటనలను దర్శకులు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన సర్వైవల్ డ్రామా ఐసి 814 ది కాందహార్ ఎటాక్. 1999లో దేశాన్ని కుదిపేసిన విమానం హైజాక్ నేపథ్యంలో రూపొందించారు. అరవింద్ స్వామి, నసీరుద్దీన్ షా, విజయ్ వర్మ, పంకజ్ కపూర్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది. సగటు ఒక్కోటి నలభై అయిదు నిమిషాలతో మొత్తం ఆరు ఎపిసోడ్లతో వచ్చిన ఐసి 814ని ప్రత్యేకంగా ఎందుకు చూడాలనే పాయింట్ కొద్దాం.
90 దశకంలో భారతదేశం అణుపరీక్షలు నిర్వహించడం పాకిస్థాన్ తో పాటు అమెరికా, చైనా లాంటి దేశాలకు కంటగింపుగా మారుతుంది. కార్గిల్ విజయం దీనికి మరింత ఆజ్యం పోస్తుంది. అంతర్జాతీయ తీవ్రవాద నాయకుడిని మన ఆఫీసర్లు పట్టుకోవడంతో అతని ఎలాగైనా విడిపించాలంటే లక్ష్యంతో నేపాల్ లో ఉండే కొందరు టెర్రరిస్టులు కుట్ర పన్నుతారు. కాట్మండు నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఫ్లైట్ ని హైజాక్ చేసి దాన్ని అమ్రిత్సర్, దుబాయ్ మీదుగా కాందహార్ తీసుకెళ్తారు. తమ డిమాండ్లను ఇండియన్ గవర్నమెంట్ ముందు ఉంచుతారు. 170 ప్రాణాలను అప్పటి సర్కారు ఎలా కాపాడిందనేది స్టోరీ.
నాగార్జున గగనం తరహాలో అనిపించినప్పటికీ ఐసి 814 చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. మనకు తెలియని ఎన్నో విషయాలను వివరిస్తూనే స్క్రీన్ ప్లేని ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకులు అనుభవ్ సిన్హా, త్రిశాంత్ సక్సెసయ్యారు. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ మరింత విలువను పెంచింది. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా తీసుకున్న శ్రద్ధ, ఆర్ట్ వర్క్, విఎఫెక్స్ ఆకట్టుకుంటాయి. అయితే సగటు కమర్షియల్ యాంగిల్ లో థ్రిల్స్, ఎంటర్ టైన్మెంట్ ఆశిస్తే మాత్రం ఐసీ 814 మీ కప్పు కాఫీ కాదు. ఊకదంపుడు మసాలా కంటెంట్ తో విసిగిపోయి ఉంటే ఇది ట్రై చేయొచ్చు. కాలక్షేపం, జ్ఞానం రెండూ ఇస్తుంది.
This post was last modified on August 30, 2024 5:55 pm
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…