ఒకప్పుడు స్వీయ నిర్మాణంలో లాహిరి లాహిరి లాహిరి, దేవదాసు లాంటి బ్లాక్బస్టర్లు తీసి సాహసోపేతమైన ఫిలిం మేకర్గా పేరు తెచ్చుకున్నాడు వైవీఎస్ చౌదరి. ఆ సినిమాలను ఆయన ఎంతో రిస్క్ చేసి, అందులోని హీరోల మార్కెట్ పరిధిని మించి ఖర్చు పెట్టి తీశాడు. వాటికి గొప్ప ఫలితం వచ్చింది.
కానీ ఇలాగే రిస్క్ చేసిన తీసిన ‘రేయ్’ మాత్రం వైవీఎస్కు తీరని నష్టాలు మిగిల్చి ఆయన కెరీర్కు దాదాపుగా ఎండ్ కార్డ్ వేసినట్లు కనిపించింది. కొన్నేళ్ల పాటు వాయిదాల మీద వాయిదాలు పడి 2015లో రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో దర్శకుడిగా ఎన్నడూ లేనంత విరామం వచ్చింది వైవీఎస్కు. ఇక మళ్లీ ఆయన సినిమా తీయడు అనుకున్న టైంలో ఇటీవలే ‘న్యూ టాలెంట్ రోర్స్’ (ఎన్టీఆర్) అనే బేనర్ పెట్టి కొత్త సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇంతకుముందు ఓ ప్రెస్ మీట్ పెట్టి తన బేనర్లో నందమూరి జానకిరామ్ తనయుడైన మరో ఎన్టీఆర్ను హీరోగా పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించిన వైవీఎస్ తాజాగా ఈ సినిమా కథాంశం గురించి చెప్పడానికి మరో ప్రెస్ మీట్ పెట్టారు.
తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే సినిమా తీయబోతున్నట్లు చెప్పిన వైవీఎస్.. ఈ కథ 1980 నేపథ్యంలో నడుస్తుందని తెలిపాడు. తనకు తెలుగు భాష అంటే చాలా ఇష్టమని, దాని గొప్పదనాన్ని కొత్త తరానికి చెప్పాలని అనుకున్నానని.. ఎట్టకేలకు అందుకు తగ్గ మంచి కథ దొరికిందని చౌదరి చెప్పాడు.
సినిమాలో తెలుగు భాషతో పాటు హైందవ సంస్కృతి గొప్పదనాన్ని చూపిస్తానని.. ఈ సినిమాకు ఆ నేపథ్యమే బలమని ఆయన అన్నాడు. తన హీరో ఎన్టీఆర్ను గత ఏడాది ఏప్రిల్ 27న కలిశానని.. ఈ కథ చెప్పాక అందుకు అనుగుణంగా అతను తయారయ్యాడని.. హీరోయిన్ కూడా తెలుగమ్మాయే అని.. ఆమె కూచిపూడి డ్యాన్సర్ అని చెప్పాడు చౌదరి.
This post was last modified on August 29, 2024 10:33 pm
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…