Movie News

1980కి వెళ్లబోతున్న వైవీఎస్ చౌదరి

ఒకప్పుడు స్వీయ నిర్మాణంలో లాహిరి లాహిరి లాహిరి, దేవదాసు లాంటి బ్లాక్‌బస్టర్లు తీసి సాహసోపేతమైన ఫిలిం మేకర్‌గా పేరు తెచ్చుకున్నాడు వైవీఎస్ చౌదరి. ఆ సినిమాలను ఆయన ఎంతో రిస్క్ చేసి, అందులోని హీరోల మార్కెట్ పరిధిని మించి ఖర్చు పెట్టి తీశాడు. వాటికి గొప్ప ఫలితం వచ్చింది.

కానీ ఇలాగే రిస్క్ చేసిన తీసిన ‘రేయ్’ మాత్రం వైవీఎస్‌‌కు తీరని నష్టాలు మిగిల్చి ఆయన కెరీర్‌కు దాదాపుగా ఎండ్ కార్డ్ వేసినట్లు కనిపించింది. కొన్నేళ్ల పాటు వాయిదాల మీద వాయిదాలు పడి 2015లో రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో దర్శకుడిగా ఎన్నడూ లేనంత విరామం వచ్చింది వైవీఎస్‌కు. ఇక మళ్లీ ఆయన సినిమా తీయడు అనుకున్న టైంలో ఇటీవలే ‘న్యూ టాలెంట్ రోర్స్’ (ఎన్‌టీఆర్) అనే బేనర్ పెట్టి కొత్త సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇంతకుముందు ఓ ప్రెస్ మీట్ పెట్టి తన బేనర్లో నందమూరి జానకిరామ్ తనయుడైన మరో ఎన్టీఆర్‌ను హీరోగా పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించిన వైవీఎస్ తాజాగా ఈ సినిమా కథాంశం గురించి చెప్పడానికి మరో ప్రెస్ మీట్ పెట్టారు.

తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే సినిమా తీయబోతున్నట్లు చెప్పిన వైవీఎస్.. ఈ కథ 1980 నేపథ్యంలో నడుస్తుందని తెలిపాడు. తనకు తెలుగు భాష అంటే చాలా ఇష్టమని, దాని గొప్పదనాన్ని కొత్త తరానికి చెప్పాలని అనుకున్నానని.. ఎట్టకేలకు అందుకు తగ్గ మంచి కథ దొరికిందని చౌదరి చెప్పాడు.

సినిమాలో తెలుగు భాషతో పాటు హైందవ సంస్కృతి గొప్పదనాన్ని చూపిస్తానని.. ఈ సినిమాకు ఆ నేపథ్యమే బలమని ఆయన అన్నాడు. తన హీరో ఎన్టీఆర్‌ను గత ఏడాది ఏప్రిల్ 27న కలిశానని.. ఈ కథ చెప్పాక అందుకు అనుగుణంగా అతను తయారయ్యాడని.. హీరోయిన్ కూడా తెలుగమ్మాయే అని.. ఆమె కూచిపూడి డ్యాన్సర్ అని చెప్పాడు చౌదరి.

This post was last modified on August 29, 2024 10:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జైల్లో ఎంజాయ్ చేసిన అంబటి

ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…

58 minutes ago

చేదుగా ఉన్నా నిజం చెప్పిన దిల్ రాజు

ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…

2 hours ago

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…

3 hours ago

‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!

తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…

4 hours ago

పుష్ప స్టైల్ లో లోకేష్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను వీక్షించడం…

4 hours ago

డిల్లీ వేదికపై చైనా రోబో.. ఏంటి వివాదం?

ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…

4 hours ago