ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో వ్యక్తి ఎవరైనా సరే నలుగురిలో వైరల్ టాపిక్ కావాలంటే అసందర్భ కామెంట్లో లేదా ప్రసంగమో చేస్తే సరి. కొద్దిరోజుల క్రితమే టాలీవుడ్ జనాలకు అంతగా పరిచయం లేని అర్షద్ వార్సీ కల్కి సినిమాలో ప్రభాస్ ని ఉద్దేశించి అన్న మాటలు ఎంత దూరం వెళ్ళాయో చూస్తున్నాం. అది తప్పని చెప్పిన ప్రముఖులు పదులు, వందల్లో కనిపిస్తున్నా సదరు మహానుభావుడికి మాత్రం కనీసం సారీ చెప్పాలని లేదా వివరణ ఇవ్వాలని అనిపించలేదు. ఇప్పుడీ వరసలో కాదు కానీ ఇంకో రకంగా ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ పాపులారిటీ కోరుకుంటున్నాడు.
గత ఏడాది రిలీజైన ఆదిపురుష్ ఎంత డిజాస్టరో చెప్పనక్కర్లేదు. చెప్పుకోవడానికి నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసింది కానీ నిజానికి దాని స్టామినా అది కాదు. రామాయణ గాథని అంచనాలకు తగ్గట్టు చూపించి ఉంటే కనీసం వెయ్యి కోట్లు దాటేది. ఊరూరా జాతరలాగా జనం థియేటర్లకు వచ్చేవారు. నెగటివ్ క్రిటిసిజం ఎంత వచ్చిందో అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. కానీ ఓం రౌత్ ఒప్పుకోవడం లేదు. హిట్ కొలమానం బాక్సాఫీస్ కలెక్షన్లు కాబట్టి ఆదిపురుష్ స్థాయి ఏంటో మీరే నిర్ణయించుకోండని మెలిక పెట్టాడు. ముక్కుమొహం లేని ఆన్ లైన్ ట్రోలింగ్ పట్టించుకోను అన్నాడు.
ఇంతే కాదు ప్రభాస్ హిట్టు ఫ్లాపుకు అతీతమైన హీరో అని పనిలో పనిగా ప్రశంసలు గుప్పించాడు. అయినా పొరపాటు జరిగింది అలా తీయకుండా ఉండాల్సిందని తప్పు ఒప్పుకుంటే హుందాగా ఉండేది. అది వదిలేసి వందల కోట్లు వచ్చాయని సాకుగా చూపించడం అసలు కామెడీ. ప్రభాస్ ఇమేజ్ ఆ వసూళ్లలో ఎంత కీలక పాత్ర పోషించాయో వేరే చెప్పనక్కర్లేదు. అయినా అపజయాన్ని ఒప్పుకోవడం ఒక కళ. అది అందరికీ రాదు. అన్నట్టు ఆదిపురుష్ తర్వాత ఓం రౌత్ ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుపెట్టనే లేదు. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఇంకా కొలిక్కి రాలేదు.
This post was last modified on August 29, 2024 5:33 pm
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…