ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో వ్యక్తి ఎవరైనా సరే నలుగురిలో వైరల్ టాపిక్ కావాలంటే అసందర్భ కామెంట్లో లేదా ప్రసంగమో చేస్తే సరి. కొద్దిరోజుల క్రితమే టాలీవుడ్ జనాలకు అంతగా పరిచయం లేని అర్షద్ వార్సీ కల్కి సినిమాలో ప్రభాస్ ని ఉద్దేశించి అన్న మాటలు ఎంత దూరం వెళ్ళాయో చూస్తున్నాం. అది తప్పని చెప్పిన ప్రముఖులు పదులు, వందల్లో కనిపిస్తున్నా సదరు మహానుభావుడికి మాత్రం కనీసం సారీ చెప్పాలని లేదా వివరణ ఇవ్వాలని అనిపించలేదు. ఇప్పుడీ వరసలో కాదు కానీ ఇంకో రకంగా ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ పాపులారిటీ కోరుకుంటున్నాడు.
గత ఏడాది రిలీజైన ఆదిపురుష్ ఎంత డిజాస్టరో చెప్పనక్కర్లేదు. చెప్పుకోవడానికి నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసింది కానీ నిజానికి దాని స్టామినా అది కాదు. రామాయణ గాథని అంచనాలకు తగ్గట్టు చూపించి ఉంటే కనీసం వెయ్యి కోట్లు దాటేది. ఊరూరా జాతరలాగా జనం థియేటర్లకు వచ్చేవారు. నెగటివ్ క్రిటిసిజం ఎంత వచ్చిందో అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. కానీ ఓం రౌత్ ఒప్పుకోవడం లేదు. హిట్ కొలమానం బాక్సాఫీస్ కలెక్షన్లు కాబట్టి ఆదిపురుష్ స్థాయి ఏంటో మీరే నిర్ణయించుకోండని మెలిక పెట్టాడు. ముక్కుమొహం లేని ఆన్ లైన్ ట్రోలింగ్ పట్టించుకోను అన్నాడు.
ఇంతే కాదు ప్రభాస్ హిట్టు ఫ్లాపుకు అతీతమైన హీరో అని పనిలో పనిగా ప్రశంసలు గుప్పించాడు. అయినా పొరపాటు జరిగింది అలా తీయకుండా ఉండాల్సిందని తప్పు ఒప్పుకుంటే హుందాగా ఉండేది. అది వదిలేసి వందల కోట్లు వచ్చాయని సాకుగా చూపించడం అసలు కామెడీ. ప్రభాస్ ఇమేజ్ ఆ వసూళ్లలో ఎంత కీలక పాత్ర పోషించాయో వేరే చెప్పనక్కర్లేదు. అయినా అపజయాన్ని ఒప్పుకోవడం ఒక కళ. అది అందరికీ రాదు. అన్నట్టు ఆదిపురుష్ తర్వాత ఓం రౌత్ ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుపెట్టనే లేదు. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఇంకా కొలిక్కి రాలేదు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…