ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో వ్యక్తి ఎవరైనా సరే నలుగురిలో వైరల్ టాపిక్ కావాలంటే అసందర్భ కామెంట్లో లేదా ప్రసంగమో చేస్తే సరి. కొద్దిరోజుల క్రితమే టాలీవుడ్ జనాలకు అంతగా పరిచయం లేని అర్షద్ వార్సీ కల్కి సినిమాలో ప్రభాస్ ని ఉద్దేశించి అన్న మాటలు ఎంత దూరం వెళ్ళాయో చూస్తున్నాం. అది తప్పని చెప్పిన ప్రముఖులు పదులు, వందల్లో కనిపిస్తున్నా సదరు మహానుభావుడికి మాత్రం కనీసం సారీ చెప్పాలని లేదా వివరణ ఇవ్వాలని అనిపించలేదు. ఇప్పుడీ వరసలో కాదు కానీ ఇంకో రకంగా ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ పాపులారిటీ కోరుకుంటున్నాడు.
గత ఏడాది రిలీజైన ఆదిపురుష్ ఎంత డిజాస్టరో చెప్పనక్కర్లేదు. చెప్పుకోవడానికి నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసింది కానీ నిజానికి దాని స్టామినా అది కాదు. రామాయణ గాథని అంచనాలకు తగ్గట్టు చూపించి ఉంటే కనీసం వెయ్యి కోట్లు దాటేది. ఊరూరా జాతరలాగా జనం థియేటర్లకు వచ్చేవారు. నెగటివ్ క్రిటిసిజం ఎంత వచ్చిందో అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. కానీ ఓం రౌత్ ఒప్పుకోవడం లేదు. హిట్ కొలమానం బాక్సాఫీస్ కలెక్షన్లు కాబట్టి ఆదిపురుష్ స్థాయి ఏంటో మీరే నిర్ణయించుకోండని మెలిక పెట్టాడు. ముక్కుమొహం లేని ఆన్ లైన్ ట్రోలింగ్ పట్టించుకోను అన్నాడు.
ఇంతే కాదు ప్రభాస్ హిట్టు ఫ్లాపుకు అతీతమైన హీరో అని పనిలో పనిగా ప్రశంసలు గుప్పించాడు. అయినా పొరపాటు జరిగింది అలా తీయకుండా ఉండాల్సిందని తప్పు ఒప్పుకుంటే హుందాగా ఉండేది. అది వదిలేసి వందల కోట్లు వచ్చాయని సాకుగా చూపించడం అసలు కామెడీ. ప్రభాస్ ఇమేజ్ ఆ వసూళ్లలో ఎంత కీలక పాత్ర పోషించాయో వేరే చెప్పనక్కర్లేదు. అయినా అపజయాన్ని ఒప్పుకోవడం ఒక కళ. అది అందరికీ రాదు. అన్నట్టు ఆదిపురుష్ తర్వాత ఓం రౌత్ ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుపెట్టనే లేదు. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఇంకా కొలిక్కి రాలేదు.
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…
ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…
సినీ ప్రియులను అంతులేని విషాదంలో ముంచెత్తుతూ లెజెండరీ దర్శకులు భారతీరాజా కన్నుమూశారు. ఆయన జ్ఞాపకాలలో అభిమానులు గతాన్ని తలుచుకుంటున్నారు. పేరు…
నిజమే… ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా కూడా ఏపీలో అధికారులు పని చేయడం లేదని చెప్పక తప్పదు. స్వయంగా మంత్రులు…