ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో వ్యక్తి ఎవరైనా సరే నలుగురిలో వైరల్ టాపిక్ కావాలంటే అసందర్భ కామెంట్లో లేదా ప్రసంగమో చేస్తే సరి. కొద్దిరోజుల క్రితమే టాలీవుడ్ జనాలకు అంతగా పరిచయం లేని అర్షద్ వార్సీ కల్కి సినిమాలో ప్రభాస్ ని ఉద్దేశించి అన్న మాటలు ఎంత దూరం వెళ్ళాయో చూస్తున్నాం. అది తప్పని చెప్పిన ప్రముఖులు పదులు, వందల్లో కనిపిస్తున్నా సదరు మహానుభావుడికి మాత్రం కనీసం సారీ చెప్పాలని లేదా వివరణ ఇవ్వాలని అనిపించలేదు. ఇప్పుడీ వరసలో కాదు కానీ ఇంకో రకంగా ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ పాపులారిటీ కోరుకుంటున్నాడు.
గత ఏడాది రిలీజైన ఆదిపురుష్ ఎంత డిజాస్టరో చెప్పనక్కర్లేదు. చెప్పుకోవడానికి నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసింది కానీ నిజానికి దాని స్టామినా అది కాదు. రామాయణ గాథని అంచనాలకు తగ్గట్టు చూపించి ఉంటే కనీసం వెయ్యి కోట్లు దాటేది. ఊరూరా జాతరలాగా జనం థియేటర్లకు వచ్చేవారు. నెగటివ్ క్రిటిసిజం ఎంత వచ్చిందో అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. కానీ ఓం రౌత్ ఒప్పుకోవడం లేదు. హిట్ కొలమానం బాక్సాఫీస్ కలెక్షన్లు కాబట్టి ఆదిపురుష్ స్థాయి ఏంటో మీరే నిర్ణయించుకోండని మెలిక పెట్టాడు. ముక్కుమొహం లేని ఆన్ లైన్ ట్రోలింగ్ పట్టించుకోను అన్నాడు.
ఇంతే కాదు ప్రభాస్ హిట్టు ఫ్లాపుకు అతీతమైన హీరో అని పనిలో పనిగా ప్రశంసలు గుప్పించాడు. అయినా పొరపాటు జరిగింది అలా తీయకుండా ఉండాల్సిందని తప్పు ఒప్పుకుంటే హుందాగా ఉండేది. అది వదిలేసి వందల కోట్లు వచ్చాయని సాకుగా చూపించడం అసలు కామెడీ. ప్రభాస్ ఇమేజ్ ఆ వసూళ్లలో ఎంత కీలక పాత్ర పోషించాయో వేరే చెప్పనక్కర్లేదు. అయినా అపజయాన్ని ఒప్పుకోవడం ఒక కళ. అది అందరికీ రాదు. అన్నట్టు ఆదిపురుష్ తర్వాత ఓం రౌత్ ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుపెట్టనే లేదు. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఇంకా కొలిక్కి రాలేదు.
This post was last modified on August 29, 2024 5:33 pm
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…
రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…