ఊహించని విధంగా తీవ్ర నిరాశకు గురి చేసిన మిస్టర్ బచ్చన్ విడుదల ముందు వరకు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఎంత హాట్ టాపిక్ అయ్యిందో చూశాం. రష్మిక మందన్న, శ్రీలీల, పూజా హెగ్డే లాగా అవకాశాలు క్యూ కడతాయని అందరూ భావించారు. దానికి తగ్గట్టే అమ్మడి గ్లామర్ షో పలువురు దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. అయితే సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో అమ్మడి అవకాశాల మీద ప్రభావం చూపించేలా ఉంది. తనను తీసుకోవాలని భావించిన పలు నిర్మాణ సంస్థలు ఇప్పుడు పునరాలోచనలో పడినట్టు తెలిసింది. మిస్టర్ బచ్చన్ బ్లాక్ బస్టర్ అయ్యుంటే లెక్క వేరుగా ఉండేది.
రానా నిర్మాతగా దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న కాంతాలో భాగ్యశ్రీ బోర్సేనే తీసుకున్నారు. కానీ ఇదింకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళలేదు. విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న యాక్షన్ డ్రామాలో తనకు ఎక్కువ ప్రాధాన్యం ఉండదని అనధికార ఇన్ సైడ్ టాక్. పావు గంటకు పరిమితమయ్యే స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చారని అంటున్నారు. లేదూ ఫుల్ లెన్త్ అయితే మాత్రం అదృష్టమే. అందం ఓకే కానీ పెర్ఫార్మన్స్ పరంగానూ ఈ అమ్మాయికి పెద్దగా మార్కులు పడలేదు. పైగా స్వంతంగా డబ్బింగ్ చెప్పడం డ్యామేజీని పెంచింది. హరీష్ శంకర్ కన్నా ఎక్కువ నష్టపోయింది తనే.
ఎలాగూ హీరోయిన్ కొరత ఉంది కాబట్టి ఆ లోటుని వాడుకుని సరైన అవకాశాలు పట్టుకుని హిట్లు కొడితే భాగ్యశ్రీ బోర్సేకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాకపోతే సక్సెస్, ఓపిక ఈ రెండూ ఉండాలి. మీనాక్షి చౌదరి ఈ సూత్రాన్ని పాటించే బిజీగా మారిపోయింది. ఒకప్పుడు హిట్ 2,హత్య లాంటి మీడియం సినిమాల నుంచి విజయ్, దుల్కర్ సల్మాన్, విశ్వక్ సేన్ లాంటి క్రేజీ స్టార్లతో నటించే ఛాన్స్ దక్కించుకుంది. మరి భాగ్యశ్రీ బోర్సేకు ఇలాంటి యోగం దక్కాలంటే మాత్రం హిట్టు పడాలి. కాకపోతే దానికి టైం పట్టేలా ఉంది. విజయాలు ఉంటేనే పలకరించే పరిశ్రమలో కొన్నాళ్ళు ఇలాంటి ఆటుపోట్లు తప్పవు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…