ఖుషి.. తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని సినిమా. పవన్ కెరీర్లోనే ది బెస్ట్ సినిమాల లిస్ట్ తీస్తే ముందు వరుసలో ఆ చిత్రం ఉంటుంది. ఇది రీమేక్ మూవీనే అయినప్పటికీ.. తెలుగులో ఇంకా ఎంటర్టైనింగ్గా, ఇంకా స్టైలిష్గా తీర్చిదిద్ది తిరుగులేని బ్లాక్బస్టర్గా మలిచింది ఎస్.జె.సూర్య, పవన్ కళ్యాణ్ జోడీ. ఈ చిత్రానికి సీక్వెల్ తీయడంపై ఇటీవల ఓ ఆసక్తికర చర్చ జరిగింది.
సరిపోదా శనివారం ప్రి రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. ఖుషికి సీక్వెల్ తీయాలని, అది కూడా పవన్ కళ్యాణ్తోనే చేయాలని ఇందులో కీలక పాత్ర పోషించిన సూర్యను అడిగింది. ఐతే ఖుషి ఒరిజినల్ తమిళంలో కదా తీసింది, సీక్వెల్ చేస్తే అక్కడే విజయ్తో చేయాలంటూ తమిళ నెటిజన్లు గొడవ చేశారు. కానీ దర్శకుడు ఎస్.జె.సూర్య మాత్రం ఖుషి సీక్వెల్ను తెలుగులోనే తీయాలనుకున్నాడట. స్క్రిప్టు రెడీ చేసి పవన్ కళ్యాణ్కు వినిపించాడట కూడా.
కానీ పవనే ఆ సినిమాను తిరస్కరించినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు సూర్య. ఖుషి-2 కథ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ దగ్గర ఉందని సూర్య తెలిపాడు. ఈ కథ చెప్పినపుడు పవన్కు నచ్చిందని, నరేషన్ను బాగా ఎంజాయ్ చేశారని సూర్య వెల్లడించాడు. కానీ అప్పటికే తాను ప్రేమకథలు చేసే వయసు దాటిపోయానని.. కాబట్టి ఖుషి-2 చేయలేనని పవన్ తేల్చేసినట్లు చెప్పాడు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి నటులు వయసు పెరిగాక కూడా ప్రేమకథలు చేశారని పవన్కు గుర్తు చేస్తే.. తాను మాత్రం ఈ సినిమా చేయలేనంటే చేయలేను అని పవన్ చెప్పేసినట్లు సూర్య వెల్లడించాడు.
పవన్ కాదంటే నాని, రామ్ చరణ్, విజయ్ లాంటి నటులకు ఈ కథ బాగానే సూటవుతుందని.. భూమిక పాత్రకు ఇప్పుడు ప్రియాంక మోహన్ లాంటి వాళ్లు బాగానే ఉంటారని సూర్య అభిప్రాయపడ్డాడు. మొత్తానికి ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ పవన్ ఒప్పుకోకపోవడం వల్లే రాలేదని ఇప్పుడు వెల్లడి కావడం పవర్ స్టార్ ఫ్యాన్స్కు ఒకింత నిరాశ కలిగించే విషయమే.
This post was last modified on August 28, 2024 12:05 am
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. "1967లో అన్నాదురై,…
ఎక్కడైనా దురద పెడితే చేతితో గోక్కుంటాం. లేదంటే పక్కన ఉన్నవాళ్లను కాస్త గోకమని అడుగుతాం. కానీ చైనాలో మాత్రం ఇదే…
తెలంగాణా అసెంబ్లీ ప్రారంభం కావడమే యుద్ధ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ గేటు వద్ద ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో…
ఢిల్లీలో హాస్టల్ భవనం కూలిపోయిన ఘటనలో ఇప్పుడు మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఏడుగురు మరణించిన విషయం తెలిసిందే.…
తెలుగు సినిమాల్లోకి పరభాషా నటులను క్యారెక్టర్, విలన్ పాత్రల్లోకి తీసుకోవడం కొత్తేమీ కాదు. ఇది దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయమే. సొంత…
చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేస్తాడని నేచురల్ స్టార్ నానికి ఉన్న పేరును ‘ది ప్యారడైజ్’ బాగా దెబ్బ తీసింది.…