తెలుగులో మళ్లీ బిగ్ బాస్ షో హంగాామా మొదలైపోయింది. కొత్త సీజన్ను ఇటీవలే ప్రకటించారు. అందులో పార్టిసిపెంట్లు అంటూ కొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కూడా. ఆ పేర్లలో యువ కథానాయకుడు రాజ్ తరుణ్ది కూడా ఉంది. లావణ్య అనే అమ్మాయితో కొన్నేళ్లు కలిసి ఉన్న రాజ్.. ఈ మధ్య విడిపోయిన నేపథ్యంలో ఆమె అతడిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు కేసులు పెట్టడం తెలిసిందే. దీని గురించి కొన్ని వారాల పాటు పెద్ద చర్చే జరిగింది.
ఇప్పుడు మీడియాలో రాజ్ పేరు బాగా నానుతుండడంతో బిగ్ బాస్ షోలోకి తీసుకొస్తే తనకూ షోకూ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారని.. అందుకే మంచి పారితోషకంతో అతణ్ని ఈ షోలోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. రాజ్ దాని గురించి ఇప్పటిదాకా ఏమీ స్పందించలేదు. ఐతే తన కొత్త చిత్రం ‘భలే ఉన్నాడే’కు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో రాజ్ బృందం దీని గురించి స్పందించింది.
మీరు బిగ్ బాస్ షోలోకి వెళ్తారట నిజమేనా అని రాజ్ను ప్రశ్నించగా.. ‘భలే ఉన్నాడే’ దర్శకుడు శివసాయి దీని గురించి స్పందించాడు. ‘‘ఛాన్సే లేదు. ఆయన ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండలేరు. అన్ని రోజులు ఒకే హౌస్లో ఉండడం జరిగే పని కాదు’’ అని స్పష్టత ఇచ్చాడు. దీన్నే రాజ్ మాటగా కూడా భావించవచ్చేమో. ఇక లావణ్యతో గొడవ ఉన్నట్లుండి సద్దుమణిగిందేంటి అని అడిగితే.. ఈ విషయంలో తానేమీ చేయలేదని రాజ్ బదులిచ్చాడు.
వరుసగా సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలోనే లావణ్య ఇష్యూను ప్రమోషన్ కోసం తెరపైకి తెచ్చారా అని రాజ్ను అడిగితే.. ‘‘లేదండీ. మీరు అడిగిన ప్రశ్నను జీర్ణించుకోవాలంటే కొంత సమయం పట్టేలా ఉంది. అలా ఎవరైనా ప్రమోట్ చేసుకుంటారా’’ అని రాజ్ ఎదురు ప్రశ్న వేశాడు. తన గత చిత్రాలను సరిగ్గా ప్రమోట్ చేసుకోలేదని.. పురుషోత్తముడ మంచి సినిమానే అని, తిరగబడరా సామీనే అచంనాలను అందుకోలేకపోయిందని.. ఇకపై తన నుంచి మంచి సినిమాలే వచ్చేలా చూసుకుంటానని రాజ్ చెప్పాడు.
This post was last modified on August 28, 2024 12:07 am
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…