తెలుగులో మళ్లీ బిగ్ బాస్ షో హంగాామా మొదలైపోయింది. కొత్త సీజన్ను ఇటీవలే ప్రకటించారు. అందులో పార్టిసిపెంట్లు అంటూ కొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కూడా. ఆ పేర్లలో యువ కథానాయకుడు రాజ్ తరుణ్ది కూడా ఉంది. లావణ్య అనే అమ్మాయితో కొన్నేళ్లు కలిసి ఉన్న రాజ్.. ఈ మధ్య విడిపోయిన నేపథ్యంలో ఆమె అతడిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు కేసులు పెట్టడం తెలిసిందే. దీని గురించి కొన్ని వారాల పాటు పెద్ద చర్చే జరిగింది.
ఇప్పుడు మీడియాలో రాజ్ పేరు బాగా నానుతుండడంతో బిగ్ బాస్ షోలోకి తీసుకొస్తే తనకూ షోకూ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారని.. అందుకే మంచి పారితోషకంతో అతణ్ని ఈ షోలోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. రాజ్ దాని గురించి ఇప్పటిదాకా ఏమీ స్పందించలేదు. ఐతే తన కొత్త చిత్రం ‘భలే ఉన్నాడే’కు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో రాజ్ బృందం దీని గురించి స్పందించింది.
మీరు బిగ్ బాస్ షోలోకి వెళ్తారట నిజమేనా అని రాజ్ను ప్రశ్నించగా.. ‘భలే ఉన్నాడే’ దర్శకుడు శివసాయి దీని గురించి స్పందించాడు. ‘‘ఛాన్సే లేదు. ఆయన ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండలేరు. అన్ని రోజులు ఒకే హౌస్లో ఉండడం జరిగే పని కాదు’’ అని స్పష్టత ఇచ్చాడు. దీన్నే రాజ్ మాటగా కూడా భావించవచ్చేమో. ఇక లావణ్యతో గొడవ ఉన్నట్లుండి సద్దుమణిగిందేంటి అని అడిగితే.. ఈ విషయంలో తానేమీ చేయలేదని రాజ్ బదులిచ్చాడు.
వరుసగా సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలోనే లావణ్య ఇష్యూను ప్రమోషన్ కోసం తెరపైకి తెచ్చారా అని రాజ్ను అడిగితే.. ‘‘లేదండీ. మీరు అడిగిన ప్రశ్నను జీర్ణించుకోవాలంటే కొంత సమయం పట్టేలా ఉంది. అలా ఎవరైనా ప్రమోట్ చేసుకుంటారా’’ అని రాజ్ ఎదురు ప్రశ్న వేశాడు. తన గత చిత్రాలను సరిగ్గా ప్రమోట్ చేసుకోలేదని.. పురుషోత్తముడ మంచి సినిమానే అని, తిరగబడరా సామీనే అచంనాలను అందుకోలేకపోయిందని.. ఇకపై తన నుంచి మంచి సినిమాలే వచ్చేలా చూసుకుంటానని రాజ్ చెప్పాడు.
This post was last modified on August 28, 2024 12:07 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…