అక్టోబర్ 10 కంగువ విడుదల చేస్తామని నిర్మాత జ్ఞానవేళ రాజా ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ లోనే కాదు సౌత్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీస్ లో ఒకటిగా రూపొందించిన ఈ విజువల్ గ్రాండియర్ కి ముందు ఎలాంటి పోటీ లేదు. కానీ కొద్దిరోజుల క్రితం హఠాత్తుగా రజనీకాంత్ వెట్టయాన్ అదే తేదీకి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించడంతో ఒక్కసారిగా తమిళ పరిశ్రమ షాక్ అయ్యింది. ఎందుకంటే దసరా పండగకు ఇంత పెద్ద క్లాష్ సమర్ధనీయం కాదు. అందులోనూ కంగువ సోలోగా వస్తేనే ప్రయోజనం ఉంటుందని బయ్యర్లతో సహా అందరూ భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కంగువనే వెనుకడుగు వేసినట్టు చెన్నై టాక్. అక్టోబర్ 10 నుంచి అదే నెల చివరిలో వెళ్లే ఆలోచన సీరియస్ గా జరుగుతోందట. అధికారిక ప్రకటన రాలేదు కానీ ఒకటి రెండు రోజుల్లో ఆ లాంఛనం ఉండొచ్చని అంటున్నారు. స్టూడియోస్ గ్రీన్ సంస్థ వెట్టయాన్ నిర్మించిన లైకాతో జరిపిన సంప్రదింపులు ఆశించిన ఫలితం ఇవ్వలేదని అంతర్గత సమాచారం. రజనితో పోటీ పడే సమస్యే ఉండదని గతంలో జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో ఆన్న మాటలు సూపర్ స్టార్ ఫ్యాన్స్ బయటికి తీస్తున్నారు. ఆ కారణంగానే వెనుకడుగు వేస్తారనే వార్త బలంగా తిరుగుతోంది.
సూర్య, దిశా పటాని జంటగా నటించిన కంగువలో బాబీ డియోల్ విలన్ గా చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఎంత పెద్ద ఆకర్షణ కానుందో టీజర్ చూశాక అర్థమయ్యింది. రెండు భాగాలుగా రాబోతున్న కంగువ ప్రమోషన్లు ఇంకా పూర్తి స్థాయిలో మొదలుపెట్టలేదు. సూర్య మాత్రం పోటీకే మొగ్గు చూపుతున్నాడని, ముందు అనౌన్స్ చేసింది తామే కాబట్టి వెనక్కు ఎందుకు తగ్గాలని అంటున్నాడట. అయితే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే థియేటర్లు తగ్గడం, కలెక్షన్లు పంచుకోవడం లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి వెట్టయాన్ కు వదిలేద్దామని జ్ఞానవేల్ అంటున్నారట. వీలైనంత త్వరగా క్లారిటీ రావొచ్చు.
This post was last modified on August 26, 2024 1:55 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…