అక్టోబర్ 10 కంగువ విడుదల చేస్తామని నిర్మాత జ్ఞానవేళ రాజా ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ లోనే కాదు సౌత్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీస్ లో ఒకటిగా రూపొందించిన ఈ విజువల్ గ్రాండియర్ కి ముందు ఎలాంటి పోటీ లేదు. కానీ కొద్దిరోజుల క్రితం హఠాత్తుగా రజనీకాంత్ వెట్టయాన్ అదే తేదీకి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించడంతో ఒక్కసారిగా తమిళ పరిశ్రమ షాక్ అయ్యింది. ఎందుకంటే దసరా పండగకు ఇంత పెద్ద క్లాష్ సమర్ధనీయం కాదు. అందులోనూ కంగువ సోలోగా వస్తేనే ప్రయోజనం ఉంటుందని బయ్యర్లతో సహా అందరూ భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కంగువనే వెనుకడుగు వేసినట్టు చెన్నై టాక్. అక్టోబర్ 10 నుంచి అదే నెల చివరిలో వెళ్లే ఆలోచన సీరియస్ గా జరుగుతోందట. అధికారిక ప్రకటన రాలేదు కానీ ఒకటి రెండు రోజుల్లో ఆ లాంఛనం ఉండొచ్చని అంటున్నారు. స్టూడియోస్ గ్రీన్ సంస్థ వెట్టయాన్ నిర్మించిన లైకాతో జరిపిన సంప్రదింపులు ఆశించిన ఫలితం ఇవ్వలేదని అంతర్గత సమాచారం. రజనితో పోటీ పడే సమస్యే ఉండదని గతంలో జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో ఆన్న మాటలు సూపర్ స్టార్ ఫ్యాన్స్ బయటికి తీస్తున్నారు. ఆ కారణంగానే వెనుకడుగు వేస్తారనే వార్త బలంగా తిరుగుతోంది.
సూర్య, దిశా పటాని జంటగా నటించిన కంగువలో బాబీ డియోల్ విలన్ గా చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఎంత పెద్ద ఆకర్షణ కానుందో టీజర్ చూశాక అర్థమయ్యింది. రెండు భాగాలుగా రాబోతున్న కంగువ ప్రమోషన్లు ఇంకా పూర్తి స్థాయిలో మొదలుపెట్టలేదు. సూర్య మాత్రం పోటీకే మొగ్గు చూపుతున్నాడని, ముందు అనౌన్స్ చేసింది తామే కాబట్టి వెనక్కు ఎందుకు తగ్గాలని అంటున్నాడట. అయితే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే థియేటర్లు తగ్గడం, కలెక్షన్లు పంచుకోవడం లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి వెట్టయాన్ కు వదిలేద్దామని జ్ఞానవేల్ అంటున్నారట. వీలైనంత త్వరగా క్లారిటీ రావొచ్చు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…