అక్టోబర్ 10 కంగువ విడుదల చేస్తామని నిర్మాత జ్ఞానవేళ రాజా ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ లోనే కాదు సౌత్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీస్ లో ఒకటిగా రూపొందించిన ఈ విజువల్ గ్రాండియర్ కి ముందు ఎలాంటి పోటీ లేదు. కానీ కొద్దిరోజుల క్రితం హఠాత్తుగా రజనీకాంత్ వెట్టయాన్ అదే తేదీకి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించడంతో ఒక్కసారిగా తమిళ పరిశ్రమ షాక్ అయ్యింది. ఎందుకంటే దసరా పండగకు ఇంత పెద్ద క్లాష్ సమర్ధనీయం కాదు. అందులోనూ కంగువ సోలోగా వస్తేనే ప్రయోజనం ఉంటుందని బయ్యర్లతో సహా అందరూ భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కంగువనే వెనుకడుగు వేసినట్టు చెన్నై టాక్. అక్టోబర్ 10 నుంచి అదే నెల చివరిలో వెళ్లే ఆలోచన సీరియస్ గా జరుగుతోందట. అధికారిక ప్రకటన రాలేదు కానీ ఒకటి రెండు రోజుల్లో ఆ లాంఛనం ఉండొచ్చని అంటున్నారు. స్టూడియోస్ గ్రీన్ సంస్థ వెట్టయాన్ నిర్మించిన లైకాతో జరిపిన సంప్రదింపులు ఆశించిన ఫలితం ఇవ్వలేదని అంతర్గత సమాచారం. రజనితో పోటీ పడే సమస్యే ఉండదని గతంలో జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో ఆన్న మాటలు సూపర్ స్టార్ ఫ్యాన్స్ బయటికి తీస్తున్నారు. ఆ కారణంగానే వెనుకడుగు వేస్తారనే వార్త బలంగా తిరుగుతోంది.
సూర్య, దిశా పటాని జంటగా నటించిన కంగువలో బాబీ డియోల్ విలన్ గా చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఎంత పెద్ద ఆకర్షణ కానుందో టీజర్ చూశాక అర్థమయ్యింది. రెండు భాగాలుగా రాబోతున్న కంగువ ప్రమోషన్లు ఇంకా పూర్తి స్థాయిలో మొదలుపెట్టలేదు. సూర్య మాత్రం పోటీకే మొగ్గు చూపుతున్నాడని, ముందు అనౌన్స్ చేసింది తామే కాబట్టి వెనక్కు ఎందుకు తగ్గాలని అంటున్నాడట. అయితే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే థియేటర్లు తగ్గడం, కలెక్షన్లు పంచుకోవడం లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి వెట్టయాన్ కు వదిలేద్దామని జ్ఞానవేల్ అంటున్నారట. వీలైనంత త్వరగా క్లారిటీ రావొచ్చు.
This post was last modified on August 26, 2024 1:55 am
నిన్న రాబిన్ హుడ్ నుంచి అదిదా సర్ప్రైజ్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. కేతిక శర్మ నటించిన ఈ ప్రత్యేక…
అసలు ఓజి ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ అప్పుడే ఓజి 2 గురించి ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎన్నికల ముందు వరకు…
ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు…
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…