మలయాళ అమ్మాయి అయిన ప్రియాంక మోహన్కు తెలుగులో, తమిళంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సొంత భాష కంటే ఈ రెండు ఇండస్ట్రీల్లోనే ఆమె ఎక్కువగా సినిమాలు చేస్తోంది. ఈ గురువారం ఆమె సరిపోదా శుక్రవారం సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది.
ఈ సందర్భంగా జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఖుషి మూవీని పొగడ్డం, దానికి సీక్వెల్ తీయాలని దర్శకుడు ఎస్.జె.సూర్యను కోరడం తమిళ ప్రేక్షకులకు నచ్చలేదు. ఇందుకుగాను ఆమెను నిన్నట్నుంచి ట్రోల్ చేస్తున్నారు తమిళ నెటిజన్లు.
తెలుగు ఖుషికి ఎలివేషన్ ఇవ్వడం.. పవన్ కళ్యాణ్తో సీక్వెల్ తీయాలని ప్రియాంక.. సూర్యను కోరడమే తప్పయిపోయింది. తెలుగు ఖుషి కంటే తమిళ ఖుషి బాగుంటుందట. సీక్వెల్ చేయమని అడిగితే ముందు తమిళంలో విజయ్తో చేయాలని ఆమె అడగాలట. అలా కాకుండా పవన్తో ఖుషి-2 తీయమనడం ఏంటి అన్నది వాళ్ల అభ్యంతరం.
ఈ రీమేక్ల విషయంలో తమిళ జనాల గొడవ ఇప్పటిది కాదు. ఖుషి తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షనే బెటర్ అని స్వయంగా ఎస్.జె.సూర్యనే గతంలో చెప్పాడు. తెలుగులో పవన్ కళ్యాణ్ మరిన్ని అడిషన్స్ చేయడంతో ఇంకా మెరుగు పడిందని.. తమిళంలో హిట్ అయిన సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిందని.. అందుకు పవన్ కళ్యాణే కారణమని ఆయన స్పష్టం చేశారు.
కానీ తమిళ జనాలకు మాత్రం విజయ్ ఖుషినే సూపర్ అన్నమాట. ఇదే తమిళ ప్రేక్షకులు.. ఒక్కడు కంటే దాని రీమేక్ అయిన గిల్లి సూపర్ అంటారు. రెండు సినిమాల్లో సన్నివేశాలు పక్కపక్కన పెట్టి చూస్తే మహేష్ బాబు ముందు విజయ్ తేలిపోతాడు.
తెలుగులో ఉన్న ఇంటెన్సిటీ తమిళఃలో కనిపించదు. కొన్ని సీన్లయితే మరీ కామెడీగా, వెటకారంగా ఉంటాయి. ఛత్రపతి, తమ్ముడు, పోకిరి సహా ఇంకా పలు చిత్రాలను విజయ్ రీమేక్ల పేరుతో చెడగొట్టాడన్నది ఆయా చిత్రాల్లో కీలక సన్నివేశాలు చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. కానీ తమిళ జనాలు మాత్రం తమ సినిమాలే గొప్ప అనుకుంటూ అవతలి వాళ్లను తక్కువ చేసే ప్రయత్నం చేస్తుంటారు.
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…