కమర్షియల్ లెక్కలు పక్కనపెడితే విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 1 విమర్శకుల ప్రశంసలు అందుకున్న మాట వాస్తవం. తెలుగులో భారీ వసూళ్లు సాధించకపోయినా తమిళంలో సూపర్ హిట్ స్టేటస్ అందుకుని సీక్వెల్ మీద అంచనాలు పెంచేసింది. కమెడియన్ సూరిలో ఎంత సీరియస్ యాక్టర్ ఉన్నాడో ప్రపంచానికి పరిచయం చేసింది. దర్శకుడు వెట్రిమారన్ దీని మీద పూర్తి ఫోకస్ పెట్టి షూటింగ్ చేస్తున్నారు. మొదటి భాగం తెలుగులో విడుదల చేసిన గీతా ఆర్ట్స్ కొనసాగింపుని కూడా తీసుకొస్తున్నారు. అయితే ట్విస్టు ఏంటంటే ఇప్పటిదాకా షూట్ చేసిన నిడివి చూసి యూనిట్ కి మాట రావడం లేదట.
ఇంకా ముప్పై శాతం బ్యాలన్స్ ఉండగానే 4 గంటల 30 నిమిషాల లెన్త్ రావడం చూసి విడుదలకి మూడో భాగం ప్లాన్ చేసే ఆలోచనలో వెట్రిమారన్ ఉన్నట్టు చెన్నై టాక్. ఇటీవలే మహారాజా దెబ్బకు విజయ్ సేతుపతి ఇమేజ్, మార్కెట్ రెండూ పెరిగాయి. నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక అంతర్జాతీయ ప్రేక్షకులు సైతం భేష్ అనడంతో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న వాటి ఓటిటి హక్కులకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే విడుదల పార్ట్ 3 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే కాపీ ముందే సిద్ధం చేసి పెడతారు. రెండో భాగం రిలీజయ్యాక షూట్ చేయడం కాకుండా సమాంతరంగా పూర్తి చేస్తారు.
నక్సలైట్ల బ్యాక్ డ్రాప్ లో నడిచే విడుదలలో హృదయాన్ని మెలితిప్పే సన్నివేశాలు చాలా ఉంటాయి. ఒకప్పుడు పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ప్రవర్తించేదో కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఒకప్పుడు కృష్ణవంశీ ఇలాంటి నేపథ్యంలోనే సిందూరం తీశారు. కానీ ఆ టైంలో ఆడియన్స్ కి నచ్చలేదు. తర్వాత ఏళ్ళు గడిచే కొద్దీ దానికి కల్ట్ స్టేటస్ వచ్చేసింది. విడుదలకు దీనికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. కానీ ఇప్పుడు వస్తున్న స్పందన వేరు. విడుదల 2లో ఎక్కువ భాగం విజయ్ సేతుపతి మీదే నడుస్తుంది. పార్ట్ 1 చివర్లో చూపించిన విజువల్స్ ని చాలా మటుకు రీ షూట్ చేశారని టాక్.
This post was last modified on August 25, 2024 8:56 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…