Movie News

మహేష్ 29 క్యాస్టింగ్ నెటిజెన్లు నిర్ణయిస్తున్నారు

ఎస్ఎస్ఎంబి 29 ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అధికారిక ప్రకటన ఎప్పుడు ఇవ్వాలో రాజమౌళి ఇంకా నిర్ణయించలేదు. విడుదల తేదీ గురించి అసలు ఆలోచనే లేదు. కానీ ఈలోగా రకరకాల లీకులు చక్కర్లు కొట్టేస్తున్నాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ కు సంబంధించిన అప్డేట్స్ అసలు జక్కన్నకైనా తెలుసో లేదో అనేంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ముందు వచ్చిన పేరు పృథ్విరాజ్ సుకుమారన్. ఈయన విలన్ గా చేస్తున్నాడని ప్రచారం చేశారు. తర్వాత తంగలాన్ ఈవెంట్ లో విక్రమ్ మాటలను బట్టి కన్ఫర్మేషన్ లేకుండానే ఈ సినిమాలో ఆయన కూడా ఉన్నాడనే నిర్ధారణకు వచ్చేశారు.

వీళ్ళు కాకుండా నాగార్జున, మోహన్ లాల్, దీపికా పదుకునేలు ఈ లిస్టులో తోడయ్యారు. ఇంకొందరు అడుగు ముందుకేసి హీరోయిన్ గా చెస్లియా ఇస్లాన్ ఆన్ బోర్డ్ వచ్చేసిందని ఏకంగా ఫ్యాన్ మేడ్ పోస్టర్లు తయారు చేయించి చెలామణిలోకి తెచ్చేశారు. ఏతా వాతా తేలేదేమంటే వీటిలో ఒకటో రెండో లీకులు నిజమవ్వొచ్చేమో కానీ మిగిలినదంతా ఉత్తుత్తి ప్రచారమే. ఇప్పటికే రెండు మూడు వర్క్ షాపులు నిర్వహించిన రాజమౌళి తారాగణంలో ఎవరిని తీసుకోవాలనే దాని మీద స్పష్టమైన ఐడియాతోనే ఉంటారు. కాకపోతే ఆర్టిస్టుల కాల్ షీట్లు దొరికితే తప్ప ముందుకు వెళ్ళలేరు. లేదంటే ఆప్షన్లు మార్చాల్సి ఉంటుంది.

ఆర్ఆర్ఆర్ లాగా ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ద్వారా దీన్ని ప్రకటించాలని రాజమౌళి ఆలోచన. తొలుత మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్ట్ 9 అనుకున్నారు కానీ పనంతా ఇంకా ప్రాధమిక దశలోనే ఉండటంతో ఆ ప్రతిపాదన మానుకున్నారు. ఎయిర్ పోర్ట్, ప్రైవేట్ ఈవెంట్స్ లో బయటికి వస్తున్న మహేష్ కొత్త లుక్స్ చూసి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అయితే టైటిల్ గరుడ అనుకుంటున్నారని, 2028లో రిలీజ్ ఉంటుందని కొన్ని హ్యాండిల్స్ చేస్తున్న హడావిడి మాత్రం శుద్ధ అబద్దం. ఏదైనా సరే రాజమౌళి లేదా శ్రీ దుర్గా ఆర్ట్స్ టీమ్ నుంచి వస్తే తప్ప నమ్మలేం సుమా.

This post was last modified on August 25, 2024 8:56 am

Share

Recent Posts

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

15 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

1 hour ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

4 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

5 hours ago