స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధం చేయడమే కాదు వాటి బుకింగ్స్ పట్ల శ్రద్ధ వహించి సరైన సమయంలో టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టాలి. సరిపోదా శనివారం టీమ్ దీన్ని పర్ఫెక్ట్ గా ఆచరిస్తోంది. అయిదు రోజులు ముందుగానే బుక్ మై షో, పేటిఎం తదితర యాప్స్ ద్వారా బుకింగ్ ఓపెన్ చేయడంతో నిమిషాల వ్యవధిలోనే మూవీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మొదటి గంటకే వెయ్యికి పైగా టికెట్లను సేల్స్ లో చూపించింది. ప్రస్తుతం కొంత నెమ్మదించినా క్రమంగా ఇది ఊపందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ ప్లానింగ్ పద్ధతి అని చెప్పడానికి కారణముంది.
ఈ మధ్య కాలంలో పెద్ద చిత్రాల అడ్వాన్స్ బుకింగ్స్ మహా అయితే రెండు రోజుల ముందు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నారు. ఇటీవల డబుల్ ఇస్మార్ట్ కొన్ని సెంటర్లలో ముందు రోజు మధ్యాన్నానికి కానీ బుకింగ్స్ పెట్టలేదు. మిస్టర్ బచ్చన్ కొంచెం అడ్వాన్స్ గా ఉంది అంతే. థియేటర్ అగ్రిమెంట్లు, డిస్ట్రిబ్యూటర్లతో మాటా మంతి, షోల కేటాయింపు ఇలా ఎన్నో వ్యవహారాలు చివరి నిమిషం వరకు ఒత్తిడి పెడుతూ ఉంటాయి. కానీ డివివి దానయ్య బృందం ఎలాంటి రిస్క్ రాకుండా పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగింది. నైజామ్ లో దిల్ రాజు లాంటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దొరకడం ప్లస్ అయ్యింది.
ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రమోషన్లు, పబ్లిసిటీ ఇలా ప్రతిదాంట్లోనూ సరిపోదా శనివారం పక్కా స్ట్రాటజీని పాటించింది. ఒకరకంగా చెప్పాలంటే దీన్ని అందరూ ఫాలో కావాలి. దానికి హీరో కమిట్ మెంట్ కూడా తోడవ్వాలి. రెండు రోజుల వ్యవధిలో నాని ముప్పైకి పైగా ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వస్తే నో చెప్పకుండా పాల్గొనడం దానికి నిదర్శనం. చెన్నై, కోచి, బెంగళూరు, ముంబై ఇలా ఏ భాషను నిర్లక్ష్యం చేయకుండా అన్ని చోట్లా సినిమాను తీసుకెళ్లారు. బాలీవుడ్ లోనూ స్త్రీ 2 తర్వాత సరైన మాస్ బొమ్మ లేకపోవడంతో సూర్యాస్ సాటర్డే (హిందీ డబ్బింగ్) కు మంచి ఓపెనింగ్ వస్తుందనే నమ్మకం టీంలో ఉంది.
This post was last modified on August 25, 2024 8:57 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…