మాస్ మహారాజా రవితేజకు గాయమయ్యింది. ఇటీవలే తన 75వ సినిమా షూటింగ్ జరుగుతుండగా కుడి చేతి కండరాలకు దెబ్బ తగలడంతో యశోద ఆసుపత్రికి తరలించారు. సర్జరీ చేసిన డాక్టర్లు ప్రమాదం లేదని, ఆరు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి ఈ యాక్సిడెంట్ గురించి లీక్స్ వచ్చినప్పటికీ హీరో పేరు నిర్ధారణగా తెలియకపోవడంతో విషయం పెద్దది కాలేదు. కానీ తాజాగా నిర్మాణ సంస్థ నుంచి క్లారిఫికేషన్ వచ్చేసింది. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ ఎంటర్ టైనర్ ని సితార బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేసుకున్న ఆర్టి 75 ఇప్పుడు ఏకంగా రెండు నెలలు బ్రేక్ తీసుకోవాల్సి రావడంతో అనుకున్న టైంకి రిలీజ్ కావడం అనుమానంగానే ఉంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా పూర్తి వినోదాత్మకంగా ఇది రూపొందుతోంది. సామజవరగమన రచయితల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న భాను భోగవరపు చెప్పిన స్టోరీ బాగా నచ్చేయడంతో రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పండగకు తీసుకురావాలనే ఉద్దేశంతో వేగంగా చిత్రీకరణ అయ్యేందుకు పూర్తి సహకారం అందించారు. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ల కోసం చిన్న బ్రేక్ తప్ప పూర్తి ధ్యాస ఈ ప్రాజెక్టు మీదే ఉంది.
సరే సినిమా ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి రవితేజ ఎంత అవసరమైతే అంతకన్నా ఎక్కువ రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం. వయసు లెక్క చేయకుండా ఫుల్ ఎనర్జీతో వేగంగా సినిమాలు చేయడంలో యూత్ హీరోలను సైతం వెనుకపడేస్తున్న మాస్ మహారాజకి ఇది పెద్ద స్పీడ్ బ్రేకర్. ఇంత విశ్రాంతి తీసుకున్న దాఖలాలు గతంలో చాలా తక్కువ. ఎప్పటి నుంచి సెట్లో అడుగు పెడతారనేది వైద్యుల తదుపరి సూచన మీద ఆధారపడి ఉంటుంది. ఫైనల్ గా ఫ్యాన్స్ ఆందోళన చెందడానికి ఏమి లేదు. అయినా ఎనర్జీని శరీరంలోనే నింపుకున్న మనిషిని ఈ ప్రమాదాలు ఏం చేస్తాయి.
This post was last modified on August 23, 2024 5:41 pm
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…