మాస్ మహారాజా రవితేజకు గాయమయ్యింది. ఇటీవలే తన 75వ సినిమా షూటింగ్ జరుగుతుండగా కుడి చేతి కండరాలకు దెబ్బ తగలడంతో యశోద ఆసుపత్రికి తరలించారు. సర్జరీ చేసిన డాక్టర్లు ప్రమాదం లేదని, ఆరు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి ఈ యాక్సిడెంట్ గురించి లీక్స్ వచ్చినప్పటికీ హీరో పేరు నిర్ధారణగా తెలియకపోవడంతో విషయం పెద్దది కాలేదు. కానీ తాజాగా నిర్మాణ సంస్థ నుంచి క్లారిఫికేషన్ వచ్చేసింది. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ ఎంటర్ టైనర్ ని సితార బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేసుకున్న ఆర్టి 75 ఇప్పుడు ఏకంగా రెండు నెలలు బ్రేక్ తీసుకోవాల్సి రావడంతో అనుకున్న టైంకి రిలీజ్ కావడం అనుమానంగానే ఉంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా పూర్తి వినోదాత్మకంగా ఇది రూపొందుతోంది. సామజవరగమన రచయితల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న భాను భోగవరపు చెప్పిన స్టోరీ బాగా నచ్చేయడంతో రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పండగకు తీసుకురావాలనే ఉద్దేశంతో వేగంగా చిత్రీకరణ అయ్యేందుకు పూర్తి సహకారం అందించారు. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ల కోసం చిన్న బ్రేక్ తప్ప పూర్తి ధ్యాస ఈ ప్రాజెక్టు మీదే ఉంది.
సరే సినిమా ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి రవితేజ ఎంత అవసరమైతే అంతకన్నా ఎక్కువ రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం. వయసు లెక్క చేయకుండా ఫుల్ ఎనర్జీతో వేగంగా సినిమాలు చేయడంలో యూత్ హీరోలను సైతం వెనుకపడేస్తున్న మాస్ మహారాజకి ఇది పెద్ద స్పీడ్ బ్రేకర్. ఇంత విశ్రాంతి తీసుకున్న దాఖలాలు గతంలో చాలా తక్కువ. ఎప్పటి నుంచి సెట్లో అడుగు పెడతారనేది వైద్యుల తదుపరి సూచన మీద ఆధారపడి ఉంటుంది. ఫైనల్ గా ఫ్యాన్స్ ఆందోళన చెందడానికి ఏమి లేదు. అయినా ఎనర్జీని శరీరంలోనే నింపుకున్న మనిషిని ఈ ప్రమాదాలు ఏం చేస్తాయి.
This post was last modified on August 23, 2024 5:41 pm
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…