మాస్ మహారాజా రవితేజకు గాయమయ్యింది. ఇటీవలే తన 75వ సినిమా షూటింగ్ జరుగుతుండగా కుడి చేతి కండరాలకు దెబ్బ తగలడంతో యశోద ఆసుపత్రికి తరలించారు. సర్జరీ చేసిన డాక్టర్లు ప్రమాదం లేదని, ఆరు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి ఈ యాక్సిడెంట్ గురించి లీక్స్ వచ్చినప్పటికీ హీరో పేరు నిర్ధారణగా తెలియకపోవడంతో విషయం పెద్దది కాలేదు. కానీ తాజాగా నిర్మాణ సంస్థ నుంచి క్లారిఫికేషన్ వచ్చేసింది. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ ఎంటర్ టైనర్ ని సితార బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేసుకున్న ఆర్టి 75 ఇప్పుడు ఏకంగా రెండు నెలలు బ్రేక్ తీసుకోవాల్సి రావడంతో అనుకున్న టైంకి రిలీజ్ కావడం అనుమానంగానే ఉంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా పూర్తి వినోదాత్మకంగా ఇది రూపొందుతోంది. సామజవరగమన రచయితల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న భాను భోగవరపు చెప్పిన స్టోరీ బాగా నచ్చేయడంతో రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పండగకు తీసుకురావాలనే ఉద్దేశంతో వేగంగా చిత్రీకరణ అయ్యేందుకు పూర్తి సహకారం అందించారు. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ల కోసం చిన్న బ్రేక్ తప్ప పూర్తి ధ్యాస ఈ ప్రాజెక్టు మీదే ఉంది.
సరే సినిమా ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి రవితేజ ఎంత అవసరమైతే అంతకన్నా ఎక్కువ రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం. వయసు లెక్క చేయకుండా ఫుల్ ఎనర్జీతో వేగంగా సినిమాలు చేయడంలో యూత్ హీరోలను సైతం వెనుకపడేస్తున్న మాస్ మహారాజకి ఇది పెద్ద స్పీడ్ బ్రేకర్. ఇంత విశ్రాంతి తీసుకున్న దాఖలాలు గతంలో చాలా తక్కువ. ఎప్పటి నుంచి సెట్లో అడుగు పెడతారనేది వైద్యుల తదుపరి సూచన మీద ఆధారపడి ఉంటుంది. ఫైనల్ గా ఫ్యాన్స్ ఆందోళన చెందడానికి ఏమి లేదు. అయినా ఎనర్జీని శరీరంలోనే నింపుకున్న మనిషిని ఈ ప్రమాదాలు ఏం చేస్తాయి.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…