నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఇంద్ర రీ రిలీజ్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా సింగల్ స్క్రీన్లలో కొత్త సినిమా వచ్చినంత రేంజ్ లో హడావిడి జరిగింది. దీని దెబ్బకు విశ్వంభర కొత్త పోస్టర్ అంతగా హైలైట్ కాకపోవడం అసలు ట్విస్టు.
వీటి సంగతి పక్కనపెడితే మెగా 157 ప్రకటన వస్తుందేమోనని ఫ్యాన్స్ ఎదురుచూశారు కానీ అది జరగలేదు. ఇప్పుడు చేస్తున్న విశ్వంభర షూటింగ్ దాదాపు కొలిక్కి వచ్చింది. ఇంకొంత టాకీ పార్ట్, ఒక పాట అయిపోతే గుమ్మడికాయ కొట్టడమే బ్యాలన్స్. అయినా సరే కొత్త ప్రాజెక్టు ఇప్పటిదాకా లాక్ కాలేదు.
గత ఏడాది భోళా శంకర్ ఇచ్చిన షాక్ కి చిరంజీవి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లేదు. వయసుని దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కూతురు సుస్మిత నిర్మాణంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక చేసిన సినిమాని క్యాన్సిల్ చేసుకున్నారు.
గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజాకు మరో అవకాశం ఇచ్చారనే టాక్ రెండు నెలల నుంచి ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది కానీ ఇప్పటిదాకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు. బివిఎస్ రవి స్టోరీ ఓకే అయినా దర్శకుడి ఎంపిక దగ్గరే పేచీ వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం చిరు ఎలాంటి డెసిషన్ తీసుకోలేదట.
అనుదీప్, హరీష్ శంకర్, మారుతీ తదితరులంతా వివిధ మార్గాల్లో చిరంజీవికి కథలు చెప్పినవాళ్ళే కానీ ఎవరూ గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోలేకపోయారు. విశ్వంభర బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం మెగాస్టార్ లో పుష్కలంగా ఉందట. అందుకే ఇకపై ఫార్ములా మాస్ కి దూరంగా విభిన్నమైన ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతున్నారని సన్నిహిత వర్గాల మాట.
రజనీకాంత్ జైలర్ తరహా కాన్సెప్ట్స్ తనకు బాగా సూటవుతాయి కాబట్టి ఆ కోణంలో ఆలోచించమని పలువురు రచయితలకు సూచనలు ఇచ్చారట. సో మెగా 157 తాలూకు క్లారిటీ రావాలంటే ఇంకొన్ని నెలలు లేదా వారాలు వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on August 23, 2024 11:36 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…