గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేని బాధ ఆయన అభిమానులకు ఇప్పట్లో తీరేది కాదు. ఆయన పాటలే వారికి సాంత్వన. అదే సమయంలో ఆ పాటలు వింటుంటే ఆయన లేని లోటును మరింతగా ఫీలవుతారనడంలోనూ సందేహం లేదు. బాలు ఇంకా యాక్టివ్గా ఉంటూ.. అప్పుడప్పుడూ సినిమా పాటలు పాడుతూ.. ‘సింప్లీ ఎస్పీబీ’ యూట్యూబ్ ఛానెల్లో అనేక ఆసక్తికర విషయాలు చెబుతూ అభిమానులను ఎంగేజ్ చేస్తూ ఉండటం వల్ల అభిమానుల బాధ రెట్టింపవుతోంది.
ఇంకా వయసు పెరిగాక.. ఆయన పాటలు మానేసి.. ఇన్యాక్టివ్ అయిపోయిన స్థితిలో చనిపోయి ఉంటే అభిమానులకు ఇంత బాధ ఉండేది కాదేమో. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘డిస్కో రాజా’ సినిమాలో కూడా ఒక హుషారైన పాట (నువ్వు నాతో ఏమన్నావో..) పాడారాయన. తెలుగు వరకు ఆయన పాడిన చివరి పాట ఇదే.
తమిళంలో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో కూడా బాలు ఒక పాట పాడారు. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. అదే బాలు చివరి పాటేమో అనుకున్నారు. కానీ కాదు. ఆ తర్వాత కూడా ఒక పాటను రికార్డ్ చేశారు. అది చాలా పెద్ద సినిమానే కావడం విశేషం. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తె’ కోసం బాలు ఓ పాట పాడారు.
తన సినిమాల్లో ఇంట్రో సాంగ్లను బాలుతో పాడించుకోవడం రజినీకి అలవాటు. ఆయన చివరగా నటించిన ‘దర్బార్’లోనూ చుమ్మా కిళి (తెలుగులో దుమ్ము ధూళి) పాటను బాలునే పాడారు. అంతకుముందు ‘పేట’లోనూ మాస్ మరణం అంటూ ఓ పాట అందుకున్నారు. ఈ రెండు చిత్రాలకూ అనిరుధ్ సంగీత దర్శకుడు. ‘అన్నాత్తె’లోనూ రజినీ ఇంట్రో సాంగ్ను బాలునే పాడారు. ‘శౌర్యం’ శివ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీత దర్శకుడు. బాలుతో పాట రికార్డ్ చేసిన సందర్భంగా ఇమాన్, శివ బాలుతో కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు ట్విట్టర్లో కనిపిస్తున్నాయి. అంటే బాలు లేకపోయినా.. ఆయన పాడిన కొత్త పాట వచ్చే ఏడాది సందడి చేయబోతోందన్నమాట.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…