Movie News

బాలు పాడిన చివరి పాట ఇదేనా!

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేని బాధ ఆయన అభిమానులకు ఇప్పట్లో తీరేది కాదు. ఆయన పాటలే వారికి సాంత్వన. అదే సమయంలో ఆ పాటలు వింటుంటే ఆయన లేని లోటును మరింతగా ఫీలవుతారనడంలోనూ సందేహం లేదు. బాలు ఇంకా యాక్టివ్‌గా ఉంటూ.. అప్పుడప్పుడూ సినిమా పాటలు పాడుతూ.. ‘సింప్లీ ఎస్పీబీ’ యూట్యూబ్ ఛానెల్లో అనేక ఆసక్తికర విషయాలు చెబుతూ అభిమానులను ఎంగేజ్ చేస్తూ ఉండటం వల్ల అభిమానుల బాధ రెట్టింపవుతోంది.

ఇంకా వయసు పెరిగాక.. ఆయన పాటలు మానేసి.. ఇన్‌యాక్టివ్ అయిపోయిన స్థితిలో చనిపోయి ఉంటే అభిమానులకు ఇంత బాధ ఉండేది కాదేమో. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘డిస్కో రాజా’ సినిమాలో కూడా ఒక హుషారైన పాట (నువ్వు నాతో ఏమన్నావో..) పాడారాయన. తెలుగు వరకు ఆయన పాడిన చివరి పాట ఇదే.

తమిళంలో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో కూడా బాలు ఒక పాట పాడారు. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. అదే బాలు చివరి పాటేమో అనుకున్నారు. కానీ కాదు. ఆ తర్వాత కూడా ఒక పాటను రికార్డ్ చేశారు. అది చాలా పెద్ద సినిమానే కావడం విశేషం. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తె’ కోసం బాలు ఓ పాట పాడారు.

తన సినిమాల్లో ఇంట్రో సాంగ్‌లను బాలుతో పాడించుకోవడం రజినీకి అలవాటు. ఆయన చివరగా నటించిన ‘దర్బార్’లోనూ చుమ్మా కిళి (తెలుగులో దుమ్ము ధూళి) పాటను బాలునే పాడారు. అంతకుముందు ‘పేట’లోనూ మాస్ మరణం అంటూ ఓ పాట అందుకున్నారు. ఈ రెండు చిత్రాలకూ అనిరుధ్ సంగీత దర్శకుడు. ‘అన్నాత్తె’లోనూ రజినీ ఇంట్రో సాంగ్‌ను బాలునే పాడారు. ‘శౌర్యం’ శివ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీత దర్శకుడు. బాలుతో పాట రికార్డ్ చేసిన సందర్భంగా ఇమాన్, శివ బాలుతో కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు ట్విట్టర్లో కనిపిస్తున్నాయి. అంటే బాలు లేకపోయినా.. ఆయన పాడిన కొత్త పాట వచ్చే ఏడాది సందడి చేయబోతోందన్నమాట.

This post was last modified on September 28, 2020 6:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

11 hours ago