రీ రిలీజుల ట్రెండ్ అయిపోయిందేమో అనుకున్న ప్రతిసారి ఏదో ఒక బ్లాక్ బస్టర్ అది నిజం కాదని ఋజువు చేస్తుంది. సెంటిమెంట్ సినిమా మురారిని ఎవరు చూస్తారులే అనుకుంటే ఏకంగా రికార్డులు సృష్టించేసింది. తాజాగా ఇంద్ర సైతం అదే బాటలో ఉంది. ఇవాళ మళ్ళీ విడుదలైన ఈ మెగా ఇండస్ట్రీ హిట్ ఏపీ, తెలంగాణ సింగల్ స్క్రీన్లను కళకళలాడించేసింది. 380కి పైగా థియేటర్లలో సురేష్ ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నిర్మాత అశ్వినిదత్ భారీ ఎత్తున ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. గురువారం పీక్ వర్కింగ్ డే అయినా తెల్లవారుఝామునే అభిమానులు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశారు.
క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య, సుదర్శన్, దేవి, తారకరామ మొదలైనవన్నీ కిక్కిరిసిపోయే జనంతో ఉదయం ఏడు గంటల నుంచే సందడిగా మారిపోయాయి. ఈ సంబరాలు ఇక్కడికే పరిమితం కాలేదు. బెంగళూరు సంధ్య థియేటర్లో తెల్లవారుఝామున అయిదు నుంచే ఫ్యాన్స్ హడావిడి చేయడం మొదలుపెట్టారు. గుంటూరు, కర్నూలు, విజయవాడ, మెహబూబ్ నగర్, వైజాగ్ తదితర నగరాల్లో అన్ని చోట్ల ఇదే పరిస్థితి. హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లార్జ్ స్క్రీన్ లో అయిదు షోలు ఇస్తే ఎనభై శాతం పైగా ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనించాల్సిన విషయం. ఇంద్ర ఫీవర్ ఆ రేంజ్ లో ఉంది.
గత వారం వచ్చిన కొత్త సినిమాలు తీవ్రంగా నిరాశపరచడంతో మాస్ ఈసారి ఇంద్రని ఎంచుకున్నారు. అయితే ఈ జోరు ఎన్ని రోజులు ఉంటుందనేది చెప్పలేం. ఆదివారం దాకా స్టడీగా ఉన్నా పెద్ద ఫిగర్లతో వసూళ్లను క్లోజ్ చేయొచ్చు. కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీగా చెప్పుకునే ఇంద్రలో చిరంజీవి నటన, మణిశర్మ పాటలు, బీజీఎమ్, దాయి దాయి దామ్మా వీణ స్టెప్పు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, షౌకత్ అలీ ఖాన్ ట్రాక్ ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రాకతో సెలబ్రేషన్స్ మరో స్థాయికి వెళ్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పెద్ద ప్లానింగే జరుగుతోంది.
This post was last modified on August 22, 2024 6:13 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…