రీ రిలీజుల ట్రెండ్ అయిపోయిందేమో అనుకున్న ప్రతిసారి ఏదో ఒక బ్లాక్ బస్టర్ అది నిజం కాదని ఋజువు చేస్తుంది. సెంటిమెంట్ సినిమా మురారిని ఎవరు చూస్తారులే అనుకుంటే ఏకంగా రికార్డులు సృష్టించేసింది. తాజాగా ఇంద్ర సైతం అదే బాటలో ఉంది. ఇవాళ మళ్ళీ విడుదలైన ఈ మెగా ఇండస్ట్రీ హిట్ ఏపీ, తెలంగాణ సింగల్ స్క్రీన్లను కళకళలాడించేసింది. 380కి పైగా థియేటర్లలో సురేష్ ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నిర్మాత అశ్వినిదత్ భారీ ఎత్తున ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. గురువారం పీక్ వర్కింగ్ డే అయినా తెల్లవారుఝామునే అభిమానులు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశారు.
క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య, సుదర్శన్, దేవి, తారకరామ మొదలైనవన్నీ కిక్కిరిసిపోయే జనంతో ఉదయం ఏడు గంటల నుంచే సందడిగా మారిపోయాయి. ఈ సంబరాలు ఇక్కడికే పరిమితం కాలేదు. బెంగళూరు సంధ్య థియేటర్లో తెల్లవారుఝామున అయిదు నుంచే ఫ్యాన్స్ హడావిడి చేయడం మొదలుపెట్టారు. గుంటూరు, కర్నూలు, విజయవాడ, మెహబూబ్ నగర్, వైజాగ్ తదితర నగరాల్లో అన్ని చోట్ల ఇదే పరిస్థితి. హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లార్జ్ స్క్రీన్ లో అయిదు షోలు ఇస్తే ఎనభై శాతం పైగా ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనించాల్సిన విషయం. ఇంద్ర ఫీవర్ ఆ రేంజ్ లో ఉంది.
గత వారం వచ్చిన కొత్త సినిమాలు తీవ్రంగా నిరాశపరచడంతో మాస్ ఈసారి ఇంద్రని ఎంచుకున్నారు. అయితే ఈ జోరు ఎన్ని రోజులు ఉంటుందనేది చెప్పలేం. ఆదివారం దాకా స్టడీగా ఉన్నా పెద్ద ఫిగర్లతో వసూళ్లను క్లోజ్ చేయొచ్చు. కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీగా చెప్పుకునే ఇంద్రలో చిరంజీవి నటన, మణిశర్మ పాటలు, బీజీఎమ్, దాయి దాయి దామ్మా వీణ స్టెప్పు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, షౌకత్ అలీ ఖాన్ ట్రాక్ ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రాకతో సెలబ్రేషన్స్ మరో స్థాయికి వెళ్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పెద్ద ప్లానింగే జరుగుతోంది.
This post was last modified on August 22, 2024 6:13 pm
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…