రీ రిలీజుల ట్రెండ్ అయిపోయిందేమో అనుకున్న ప్రతిసారి ఏదో ఒక బ్లాక్ బస్టర్ అది నిజం కాదని ఋజువు చేస్తుంది. సెంటిమెంట్ సినిమా మురారిని ఎవరు చూస్తారులే అనుకుంటే ఏకంగా రికార్డులు సృష్టించేసింది. తాజాగా ఇంద్ర సైతం అదే బాటలో ఉంది. ఇవాళ మళ్ళీ విడుదలైన ఈ మెగా ఇండస్ట్రీ హిట్ ఏపీ, తెలంగాణ సింగల్ స్క్రీన్లను కళకళలాడించేసింది. 380కి పైగా థియేటర్లలో సురేష్ ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నిర్మాత అశ్వినిదత్ భారీ ఎత్తున ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. గురువారం పీక్ వర్కింగ్ డే అయినా తెల్లవారుఝామునే అభిమానులు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశారు.
క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య, సుదర్శన్, దేవి, తారకరామ మొదలైనవన్నీ కిక్కిరిసిపోయే జనంతో ఉదయం ఏడు గంటల నుంచే సందడిగా మారిపోయాయి. ఈ సంబరాలు ఇక్కడికే పరిమితం కాలేదు. బెంగళూరు సంధ్య థియేటర్లో తెల్లవారుఝామున అయిదు నుంచే ఫ్యాన్స్ హడావిడి చేయడం మొదలుపెట్టారు. గుంటూరు, కర్నూలు, విజయవాడ, మెహబూబ్ నగర్, వైజాగ్ తదితర నగరాల్లో అన్ని చోట్ల ఇదే పరిస్థితి. హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లార్జ్ స్క్రీన్ లో అయిదు షోలు ఇస్తే ఎనభై శాతం పైగా ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనించాల్సిన విషయం. ఇంద్ర ఫీవర్ ఆ రేంజ్ లో ఉంది.
గత వారం వచ్చిన కొత్త సినిమాలు తీవ్రంగా నిరాశపరచడంతో మాస్ ఈసారి ఇంద్రని ఎంచుకున్నారు. అయితే ఈ జోరు ఎన్ని రోజులు ఉంటుందనేది చెప్పలేం. ఆదివారం దాకా స్టడీగా ఉన్నా పెద్ద ఫిగర్లతో వసూళ్లను క్లోజ్ చేయొచ్చు. కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీగా చెప్పుకునే ఇంద్రలో చిరంజీవి నటన, మణిశర్మ పాటలు, బీజీఎమ్, దాయి దాయి దామ్మా వీణ స్టెప్పు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, షౌకత్ అలీ ఖాన్ ట్రాక్ ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రాకతో సెలబ్రేషన్స్ మరో స్థాయికి వెళ్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పెద్ద ప్లానింగే జరుగుతోంది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…