ఇంకో శుక్రవారం వచ్చేస్తోంది. ఆగస్ట్ 15 విడుదలైన డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ తీవ్రంగా నిరాశ పరచగా తంగలాన్ మొదటి మూడు రోజులు బాగానే రాబట్టినా తర్వాత నెమ్మదించింది. ఒక్క ఆయ్ మాత్రమే అంచనాలకు మించి ఆడి పది కోట్ల గ్రాస్ కు దగ్గరగా వెళ్ళింది. అయితే అన్ని థియేటర్ల ఫీడింగ్ కి దీన్నే వేయలేరు కాబట్టి ఎగ్జిబిటర్లు కొత్త ఫ్రైడే మీద ఆశలు పెట్టుకున్నారు. ముందుగా చెప్పుకోవాల్సింది ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ గురించి. అల్లు అర్జున్ గెస్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం వల్ల జనాల దృష్టి దీని మీద పడింది. సుకుమార్, మైత్రి బ్యాకప్ ఉండటంతో మంచి థియేటర్లు దక్కుతున్నాయి.
రావు రమేష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ టాక్ తో నిలబడుతుందని టీమ్ నమ్ముతోంది. ఇవాళ సాయంత్రమే హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్ వేస్తున్నారు. తమిళ డబ్బింగ్ ‘డిమాంటీ కాలనీ 2’ మొన్నే ఓ షో వేశారు. రెస్పాన్స్ పాజిటివ్ గానే ఉంది. హారర్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సీరియస్ డ్రామా ఈ జానర్ అభిమానులకు విపరీతంగా నచ్చేస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఇవి కాకుండా రేవు, బ్రహ్మవరం, యజ్ఞ, వెడ్డింగ్ డైరీస్ అనే మరో నాలుగు చిన్న చిత్రాలు రేసులో ఉన్నాయి. హాలీవుడ్ మూవీ ‘ఎలియన్ రొమ్యులస్’ని అనువాద రూపంలో తెస్తున్నారు.
ఇవన్నీ ఈ వారమే ఋజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆగస్ట్ 29 సరిపోదా శనివారం భారీ హైప్ మధ్య రిలీజవుతోంది. నాని ప్రమోషన్ల కోసం చాలా తిరిగాడు. ఖచ్చితంగా బ్లాక్ బస్టరవుతుందనే నమ్మకంతో రాష్ట్రాలు రౌండ్ వేసొచ్చాడు. చాలా ఓపిగ్గా ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు చేస్తున్నారు. సో పైన చెప్పిన సినిమాలు ఆయ్, కమిటీ కుర్రోళ్ళు రేంజ్ లో టాక్ తెచ్చుకుంటేనే సెకండ్ వీక్ లో నిలబడగలుగుతాయి. లేదంటే కష్టం. ఈ నెలంతా కంటెంట్ ఉన్న సినిమాలే గెలిచాయి కాబట్టి అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ ఎవరు విజేతలుగా నిలుస్తారో రేపీపాటికి తేలిపోతుంది. చూద్దాం.
This post was last modified on August 22, 2024 12:11 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…