ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే. వాళ్ల సినిమాల రీచ్, బడ్జెట్లు, బిజినెస్ అన్నీ కూడా వేరే లెవెల్లో ఉండేవి. ప్రాంతీయ భాషా చిత్రాలు వాటిని అందుకోలేని స్థాయిలో ఉండేవి. కానీ ఇప్పుడు కథ రివర్స్ అయింది. ప్రాంతీయ చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలన విజయాలు నమోదు చేస్తున్నాయి. హిందీ చిత్రాల పరిధి తగ్గిపోతోంది.
గతంలో బాలీవుడ్ వాళ్లు రీజనల్ సినిమాలను.. వాటిలో భాగమైన వాళ్లను తక్కువగా చేసి మాట్లాడేవాళ్లు. ఇప్పటికీ ఆ ఒరవడి కొంత కొనసాగుతోందనడానికి ఇటీవల బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి.. మన ప్రభాస్ మీద చేసిన వ్యాఖ్యలు రుజువు. ఐతే ఇప్పుడు ఓ ప్రాంతీయ నటుడు, దర్శకుడు బాలీవుడ్ తీరును ఎండగట్టే వ్యాఖ్యలు చేశాడు. అతనే.. 2023 సంవత్సరానికి జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన రిషబ్ శెట్టి.
రిషబ్ కొంచెం ఔట్ స్పోకెన్ అని గతంలోనే రుజువైంది. ఇప్పుడు అతను బాలీవుడ్ మీద ఘాటు వ్యాఖ్యలే చేశాడు. భారతీయ చిత్రాలు.. ముఖ్యంగా బాలీవుడ్ మూవీస్ ఎప్పుడూ మన దేశాన్ని, సంస్కృతిని తక్కువ చేసి చూపిస్తుంటాయని విమర్శించాడు రిషబ్. ఈ తరహా ఆర్ట్ చిత్రాలకు ఇంటర్నేషనల్ లెవెల్లో రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుంతుంటాయని.. ఇలా సినిమాలు తీయాల్సిన అవసరం ఏముందని రిషబ్ ప్రశ్నించాడు.
ఐతే తన దేశం, తన రాష్ట్రం, తన సంస్కృతిని గొప్పగా చూపించాలన్నది తన ఉద్దేశమని.. ఆ విషయంలో తాను గర్విస్తానని కాంతార స్టార్ చెప్పాడు. రిషబ్ నిర్మాణంలో తెరకెక్కిన కొత్త చిత్రం లాఫింగ్ బుద్ధ కూడా కాంతార తరహాలోనే లోకల్ కల్చర్ను గొప్పగా చూపించబోతున్న చిత్రమట. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ సినిమాల తీరును ఎండగడుతూ రిషబ్ ఈ కామెంట్స్ చేశాడు. ఈ అభిప్రాయంతో నార్త్ జనాలు కూడా ఏకీభవిస్తుండడం విశేషం.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…