Movie News

బాలీవుడ్‌పై జాతీయ ఉత్తమ నటుడి కౌంటర్లు

ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే. వాళ్ల సినిమాల రీచ్, బడ్జెట్లు, బిజినెస్ అన్నీ కూడా వేరే లెవెల్లో ఉండేవి. ప్రాంతీయ భాషా చిత్రాలు వాటిని అందుకోలేని స్థాయిలో ఉండేవి. కానీ ఇప్పుడు కథ రివర్స్ అయింది. ప్రాంతీయ చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలన విజయాలు నమోదు చేస్తున్నాయి. హిందీ చిత్రాల పరిధి తగ్గిపోతోంది.

గతంలో బాలీవుడ్ వాళ్లు రీజనల్ సినిమాలను.. వాటిలో భాగమైన వాళ్లను తక్కువగా చేసి మాట్లాడేవాళ్లు. ఇప్పటికీ ఆ ఒరవడి కొంత కొనసాగుతోందనడానికి ఇటీవల బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి.. మన ప్రభాస్ మీద చేసిన వ్యాఖ్యలు రుజువు. ఐతే ఇప్పుడు ఓ ప్రాంతీయ నటుడు, దర్శకుడు బాలీవుడ్ తీరును ఎండగట్టే వ్యాఖ్యలు చేశాడు. అతనే.. 2023 సంవత్సరానికి జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన రిషబ్ శెట్టి.

రిషబ్ కొంచెం ఔట్ స్పోకెన్ అని గతంలోనే రుజువైంది. ఇప్పుడు అతను బాలీవుడ్ మీద ఘాటు వ్యాఖ్యలే చేశాడు. భారతీయ చిత్రాలు.. ముఖ్యంగా బాలీవుడ్ మూవీస్ ఎప్పుడూ మన దేశాన్ని, సంస్కృతిని తక్కువ చేసి చూపిస్తుంటాయని విమర్శించాడు రిషబ్. ఈ తరహా ఆర్ట్ చిత్రాలకు ఇంటర్నేషనల్ లెవెల్లో రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుంతుంటాయని.. ఇలా సినిమాలు తీయాల్సిన అవసరం ఏముందని రిషబ్ ప్రశ్నించాడు.

ఐతే తన దేశం, తన రాష్ట్రం, తన సంస్కృతిని గొప్పగా చూపించాలన్నది తన ఉద్దేశమని.. ఆ విషయంలో తాను గర్విస్తానని కాంతార స్టార్ చెప్పాడు. రిషబ్ నిర్మాణంలో తెరకెక్కిన కొత్త చిత్రం లాఫింగ్ బుద్ధ కూడా కాంతార తరహాలోనే లోకల్ కల్చర్‌ను గొప్పగా చూపించబోతున్న చిత్రమట. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ సినిమాల తీరును ఎండగడుతూ రిషబ్ ఈ కామెంట్స్ చేశాడు. ఈ అభిప్రాయంతో నార్త్ జనాలు కూడా ఏకీభవిస్తుండడం విశేషం.

This post was last modified on August 21, 2024 2:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…

2 hours ago

‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!

తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…

2 hours ago

పుష్ప స్టైల్ లో లోకేష్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను వీక్షించడం…

2 hours ago

డిల్లీ వేదికపై చైనా రోబో.. ఏంటి వివాదం?

ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…

3 hours ago

అంబటి… ఈ సారైనా రిలీజయ్యేనా?

సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.…

3 hours ago

మృత్యుంజయ్ మనసు మారితే మంచిదే

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో శ్రీవిష్ణు రెండు సినిమాలు రిలీజ్ కానుండటం గురించి అభిమానుల కంటే ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్…

3 hours ago