ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే. వాళ్ల సినిమాల రీచ్, బడ్జెట్లు, బిజినెస్ అన్నీ కూడా వేరే లెవెల్లో ఉండేవి. ప్రాంతీయ భాషా చిత్రాలు వాటిని అందుకోలేని స్థాయిలో ఉండేవి. కానీ ఇప్పుడు కథ రివర్స్ అయింది. ప్రాంతీయ చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలన విజయాలు నమోదు చేస్తున్నాయి. హిందీ చిత్రాల పరిధి తగ్గిపోతోంది.
గతంలో బాలీవుడ్ వాళ్లు రీజనల్ సినిమాలను.. వాటిలో భాగమైన వాళ్లను తక్కువగా చేసి మాట్లాడేవాళ్లు. ఇప్పటికీ ఆ ఒరవడి కొంత కొనసాగుతోందనడానికి ఇటీవల బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి.. మన ప్రభాస్ మీద చేసిన వ్యాఖ్యలు రుజువు. ఐతే ఇప్పుడు ఓ ప్రాంతీయ నటుడు, దర్శకుడు బాలీవుడ్ తీరును ఎండగట్టే వ్యాఖ్యలు చేశాడు. అతనే.. 2023 సంవత్సరానికి జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన రిషబ్ శెట్టి.
రిషబ్ కొంచెం ఔట్ స్పోకెన్ అని గతంలోనే రుజువైంది. ఇప్పుడు అతను బాలీవుడ్ మీద ఘాటు వ్యాఖ్యలే చేశాడు. భారతీయ చిత్రాలు.. ముఖ్యంగా బాలీవుడ్ మూవీస్ ఎప్పుడూ మన దేశాన్ని, సంస్కృతిని తక్కువ చేసి చూపిస్తుంటాయని విమర్శించాడు రిషబ్. ఈ తరహా ఆర్ట్ చిత్రాలకు ఇంటర్నేషనల్ లెవెల్లో రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుంతుంటాయని.. ఇలా సినిమాలు తీయాల్సిన అవసరం ఏముందని రిషబ్ ప్రశ్నించాడు.
ఐతే తన దేశం, తన రాష్ట్రం, తన సంస్కృతిని గొప్పగా చూపించాలన్నది తన ఉద్దేశమని.. ఆ విషయంలో తాను గర్విస్తానని కాంతార స్టార్ చెప్పాడు. రిషబ్ నిర్మాణంలో తెరకెక్కిన కొత్త చిత్రం లాఫింగ్ బుద్ధ కూడా కాంతార తరహాలోనే లోకల్ కల్చర్ను గొప్పగా చూపించబోతున్న చిత్రమట. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ సినిమాల తీరును ఎండగడుతూ రిషబ్ ఈ కామెంట్స్ చేశాడు. ఈ అభిప్రాయంతో నార్త్ జనాలు కూడా ఏకీభవిస్తుండడం విశేషం.
This post was last modified on August 21, 2024 2:28 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…