ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే. వాళ్ల సినిమాల రీచ్, బడ్జెట్లు, బిజినెస్ అన్నీ కూడా వేరే లెవెల్లో ఉండేవి. ప్రాంతీయ భాషా చిత్రాలు వాటిని అందుకోలేని స్థాయిలో ఉండేవి. కానీ ఇప్పుడు కథ రివర్స్ అయింది. ప్రాంతీయ చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలన విజయాలు నమోదు చేస్తున్నాయి. హిందీ చిత్రాల పరిధి తగ్గిపోతోంది.
గతంలో బాలీవుడ్ వాళ్లు రీజనల్ సినిమాలను.. వాటిలో భాగమైన వాళ్లను తక్కువగా చేసి మాట్లాడేవాళ్లు. ఇప్పటికీ ఆ ఒరవడి కొంత కొనసాగుతోందనడానికి ఇటీవల బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి.. మన ప్రభాస్ మీద చేసిన వ్యాఖ్యలు రుజువు. ఐతే ఇప్పుడు ఓ ప్రాంతీయ నటుడు, దర్శకుడు బాలీవుడ్ తీరును ఎండగట్టే వ్యాఖ్యలు చేశాడు. అతనే.. 2023 సంవత్సరానికి జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన రిషబ్ శెట్టి.
రిషబ్ కొంచెం ఔట్ స్పోకెన్ అని గతంలోనే రుజువైంది. ఇప్పుడు అతను బాలీవుడ్ మీద ఘాటు వ్యాఖ్యలే చేశాడు. భారతీయ చిత్రాలు.. ముఖ్యంగా బాలీవుడ్ మూవీస్ ఎప్పుడూ మన దేశాన్ని, సంస్కృతిని తక్కువ చేసి చూపిస్తుంటాయని విమర్శించాడు రిషబ్. ఈ తరహా ఆర్ట్ చిత్రాలకు ఇంటర్నేషనల్ లెవెల్లో రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుంతుంటాయని.. ఇలా సినిమాలు తీయాల్సిన అవసరం ఏముందని రిషబ్ ప్రశ్నించాడు.
ఐతే తన దేశం, తన రాష్ట్రం, తన సంస్కృతిని గొప్పగా చూపించాలన్నది తన ఉద్దేశమని.. ఆ విషయంలో తాను గర్విస్తానని కాంతార స్టార్ చెప్పాడు. రిషబ్ నిర్మాణంలో తెరకెక్కిన కొత్త చిత్రం లాఫింగ్ బుద్ధ కూడా కాంతార తరహాలోనే లోకల్ కల్చర్ను గొప్పగా చూపించబోతున్న చిత్రమట. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ సినిమాల తీరును ఎండగడుతూ రిషబ్ ఈ కామెంట్స్ చేశాడు. ఈ అభిప్రాయంతో నార్త్ జనాలు కూడా ఏకీభవిస్తుండడం విశేషం.
This post was last modified on August 21, 2024 2:28 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. సభా వేదికపై ఉన్న 98 ఏళ్ల…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు…
ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…