ఎన్నికల ఫలితాలు.. సినీ, రాజకీయ ప్రముఖుల మీద జోస్యాలు చెప్పడం ద్వారా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించిన వ్యక్తి వేణు స్వామి. ఆయన చెప్పిన జోస్యాల్లో చాలా వరకు ఫెయిలైనప్పటికీ.. సోషల్ మీడియాకు ఎప్పటికప్పుడు కంటెంట్ ఇస్తుంటాడని ఆయన్ని ఫాలో అవుతుంటారు. తన వీడియోలకు కూడా మంచి రీచ్ వస్తుంటుంది.
ఐతే ఈ మధ్య వేణు స్వామి హద్దులు దాటాడు.నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం చేసుకున్న రోజే.. వీళ్లిద్దరూ మూడేళ్లలో విడిపోతాడంటూ జోస్యం చెప్పి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆయన మీద మహిళా కమిషన్లో ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు టీవీ ఛానెళ్లలో వేణుస్వామికి వ్యతిరేకంగా చర్చలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే తమను ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నాడంటూ వేణు స్వామి, ఆయన భార్య.. జర్నలిస్ట్ మూర్తి తదితరుల మీద ఆరోపణలు చేశారు.
ఇలా వేణు స్వామి పేరు చర్చనీయాంశం అవుతున్న తరుణంలో.. పీఆర్వో టర్న్డ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఆయన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఫిలిం జర్నలిస్టులకు సంబంధించి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్కేఎన్.. వేణు స్వామి గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. వేణు స్వామి వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయని.. ఆయన కామెడీని తాను చాలా ఆస్వాదిస్తానని అన్నాడు ఎస్కేఎన్. ఆయన ఇండియా ఓడిపోతుందంటే గెలుస్తుందని.. పవన్ కళ్యాణ్ ఓడిపోతాడంటే గెలిచారని.. ప్రభాస్ సినిమా ఫ్లాప్ అవుతుందంటే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిందని.. ఇలా ఆయన చేసే కామెడీని తాను చాలా ఆస్వాదిస్తానని ఎస్కేఎన్ అన్నాడు.
ఐతే ఇలా కామెడీ జోస్యాలు చెబితే ఓకే కానీ.. సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి.. శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే విడిపోతారని వ్యాఖ్యానించడం ఎంత వరకు సమంజసమని ఎస్కేఎన్ ప్రశ్నించాడు. జ్యోతిష్యాన్ని తాను తప్పుబట్టనని.. కానీ దాంతో పాటు సంస్కారం ఉండాలంటూ వేణు స్వామి మీద విమర్శలు గుప్పించాడు ఎస్కేఎన్.
This post was last modified on August 21, 2024 7:34 am
థియేటర్లలో విడుదలైన పధ్నాలుగు రోజులకే కార్తీ కొత్త సినిమా వా వతియార్ ఓటిటిలో వచ్చేయడం అభిమానులకు షాక్ కలిగించింది. తెలుగు…
రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండదని చెబుతూ, ప్రభాస్ అభిమానులకు భరోసానిస్తూ, తేడా…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్…
రాజమౌళి కంటే ముందు సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుతమైన కథలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…
హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చర్చల్లో ఉన్న చిత్రం. సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రుద్రమదేవి తర్వాత తీయాలనుకున్న సినిమా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…