ఎన్నికల ఫలితాలు.. సినీ, రాజకీయ ప్రముఖుల మీద జోస్యాలు చెప్పడం ద్వారా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించిన వ్యక్తి వేణు స్వామి. ఆయన చెప్పిన జోస్యాల్లో చాలా వరకు ఫెయిలైనప్పటికీ.. సోషల్ మీడియాకు ఎప్పటికప్పుడు కంటెంట్ ఇస్తుంటాడని ఆయన్ని ఫాలో అవుతుంటారు. తన వీడియోలకు కూడా మంచి రీచ్ వస్తుంటుంది.
ఐతే ఈ మధ్య వేణు స్వామి హద్దులు దాటాడు.నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం చేసుకున్న రోజే.. వీళ్లిద్దరూ మూడేళ్లలో విడిపోతాడంటూ జోస్యం చెప్పి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆయన మీద మహిళా కమిషన్లో ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు టీవీ ఛానెళ్లలో వేణుస్వామికి వ్యతిరేకంగా చర్చలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే తమను ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నాడంటూ వేణు స్వామి, ఆయన భార్య.. జర్నలిస్ట్ మూర్తి తదితరుల మీద ఆరోపణలు చేశారు.
ఇలా వేణు స్వామి పేరు చర్చనీయాంశం అవుతున్న తరుణంలో.. పీఆర్వో టర్న్డ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఆయన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఫిలిం జర్నలిస్టులకు సంబంధించి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్కేఎన్.. వేణు స్వామి గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. వేణు స్వామి వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయని.. ఆయన కామెడీని తాను చాలా ఆస్వాదిస్తానని అన్నాడు ఎస్కేఎన్. ఆయన ఇండియా ఓడిపోతుందంటే గెలుస్తుందని.. పవన్ కళ్యాణ్ ఓడిపోతాడంటే గెలిచారని.. ప్రభాస్ సినిమా ఫ్లాప్ అవుతుందంటే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిందని.. ఇలా ఆయన చేసే కామెడీని తాను చాలా ఆస్వాదిస్తానని ఎస్కేఎన్ అన్నాడు.
ఐతే ఇలా కామెడీ జోస్యాలు చెబితే ఓకే కానీ.. సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి.. శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే విడిపోతారని వ్యాఖ్యానించడం ఎంత వరకు సమంజసమని ఎస్కేఎన్ ప్రశ్నించాడు. జ్యోతిష్యాన్ని తాను తప్పుబట్టనని.. కానీ దాంతో పాటు సంస్కారం ఉండాలంటూ వేణు స్వామి మీద విమర్శలు గుప్పించాడు ఎస్కేఎన్.
This post was last modified on August 21, 2024 7:34 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…