బయట కంటే సోషల్ మీడియాలో ఎక్కువ నానుతూ హీరో రవితేజ కన్నా హరీష్ శంకరే ఎక్కువ హైలైట్ ఆయిన మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. పలు మార్గాల్లో ఇది యావరేజ్ కన్నా మెరుగ్గా ఆడుతోందని దర్శకుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి ప్రేక్షకులకు రీచ్ కావడం లేదు. మీమర్స్ తో మీటింగ్ సైతం వీడియోల రూపంలో కాలక్షేపానికి పనికొచ్చింది తప్పించి కలెక్షన్లు పెంచడానికి ఉపయోగపడలేదు. ఇంకోవైపు నిర్మాణ సంస్థ పరిస్థితి అర్థమైపోయి మౌనంగా ఉంది. ప్రత్యేకంగా సక్సెస్ మీట్లు, సెలబ్రేషన్లు ఏవీ చేయకుండా ప్రాక్టికల్ గా ఆలోచిస్తోంది.
ట్రేడ్ టాక్ ప్రకారం మిస్టర్ బచ్చన్ ఇప్పటిదాకా రాబట్టింది కొంచెం అటుఇటుగా పదమూడు కోట్ల గ్రాసేనట. షేర్ గా చూసుకుంటే ఒక ఎనిమిది కోట్ల దాకా తేలుతుంది. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఇంకో ఇరవై కోట్లకు పైగానే షేర్ రాబట్టాలట. అధికారికంగా చెప్పలేదు కానీ ఇండస్ట్రీ వర్గాల్లో ఈ న్యూస్ అయితే ఉంది. ఎలా చూసుకున్నా ఇది సాధ్యమయ్యే పని కాదు. రెండో వారంలో పికప్ అవుతుందన్న సూచనలు తగ్గుతున్నాయి. పదమూడు నిముషాలు ట్రిమ్ చేసి వేగం పెంచినప్పటికీ అది జనాన్ని రప్పించేందుకు సరిపోవడం లేదు. ఇంకోవైపు ఆయ్, స్త్రీ 2 దూసుకుపోతున్నాయి.
అటు రవితేజ చూస్తే సితార సంస్థ భాను భోగవరపు దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమాలో బిజీ అయిపోయాడు. 2025 సంక్రాంతి విడుదల కాబట్టి వేగంగా పనులు జరుగుతున్నాయి. మిస్టర్ బచ్చన్ కొచ్చిన స్పందన తెలిసింది కనక ఎక్కువ దాని గురించి ఆలోచించే ఉద్దేశంలో లేడని సన్నిహితుల మాట. ఇంకోవైపు తమ కాంబోలో మరో సినిమా ఉంటుందని హరీష్ శంకర్ చెప్పాడు. ఒకవేళ నిజమైతే షాక్, మిరపకాయ్, మిస్టర్ బచ్చన్ తర్వాత నాలుగోది అవుతుంది. మూడింట్లో రెండు ఫ్లాప్ కావడం గమనించాల్సిన విషయం. ఇన్ని అంచనాల మధ్య బచ్చన్ నిరాశపరచడం ఎవరూ ఊహించనిది.
This post was last modified on August 20, 2024 2:37 pm
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…