Movie News

బహు దూరంలో బచ్చన్ లక్ష్యం

బయట కంటే సోషల్ మీడియాలో ఎక్కువ నానుతూ హీరో రవితేజ కన్నా హరీష్ శంకరే ఎక్కువ హైలైట్ ఆయిన మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. పలు మార్గాల్లో ఇది యావరేజ్ కన్నా మెరుగ్గా ఆడుతోందని దర్శకుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి ప్రేక్షకులకు రీచ్ కావడం లేదు. మీమర్స్ తో మీటింగ్ సైతం వీడియోల రూపంలో కాలక్షేపానికి పనికొచ్చింది తప్పించి కలెక్షన్లు పెంచడానికి ఉపయోగపడలేదు. ఇంకోవైపు నిర్మాణ సంస్థ పరిస్థితి అర్థమైపోయి మౌనంగా ఉంది. ప్రత్యేకంగా సక్సెస్ మీట్లు, సెలబ్రేషన్లు ఏవీ చేయకుండా ప్రాక్టికల్ గా ఆలోచిస్తోంది.

ట్రేడ్ టాక్ ప్రకారం మిస్టర్ బచ్చన్ ఇప్పటిదాకా రాబట్టింది కొంచెం అటుఇటుగా పదమూడు కోట్ల గ్రాసేనట. షేర్ గా చూసుకుంటే ఒక ఎనిమిది కోట్ల దాకా తేలుతుంది. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఇంకో ఇరవై కోట్లకు పైగానే షేర్ రాబట్టాలట. అధికారికంగా చెప్పలేదు కానీ ఇండస్ట్రీ వర్గాల్లో ఈ న్యూస్ అయితే ఉంది. ఎలా చూసుకున్నా ఇది సాధ్యమయ్యే పని కాదు. రెండో వారంలో పికప్ అవుతుందన్న సూచనలు తగ్గుతున్నాయి. పదమూడు నిముషాలు ట్రిమ్ చేసి వేగం పెంచినప్పటికీ అది జనాన్ని రప్పించేందుకు సరిపోవడం లేదు. ఇంకోవైపు ఆయ్, స్త్రీ 2 దూసుకుపోతున్నాయి.

అటు రవితేజ చూస్తే సితార సంస్థ భాను భోగవరపు దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమాలో బిజీ అయిపోయాడు. 2025 సంక్రాంతి విడుదల కాబట్టి వేగంగా పనులు జరుగుతున్నాయి. మిస్టర్ బచ్చన్ కొచ్చిన స్పందన తెలిసింది కనక ఎక్కువ దాని గురించి ఆలోచించే ఉద్దేశంలో లేడని సన్నిహితుల మాట. ఇంకోవైపు తమ కాంబోలో మరో సినిమా ఉంటుందని హరీష్ శంకర్ చెప్పాడు. ఒకవేళ నిజమైతే షాక్, మిరపకాయ్, మిస్టర్ బచ్చన్ తర్వాత నాలుగోది అవుతుంది. మూడింట్లో రెండు ఫ్లాప్ కావడం గమనించాల్సిన విషయం. ఇన్ని అంచనాల మధ్య బచ్చన్ నిరాశపరచడం ఎవరూ ఊహించనిది.

This post was last modified on August 20, 2024 2:37 pm

Share

Recent Posts

టీడీపీకి ఓట్ల `ప్రాజెక్టులు`… త‌మ్ముళ్లు హ్యాపీ.. !

కీల‌క‌మైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌కు సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న ప్రాజెక్టుల‌నే…

2 hours ago

దేశ‌వ్యాప్తంగా 288 మంది.. ఏపీలో ఐదుగురు.. ఏమ‌య్యారు?

దేశ‌వ్యాప్తంగా 288 మంది నేపాల్ వ‌ర‌ద‌ల్లో గ‌ల్లంత‌య్యార‌ని కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. మొత్తం 532 మంది ఆచూకీ క‌నిపించ‌కుండా…

4 hours ago

మృతదేహాల నుంచి నగల అపహరణ… నేపాల్‌లో అమానవీయం

నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…

4 hours ago

ఒకే రోజు 10 మంది… మూడు వారాల్లో 60 మంది శిశువుల మృతి

దేశంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రైవేటు వైద్యుల దోపిడీ వెరసి సామాన్య ప్రజల ప్రాణాలకు గ్యారంటీ…

4 hours ago

సినిమా పోయినా… దిల్ రాజు సేఫేనట

కన్నడ అనువాద చిత్రమైన ‘టాక్సిక్’ ఇక్కడి టాప్ స్టార్ల సినిమాల లెవెల్లో భారీగా రిలీజైందంటే అందుకు ప్రధాన కారణం.. దిల్…

5 hours ago

రాఖీ కట్టమంటే విదేశాలకు పారిపోయాడు

అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతి రూపం రాఖీ. అలాంటి పవిత్రమైన రాఖీ పండుగ కూడా నేడు రాజకీయ చట్రంలో చిక్కుకుంది.…

5 hours ago