బయట కంటే సోషల్ మీడియాలో ఎక్కువ నానుతూ హీరో రవితేజ కన్నా హరీష్ శంకరే ఎక్కువ హైలైట్ ఆయిన మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. పలు మార్గాల్లో ఇది యావరేజ్ కన్నా మెరుగ్గా ఆడుతోందని దర్శకుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి ప్రేక్షకులకు రీచ్ కావడం లేదు. మీమర్స్ తో మీటింగ్ సైతం వీడియోల రూపంలో కాలక్షేపానికి పనికొచ్చింది తప్పించి కలెక్షన్లు పెంచడానికి ఉపయోగపడలేదు. ఇంకోవైపు నిర్మాణ సంస్థ పరిస్థితి అర్థమైపోయి మౌనంగా ఉంది. ప్రత్యేకంగా సక్సెస్ మీట్లు, సెలబ్రేషన్లు ఏవీ చేయకుండా ప్రాక్టికల్ గా ఆలోచిస్తోంది.
ట్రేడ్ టాక్ ప్రకారం మిస్టర్ బచ్చన్ ఇప్పటిదాకా రాబట్టింది కొంచెం అటుఇటుగా పదమూడు కోట్ల గ్రాసేనట. షేర్ గా చూసుకుంటే ఒక ఎనిమిది కోట్ల దాకా తేలుతుంది. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఇంకో ఇరవై కోట్లకు పైగానే షేర్ రాబట్టాలట. అధికారికంగా చెప్పలేదు కానీ ఇండస్ట్రీ వర్గాల్లో ఈ న్యూస్ అయితే ఉంది. ఎలా చూసుకున్నా ఇది సాధ్యమయ్యే పని కాదు. రెండో వారంలో పికప్ అవుతుందన్న సూచనలు తగ్గుతున్నాయి. పదమూడు నిముషాలు ట్రిమ్ చేసి వేగం పెంచినప్పటికీ అది జనాన్ని రప్పించేందుకు సరిపోవడం లేదు. ఇంకోవైపు ఆయ్, స్త్రీ 2 దూసుకుపోతున్నాయి.
అటు రవితేజ చూస్తే సితార సంస్థ భాను భోగవరపు దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమాలో బిజీ అయిపోయాడు. 2025 సంక్రాంతి విడుదల కాబట్టి వేగంగా పనులు జరుగుతున్నాయి. మిస్టర్ బచ్చన్ కొచ్చిన స్పందన తెలిసింది కనక ఎక్కువ దాని గురించి ఆలోచించే ఉద్దేశంలో లేడని సన్నిహితుల మాట. ఇంకోవైపు తమ కాంబోలో మరో సినిమా ఉంటుందని హరీష్ శంకర్ చెప్పాడు. ఒకవేళ నిజమైతే షాక్, మిరపకాయ్, మిస్టర్ బచ్చన్ తర్వాత నాలుగోది అవుతుంది. మూడింట్లో రెండు ఫ్లాప్ కావడం గమనించాల్సిన విషయం. ఇన్ని అంచనాల మధ్య బచ్చన్ నిరాశపరచడం ఎవరూ ఊహించనిది.
This post was last modified on August 20, 2024 2:37 pm
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…