బయట కంటే సోషల్ మీడియాలో ఎక్కువ నానుతూ హీరో రవితేజ కన్నా హరీష్ శంకరే ఎక్కువ హైలైట్ ఆయిన మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. పలు మార్గాల్లో ఇది యావరేజ్ కన్నా మెరుగ్గా ఆడుతోందని దర్శకుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి ప్రేక్షకులకు రీచ్ కావడం లేదు. మీమర్స్ తో మీటింగ్ సైతం వీడియోల రూపంలో కాలక్షేపానికి పనికొచ్చింది తప్పించి కలెక్షన్లు పెంచడానికి ఉపయోగపడలేదు. ఇంకోవైపు నిర్మాణ సంస్థ పరిస్థితి అర్థమైపోయి మౌనంగా ఉంది. ప్రత్యేకంగా సక్సెస్ మీట్లు, సెలబ్రేషన్లు ఏవీ చేయకుండా ప్రాక్టికల్ గా ఆలోచిస్తోంది.
ట్రేడ్ టాక్ ప్రకారం మిస్టర్ బచ్చన్ ఇప్పటిదాకా రాబట్టింది కొంచెం అటుఇటుగా పదమూడు కోట్ల గ్రాసేనట. షేర్ గా చూసుకుంటే ఒక ఎనిమిది కోట్ల దాకా తేలుతుంది. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఇంకో ఇరవై కోట్లకు పైగానే షేర్ రాబట్టాలట. అధికారికంగా చెప్పలేదు కానీ ఇండస్ట్రీ వర్గాల్లో ఈ న్యూస్ అయితే ఉంది. ఎలా చూసుకున్నా ఇది సాధ్యమయ్యే పని కాదు. రెండో వారంలో పికప్ అవుతుందన్న సూచనలు తగ్గుతున్నాయి. పదమూడు నిముషాలు ట్రిమ్ చేసి వేగం పెంచినప్పటికీ అది జనాన్ని రప్పించేందుకు సరిపోవడం లేదు. ఇంకోవైపు ఆయ్, స్త్రీ 2 దూసుకుపోతున్నాయి.
అటు రవితేజ చూస్తే సితార సంస్థ భాను భోగవరపు దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమాలో బిజీ అయిపోయాడు. 2025 సంక్రాంతి విడుదల కాబట్టి వేగంగా పనులు జరుగుతున్నాయి. మిస్టర్ బచ్చన్ కొచ్చిన స్పందన తెలిసింది కనక ఎక్కువ దాని గురించి ఆలోచించే ఉద్దేశంలో లేడని సన్నిహితుల మాట. ఇంకోవైపు తమ కాంబోలో మరో సినిమా ఉంటుందని హరీష్ శంకర్ చెప్పాడు. ఒకవేళ నిజమైతే షాక్, మిరపకాయ్, మిస్టర్ బచ్చన్ తర్వాత నాలుగోది అవుతుంది. మూడింట్లో రెండు ఫ్లాప్ కావడం గమనించాల్సిన విషయం. ఇన్ని అంచనాల మధ్య బచ్చన్ నిరాశపరచడం ఎవరూ ఊహించనిది.
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…