క్రికెటర్ల బయోపిక్కులు కొత్తేమీ కాదు. ఎంఎస్ ధోని ఎంత పెద్ద హిట్టో అభిమానులను ఎప్పుడు అడిగినా గర్వంగా చెబుతారు. సచిన్ ఆ స్థాయిలో ఆడకపోయినా ఓటిటిలో భారీ స్పందన దక్కించుకుంది. డాక్యుమెంటరీ తరహాలో తీయడం వల్ల రిజల్ట్ మారింది కానీ లేదంటే రికార్డులు బద్దలయ్యేవి. అజారుద్దీన్ మీద తీశారు కానీ డిజాస్టరయ్యింది. భారీ ఫాలోయింగ్ లేకపోవడం ప్రభావం చూపించింది. మిథాలీ రాజ్ లైఫ్ ని స్క్రీన్ మీద చూపిస్తే జనం తిరస్కరించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల స్టోరీలను తెరమీద చూపించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ కార్యరూపం దాల్చలేదు.
ఒకప్పటి యూత్ హాట్ ఫెవరెట్ యువరాజ్ సింగ్ జీవితాన్ని సినిమాగా తీయబోతోంది టి సిరీస్ నిర్మాణ సంస్థ. రవి భగ్చంద్కా భాగస్వామ్యంలో భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ప్యాన్ ఇండియా లెవెల్ లో పెద్ద బడ్జెట్ కేటాయించబోతున్నారు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు కానీ టైటిల్ రోల్ ఎవరు చేస్తారనేది మాత్రం గుట్టుగా ఉంచారు. విక్కీ కౌశల్, సిద్దార్థ్ మల్హోత్రా, ఆదిత్య రాయ్ కపూర్ ఇలా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి కానీ నేషనల్ వైడ్ ఇమేజ్ ఉన్న దక్షిణాది స్టార్ ని ప్రయత్నిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
క్రికెట్ ని సీరియస్ గా ప్రేమించే వాళ్లకు యువరాజ్ సింగ్ స్టామినా తెలుసు. 2007 ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్లో స్టువర్ట్ బ్రాడ్ బోలింగ్ ని ఊచకోత కోస్తూ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి ముప్పై ఆరు పరుగులు రాబట్టడం చరిత్రలో నిలిచిపోయింది. అప్పటి షాట్లు నెలల తరబడి ఫ్యాన్స్ ని వెంటాడుతూ వచ్చాయి. ఎన్నో మైలురాళ్ళు సాధించిన యువరాజ్ క్యాన్సర్ బారిన పడి మృత్య ముఖం దగ్గరగా వెళ్లి పోరాడి బ్రతికాడు. దానికి సంబంధించిన ఎమోషనల్ ఎపిసోడ్స్ సినిమాలో ఉంటాయట. అంచనాలకు తగట్టు రూపొందిస్తే మాత్రం హిట్టు కొట్టొచ్చు. మన క్రీడా ప్రియులు ఎగబడి చూస్తారు.
This post was last modified on August 20, 2024 10:26 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…