క్రికెటర్ల బయోపిక్కులు కొత్తేమీ కాదు. ఎంఎస్ ధోని ఎంత పెద్ద హిట్టో అభిమానులను ఎప్పుడు అడిగినా గర్వంగా చెబుతారు. సచిన్ ఆ స్థాయిలో ఆడకపోయినా ఓటిటిలో భారీ స్పందన దక్కించుకుంది. డాక్యుమెంటరీ తరహాలో తీయడం వల్ల రిజల్ట్ మారింది కానీ లేదంటే రికార్డులు బద్దలయ్యేవి. అజారుద్దీన్ మీద తీశారు కానీ డిజాస్టరయ్యింది. భారీ ఫాలోయింగ్ లేకపోవడం ప్రభావం చూపించింది. మిథాలీ రాజ్ లైఫ్ ని స్క్రీన్ మీద చూపిస్తే జనం తిరస్కరించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల స్టోరీలను తెరమీద చూపించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ కార్యరూపం దాల్చలేదు.
ఒకప్పటి యూత్ హాట్ ఫెవరెట్ యువరాజ్ సింగ్ జీవితాన్ని సినిమాగా తీయబోతోంది టి సిరీస్ నిర్మాణ సంస్థ. రవి భగ్చంద్కా భాగస్వామ్యంలో భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ప్యాన్ ఇండియా లెవెల్ లో పెద్ద బడ్జెట్ కేటాయించబోతున్నారు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు కానీ టైటిల్ రోల్ ఎవరు చేస్తారనేది మాత్రం గుట్టుగా ఉంచారు. విక్కీ కౌశల్, సిద్దార్థ్ మల్హోత్రా, ఆదిత్య రాయ్ కపూర్ ఇలా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి కానీ నేషనల్ వైడ్ ఇమేజ్ ఉన్న దక్షిణాది స్టార్ ని ప్రయత్నిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
క్రికెట్ ని సీరియస్ గా ప్రేమించే వాళ్లకు యువరాజ్ సింగ్ స్టామినా తెలుసు. 2007 ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్లో స్టువర్ట్ బ్రాడ్ బోలింగ్ ని ఊచకోత కోస్తూ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి ముప్పై ఆరు పరుగులు రాబట్టడం చరిత్రలో నిలిచిపోయింది. అప్పటి షాట్లు నెలల తరబడి ఫ్యాన్స్ ని వెంటాడుతూ వచ్చాయి. ఎన్నో మైలురాళ్ళు సాధించిన యువరాజ్ క్యాన్సర్ బారిన పడి మృత్య ముఖం దగ్గరగా వెళ్లి పోరాడి బ్రతికాడు. దానికి సంబంధించిన ఎమోషనల్ ఎపిసోడ్స్ సినిమాలో ఉంటాయట. అంచనాలకు తగట్టు రూపొందిస్తే మాత్రం హిట్టు కొట్టొచ్చు. మన క్రీడా ప్రియులు ఎగబడి చూస్తారు.
This post was last modified on August 20, 2024 10:26 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…