క్రికెటర్ల బయోపిక్కులు కొత్తేమీ కాదు. ఎంఎస్ ధోని ఎంత పెద్ద హిట్టో అభిమానులను ఎప్పుడు అడిగినా గర్వంగా చెబుతారు. సచిన్ ఆ స్థాయిలో ఆడకపోయినా ఓటిటిలో భారీ స్పందన దక్కించుకుంది. డాక్యుమెంటరీ తరహాలో తీయడం వల్ల రిజల్ట్ మారింది కానీ లేదంటే రికార్డులు బద్దలయ్యేవి. అజారుద్దీన్ మీద తీశారు కానీ డిజాస్టరయ్యింది. భారీ ఫాలోయింగ్ లేకపోవడం ప్రభావం చూపించింది. మిథాలీ రాజ్ లైఫ్ ని స్క్రీన్ మీద చూపిస్తే జనం తిరస్కరించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల స్టోరీలను తెరమీద చూపించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ కార్యరూపం దాల్చలేదు.
ఒకప్పటి యూత్ హాట్ ఫెవరెట్ యువరాజ్ సింగ్ జీవితాన్ని సినిమాగా తీయబోతోంది టి సిరీస్ నిర్మాణ సంస్థ. రవి భగ్చంద్కా భాగస్వామ్యంలో భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ప్యాన్ ఇండియా లెవెల్ లో పెద్ద బడ్జెట్ కేటాయించబోతున్నారు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు కానీ టైటిల్ రోల్ ఎవరు చేస్తారనేది మాత్రం గుట్టుగా ఉంచారు. విక్కీ కౌశల్, సిద్దార్థ్ మల్హోత్రా, ఆదిత్య రాయ్ కపూర్ ఇలా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి కానీ నేషనల్ వైడ్ ఇమేజ్ ఉన్న దక్షిణాది స్టార్ ని ప్రయత్నిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
క్రికెట్ ని సీరియస్ గా ప్రేమించే వాళ్లకు యువరాజ్ సింగ్ స్టామినా తెలుసు. 2007 ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్లో స్టువర్ట్ బ్రాడ్ బోలింగ్ ని ఊచకోత కోస్తూ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి ముప్పై ఆరు పరుగులు రాబట్టడం చరిత్రలో నిలిచిపోయింది. అప్పటి షాట్లు నెలల తరబడి ఫ్యాన్స్ ని వెంటాడుతూ వచ్చాయి. ఎన్నో మైలురాళ్ళు సాధించిన యువరాజ్ క్యాన్సర్ బారిన పడి మృత్య ముఖం దగ్గరగా వెళ్లి పోరాడి బ్రతికాడు. దానికి సంబంధించిన ఎమోషనల్ ఎపిసోడ్స్ సినిమాలో ఉంటాయట. అంచనాలకు తగట్టు రూపొందిస్తే మాత్రం హిట్టు కొట్టొచ్చు. మన క్రీడా ప్రియులు ఎగబడి చూస్తారు.
This post was last modified on August 20, 2024 10:26 am
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…