ఏదో ఒక భాషకు పరిమితం కాకుండా.. వేరే భాషల్లోనూ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించాలని ప్రతి స్టార్ హీరోకూ ఉంటుంది. అందులోనూ గత దశాబ్ద కాలంలో చాలామంది హీరోలు పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపి మార్కెట్ను విస్తరించుకున్న నేపథ్యంలో తామూ ఆ బాటలో నడవాలని కోరుకుంటున్నారు.
ఇందులో భాగంగా కొన్ని సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. కానీ అందరికీ ఇది వర్కవుట్ కావడం లేదు. నేచురల్ స్టార్ నాని సైతం కొన్ని పాన్ ఇండియాప్రయత్నాలు చేశాడు. దసరా, హాయ్ నాన్న చిత్రాలు వేరే భాషల్లోనూ రిలీజయ్యాయి. అవి తెలుగులో బాగా ఆడినా.. వేరే భాషల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఇతర భాషల్లో రిలీజ్ ఒక ప్రయాసగా మాత్రమే మిగిలింది.
ఐతే నానికి తమిళంలో ఫాలోయింగ్ లేకపోలేదు. అతను ఒక ‘సెగ’ అనే స్ట్రెయిట్ తమిళ సినిమా చేశాడు. ‘ఈగ’ సైతం తమిళంలో బాగా ఆడింది. కానీ అప్పుడొచ్చిన ఫాలోయింగ్ను సరిగా ఉపయోగించుకోలేదు.
ఐతే ఇప్పుడు నాని కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతుండగా.. మిగతా భాషల సంగతేమో కానీ.. తమిళంలో మాత్రం ఇది బాగా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో విలన్గా నటించిన ఎస్.జె.సూర్యకు తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక టైంలో ఎగ్జైటింగ్ క్యారెక్టర్లు చేసిన సూర్యకు ఈ మధ్య తమిళంలో కూడా మంచి పాత్రలు పడట్లేదు.
కానీ ‘సరిపోదా..’లో తన పాత్ర ఎగ్జైటింగ్గా కనిపిస్తోంది. ఇందులో కథానాయికగా చేసిన ప్రియాంక మోహన్ కూడా తమిళంలో పాపులర్. ఈ కథ కూడా సార్వజనీనమైందిగా అనిపిస్తూ తమిళ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాను తమిళనాట బాగానే ప్రమోట్ చేస్తున్నారు. సినిమాకు మంచి టాక్ వస్తే.. తమిళంలోనూ నానికి మంచి హిట్ పడేలా కనిపిస్తోంది.
This post was last modified on August 20, 2024 10:10 am
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…