సినిమా కోసం ఏమైనా చేయడానికి సిద్ధమయ్యే నటుల్లో విక్రమ్ ఒకరు. నటనను అతను తీసుకున్నంత సీరియస్గా ఎవరూ తీసుకోలేరనిపిస్తుంది. పాత్ర కోసం ప్రాణం పెట్టి పని చేయడం అంటే ఏంటో విక్రమ్ను చూసే తెలుసుకోవాలి. ‘సేతు’ మొదలుకుని ‘ఐ’ వరకు తన పాత్రల కోసం విక్రమ్ ఎలా ఒళ్లు హూనం చేసుకున్నాడో అందరికీ తెలుసు. ఇదేం డెడికేషన్రా బాబూ అని ప్రతి సందర్భంలోనూ ప్రేక్షకులు ఆశ్చర్యపోతుంటారు.
ఐతే అంత కష్టపడే నటుడికి అందుకు తగ్గ విజయాలు దక్కకపోవడం బాధ కలిస్తుంది. ఒక సమయంలో శివపుత్రుడు, సామి, అపరిచితుడు లాంటి బ్లాక్బస్టర్లు అందుకున్న విక్రమ్.. ఆ తర్వాత సరైన విజయం లేక చాలా ఏళ్లు ఇబ్బంది పడ్డాడు. గత రెండు దశాబ్దాల్లో విక్రమ్కు నిఖార్సయిన సూపర్ హిట్ పడనే లేదు. ఇలాంటి టైంలో ‘తంగలాన్’ మూవీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు విక్రమ్.
ఈ సినిమాలో విక్రమ్ లుక్ చూసి షాకవ్వని వాళ్లు లేరు. పాత్ర కోసం అలాంటి మేకోవర్ అందరికీ సాధ్యం కాదు. ఆ లుక్లోనే సుదీర్ఘ కాలం షూటింగ్లో పాల్గొన్నాడు. విక్రమ్ అత్యంత కష్టపడ్డ చిత్రాల్లో ఇదొకటి. దీనికైనా మంచి ఫలితం దక్కుతుందా అని విక్రమ్ ఫ్యాన్స్ ఎదురు చూశారు. ఐతే తొలి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. దీంతో మరోసారి విక్రమ్ కష్టం బూడిదలో పోసిన పన్నీరవతుందా అన్న సందేహాలు కలిగాయి.
కానీ టాక్తో సంబంధం లేకుండా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ వచ్చాయి. తర్వాతి రోజుల్లో కూడా సినిమా స్టడీగా సాగుతోంది. మూడు రోజుల్లో ఈ సినిమా వసూళ్లు రూ.56 కోట్లకు చేరుకున్నాయి. ఆదివారం అటు తమిళంలో, ఇటు తెలుగులో ఆక్యుపెన్సీలు బాగున్నాయి. వీకెండ్ వరకు సినిమా సంతృప్తికర వసూళ్లు రాబడుతోంది. వీక్ డేస్లో కూడా నిలబడగలిగితే విక్రమ్ ఖాతాలో చాన్నాళ్లకు ఒక మంచి హిట్ పడ్డట్లే. సినిమాలో లోపాలున్నప్పటికీ టీం పెట్టిన ఎఫర్ట్.. ముఖ్యంగా విక్రమ్ పడ్డ కష్టం చూసి.. అతడి నటన కోసం ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారని చెప్పొచ్చు.
This post was last modified on August 19, 2024 6:25 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…