సినిమా కోసం ఏమైనా చేయడానికి సిద్ధమయ్యే నటుల్లో విక్రమ్ ఒకరు. నటనను అతను తీసుకున్నంత సీరియస్గా ఎవరూ తీసుకోలేరనిపిస్తుంది. పాత్ర కోసం ప్రాణం పెట్టి పని చేయడం అంటే ఏంటో విక్రమ్ను చూసే తెలుసుకోవాలి. ‘సేతు’ మొదలుకుని ‘ఐ’ వరకు తన పాత్రల కోసం విక్రమ్ ఎలా ఒళ్లు హూనం చేసుకున్నాడో అందరికీ తెలుసు. ఇదేం డెడికేషన్రా బాబూ అని ప్రతి సందర్భంలోనూ ప్రేక్షకులు ఆశ్చర్యపోతుంటారు.
ఐతే అంత కష్టపడే నటుడికి అందుకు తగ్గ విజయాలు దక్కకపోవడం బాధ కలిస్తుంది. ఒక సమయంలో శివపుత్రుడు, సామి, అపరిచితుడు లాంటి బ్లాక్బస్టర్లు అందుకున్న విక్రమ్.. ఆ తర్వాత సరైన విజయం లేక చాలా ఏళ్లు ఇబ్బంది పడ్డాడు. గత రెండు దశాబ్దాల్లో విక్రమ్కు నిఖార్సయిన సూపర్ హిట్ పడనే లేదు. ఇలాంటి టైంలో ‘తంగలాన్’ మూవీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు విక్రమ్.
ఈ సినిమాలో విక్రమ్ లుక్ చూసి షాకవ్వని వాళ్లు లేరు. పాత్ర కోసం అలాంటి మేకోవర్ అందరికీ సాధ్యం కాదు. ఆ లుక్లోనే సుదీర్ఘ కాలం షూటింగ్లో పాల్గొన్నాడు. విక్రమ్ అత్యంత కష్టపడ్డ చిత్రాల్లో ఇదొకటి. దీనికైనా మంచి ఫలితం దక్కుతుందా అని విక్రమ్ ఫ్యాన్స్ ఎదురు చూశారు. ఐతే తొలి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. దీంతో మరోసారి విక్రమ్ కష్టం బూడిదలో పోసిన పన్నీరవతుందా అన్న సందేహాలు కలిగాయి.
కానీ టాక్తో సంబంధం లేకుండా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ వచ్చాయి. తర్వాతి రోజుల్లో కూడా సినిమా స్టడీగా సాగుతోంది. మూడు రోజుల్లో ఈ సినిమా వసూళ్లు రూ.56 కోట్లకు చేరుకున్నాయి. ఆదివారం అటు తమిళంలో, ఇటు తెలుగులో ఆక్యుపెన్సీలు బాగున్నాయి. వీకెండ్ వరకు సినిమా సంతృప్తికర వసూళ్లు రాబడుతోంది. వీక్ డేస్లో కూడా నిలబడగలిగితే విక్రమ్ ఖాతాలో చాన్నాళ్లకు ఒక మంచి హిట్ పడ్డట్లే. సినిమాలో లోపాలున్నప్పటికీ టీం పెట్టిన ఎఫర్ట్.. ముఖ్యంగా విక్రమ్ పడ్డ కష్టం చూసి.. అతడి నటన కోసం ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారని చెప్పొచ్చు.
This post was last modified on August 19, 2024 6:25 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం నిజంగానే ఓ విచిత్ర అనుభవాన్ని మిగిల్చింది. మంగళవారం…
ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అట్లీ దర్శకత్వంలో అతను చేయబోయే మెగా మూవీకి సంబంధించిన…
సింగపూర్ లో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం భారీదేనని చెప్పాలి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ లో చదువుతున్న తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్…
ఎన్నో కలలు కంటూ అమెరికాకు వెళ్లే భారత విద్యార్థులకు ఇప్పుడు పరిస్థితులు కలవరపెడుతున్నాయి. అమెరికాలో వీసా నియమాలు కఠినతరం కావడం,…
ప్రజాలకు మెరుగైన పాలనను అందించేందుకు పాలనా సంస్కరణలను రూపొందించి అమలు చేసే విషయంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిది…