ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడిలో ప్రభాస్ పాత్ర గురించి బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. తక్షణమే అతను క్షమాపణ చెప్పాలంటూ డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక సినిమా నచ్చడం, నచ్చకపోవడం వ్యక్తిగత అభిప్రాయమే కావొచ్చు కానీ ఇలా ఒక యాక్టర్ ని అదే పనిగా టార్గెట్ చేసుకోవడం పట్ల భగ్గుమంటున్నారు. టి సిరీస్ లాంటి అతి పెద్ద బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ప్రభాస్ వెంటపడి మరీ వరసగా చిత్రాలు నిర్మించడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.
మున్నాభాయ్ ఎంబిబిఎస్ ఏటిఎం పాత్ర ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న అర్షద్ వార్సికి ఆ తర్వాత జాలీ ఎల్ఎల్బి మరింత పేరు తీసుకొచ్చింది. అసుర్ వెబ్ సిరీస్ కు మంచి స్పందన వచ్చింది. దీంతో తనకు తాను పెద్ద స్టార్ గా భావిస్తున్నాడో ఏమో మరి ఏకంగా ప్రభాస్ ని జోకర్ అనే స్థాయికి దిగజారిపోయాడు. అవసరం లేకపోయినా మ్యాడ్ మ్యాక్స్, మెల్ గిబ్సన్ లతో పోలిక తేవడంతో పాటు అమితాబ్ బచ్చన్ ని పొగడటం కోసం ప్రభాస్ ని తక్కువ చేసే మాట్లాడే మేధావితనం ఎందుకు వచ్చిందో మరి. ముంబై మీడియా సైతం ఇతని వ్యాఖ్యలను ఖండిస్తూ కథనాలు వెలువరిస్తున్నాయి.
ఏది ఏమైనా ప్రభాస్ మీద ఈ ఏడుపు ఇప్పటిది కాదు. బాహుబలి నుంచే మొదలయ్యింది. హిందీలో రికార్డులు సృష్టించినప్పుడు చాలా మంది బడా హీరోలు కనీసం దాన్ని చూసేందుకు, విజయాన్ని అంగీకరించేందుకు ఇష్టపడలేదు. ఆర్ఆర్ఆర్ టైంలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ప్రమోషన్లలో పాల్గొనడానికి కారణం రాజమౌళితో అవసరం, చరణ్ తో స్నేహం లాంటి కారణాలున్నాయి. అంతే తప్ప స్వచ్ఛందంగా ముందుకొచ్చి సౌత్ సినిమాని మోసిన దాఖలాలు చాలా తక్కువ. సపోర్టింగ్ రోల్స్ చేసుకునే ఒక ఆర్టిస్టు వెయ్యి కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ మీద మాట తూలాడంటే అది వైరల్ కావడం కోసమే.
This post was last modified on August 19, 2024 3:01 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…