Movie News

ప్రభాస్ మీద అంత ఏడుపు ఎందుకు

ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడిలో ప్రభాస్ పాత్ర గురించి బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. తక్షణమే అతను క్షమాపణ చెప్పాలంటూ డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక సినిమా నచ్చడం, నచ్చకపోవడం వ్యక్తిగత అభిప్రాయమే కావొచ్చు కానీ ఇలా ఒక యాక్టర్ ని అదే పనిగా టార్గెట్ చేసుకోవడం పట్ల భగ్గుమంటున్నారు. టి సిరీస్ లాంటి అతి పెద్ద బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ప్రభాస్ వెంటపడి మరీ వరసగా చిత్రాలు నిర్మించడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.

మున్నాభాయ్ ఎంబిబిఎస్ ఏటిఎం పాత్ర ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న అర్షద్ వార్సికి ఆ తర్వాత జాలీ ఎల్ఎల్బి మరింత పేరు తీసుకొచ్చింది. అసుర్ వెబ్ సిరీస్ కు మంచి స్పందన వచ్చింది. దీంతో తనకు తాను పెద్ద స్టార్ గా భావిస్తున్నాడో ఏమో మరి ఏకంగా ప్రభాస్ ని జోకర్ అనే స్థాయికి దిగజారిపోయాడు. అవసరం లేకపోయినా మ్యాడ్ మ్యాక్స్, మెల్ గిబ్సన్ లతో పోలిక తేవడంతో పాటు అమితాబ్ బచ్చన్ ని పొగడటం కోసం ప్రభాస్ ని తక్కువ చేసే మాట్లాడే మేధావితనం ఎందుకు వచ్చిందో మరి. ముంబై మీడియా సైతం ఇతని వ్యాఖ్యలను ఖండిస్తూ కథనాలు వెలువరిస్తున్నాయి.

ఏది ఏమైనా ప్రభాస్ మీద ఈ ఏడుపు ఇప్పటిది కాదు. బాహుబలి నుంచే మొదలయ్యింది. హిందీలో రికార్డులు సృష్టించినప్పుడు చాలా మంది బడా హీరోలు కనీసం దాన్ని చూసేందుకు, విజయాన్ని అంగీకరించేందుకు ఇష్టపడలేదు. ఆర్ఆర్ఆర్ టైంలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ప్రమోషన్లలో పాల్గొనడానికి కారణం రాజమౌళితో అవసరం, చరణ్ తో స్నేహం లాంటి కారణాలున్నాయి. అంతే తప్ప స్వచ్ఛందంగా ముందుకొచ్చి సౌత్ సినిమాని మోసిన దాఖలాలు చాలా తక్కువ. సపోర్టింగ్ రోల్స్ చేసుకునే ఒక ఆర్టిస్టు వెయ్యి కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ మీద మాట తూలాడంటే అది వైరల్ కావడం కోసమే. 

This post was last modified on August 19, 2024 3:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

59 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago