ఏ అడ్డంకులు రాకుండా పుష్ప 2 ది రూల్ కనక ముందు చెప్పినట్టు ఆగస్ట్ 15 విడుదలయ్యి ఉంటే ఈవారం దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ అయ్యేది. బంగారం లాంటి ఛాన్స్ మిస్సయ్యిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇండిపెండెన్స్ డేకి ఎంత స్టామినా ఉందో స్త్రీ 2 లాంటి మీడియం బడ్జెట్ మూవీకి వస్తున్న వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. ఒక కామెడీ హారర్ సినిమా అందులోనూ రాజ్ కుమార్ రావు లాంటి చిన్న హీరో, శ్రద్ధ కపూర్ లాంటి టయర్ 2 హీరోయిన్ చిత్రానికి మొదటి రోజు వంద కోట్ల రేంజ్ లో వసూళ్లు ఎవరైనా ఊహించగలరా. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు ఆశించగలరా.
స్త్రీ 2 సునామి చూసి తలలు పండిన బాలీవుడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పోటీలో ఉన్న ఖేల్ ఖేల్ మే, వేదా, డబుల్ ఇస్మార్ట్ లను దరిదాపుల్లో లేకుండా తరిమికొట్టే స్థాయిలో చెలరేగిపోవడం చూసి నోటమాట రావడం లేదు. ముంబై లాంటి నగరాల్లో వీకెండ్ లో కూడా అర్ధరాత్రి షోలు వేస్తుంటే అవన్నీ ఫుల్ అవుతున్నాయి. దీన్ని బట్టే రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు సినిమా బాగుండటం, రివ్యూలలో ప్రశంసలు దక్కడం కలెక్షన్లను ఇట్టే పెంచుతున్నాయి. స్త్రీ 2 ఏకంగా బాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచినా ఆశ్చర్యం లేదని భోగట్టా.
ఒకవేళ పుష్ప 2 కనక వచ్చి ఉంటే స్త్రీ 2 సహా ఎవరూ పోటీలో ఉండేవాళ్ళు కాదు. మన సైడ్ కూడా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ తప్పుకునేవి. కొంచెం అటుఇటుగా కల్కి 2898 ఏడి ఓపెనింగ్ దక్కేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సుదీర్ఘమైన వీకెండ్ తో పాటు హోలీ పండగ లాంటి అంశాలు కలిసి వచ్చేవని అంటున్నారు. ఇప్పుడు చూస్తేనేమో తెలుగులో ఏ స్ట్రెయిట్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. తంగలాన్ కూడా వారం ముచ్చటలాగే కనిపిస్తోంది. ఇప్పుడు అల్లు అర్జున్ కనక సీన్ లో ఉంటే బుక్ మై షో క్రాష్ అవ్వడం, టికెట్ల కోసం జనాలు ఎగబడటం చూసేవాళ్ళం. ఛాన్స్ మిస్.
This post was last modified on August 17, 2024 3:53 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…