నిన్న ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఒక్క కార్తికేయ 2కు మాత్రమే అవార్డు దక్కడం పట్ల ఇండస్ట్రీ వర్గాలతో పాటు మూవీ లవర్స్ నిరాశని వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులు విమర్శకుల ప్రశంసలతో పాటు వసూళ్లు కూడా సాధించిన ఎన్నో సినిమాలు కమిటీ దృష్టికి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. సీతారామం రీమేక్ కాదు. మంచి నేపధ్యాన్ని తీసుకుని దర్శకుడు హను రాఘవపూడి గొప్పగా చిత్రీకరించాడు. హృద్యమైన సంగీతం హృదయాలను తాకుతుంది. అడివి శేష్ మేజర్ స్ట్రెయిట్ సబ్జెక్టే. ముంబై తీవ్రవాదుల దాడి నేపథ్యంలో ఒక పోరాట యోధుడి కథని శశికిరణ్ తిక్క గొప్పగా ఆవిష్కరించారు.
వీటితో పాటు అంటే సుందరానికి, విరాట పర్వం, రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలకు ఎన్నో అర్హతలున్నాయి. అయినా సరే పరిగణనలోకి రాలేదు. మాములుగా జాతీయ అవార్డు రావాలంటే నిర్మాత వైపు నుంచి నామినేషన్ వెళ్ళాలి. మరి అందరూ అది చేశారా లేదానేది ఇంకా తెలియాల్సి ఉంది. తమిళంలో తప్ప ఇతర భాషల్లో అంతగా ప్రభావం చూపించలేకపోయినా పొన్నియిన్ సెల్వన్ 1కి అన్నేసి పురస్కారాలు రావడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేవలం మల్టీ స్టారర్, భారీతనం అనే అంశాలను ప్రాతిపదికన తీసుకున్నారా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
కెరీర్ లో ఒక గొప్ప ఘనతగా భావించే జాతీయ అవార్డుని సాధించుకోవడం ఫిలిం మేకర్స్ గర్వంగా భావిస్తారు. ఇందులోనూ పోటీ ఉంటుంది కానీ సగటు ఆడియన్స్ పోల్చుకుని చూసినప్పుడు భాషతో సంబంధం లేకుండా నిర్ణయం సరైనదే అనిపించాలి. అప్పుడే ఇలాంటి ఇష్యూస్ రావు. కానీ ఈసారి కాస్త స్వరాలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. కన్నడలో సంచలన విజయం అందుకున్న ఛార్లీ 777 సైతం దేనికీ నోచుకోకపోవడం గమనించాల్సిన విషయం. సాయిపల్లవి గార్గి సైతం లిస్టులో ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికదు కానీ పారదర్శకత మరింత పెరగాలనేదే సగటు సినీ ప్రియుల కోరిక.
This post was last modified on August 17, 2024 9:57 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…