Movie News

ప్రేక్షకులను చెడగొట్టింది మేమే – దిల్ రాజు

ఇండస్ట్రీ పోకడల గురించి అగ్ర నిర్మాతలు నిజాలు మాట్లాడ్డం అరుదు. అయితే దిల్ రాజు చాలాసార్లు దానికి మినహాయింపు ఇస్తుంటారు. నిన్న జరిగిన రేవు అనే చిన్న సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మరోసారి ఇది బయట పడింది. తన ప్రసంగంలో ట్రెండ్ గురించి మాట్లాడుతూ ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా మేమే చెడగొట్టామని, నాలుగు వారాలకే ఓటిటిలో తెస్తాం, మీరు ఇంట్లోనే ఉండండని చెప్పడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పుకొచ్చారు. కంటెంట్ బాగుంటే బలగం, కమిటీ కుర్రోళ్ళు లాగా నెమ్మదిగా అయినా జనం వస్తారని ఆ విజయాలను ఉదాహరణగా చూపారు.

సరైన సందర్భంలో దిల్ రాజు సరైన మాటే అన్నారు. ఎందుకంటే మరీ నెల రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ వల్ల వసూళ్లు ప్రభావితం చెందుతున్న మాట వాస్తవం. సలార్, గుంటూరు కారం, టిల్లు స్క్వేర్, ది ఫ్యామిలీ స్టార్ లాంటి స్టార్ హీరోల చిత్రాలన్నీ త్వరగా ఓటిటిలో వచ్చేయడం చూశాం. హనుమాన్, కల్కి 2898 ఏడి ఆలస్యం చేయడం వాటికి చాలా ప్లస్ అయ్యింది. థియేటర్ రెవిన్యూ బాగా రావాలని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా గ్యాప్ పెద్దది ఉండాలి. లేదూ డిజిటల్ కంపెనీలు ఎక్కువ రేట్ ఇస్తున్నాయని ఆశపడితే బంగారు బాతును కోసుకుని తిన్న అమాయకుడి కథ గుర్తొస్తుంది.

క్రమంగా కొన్ని కఠిన పద్ధతులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాలీవుడ్ లో చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ సినిమా యాభై రోజులు దాటకుండా ఓటిటికి రాదు. ఒకవేళ ఆలా చేసే పక్షంలో తమ స్క్రీన్లను ఇవ్వమని మల్టీప్లెక్సులు అల్టిమేటం ఇచ్చాయి. దానికి అనుగుణంగానే నిర్మాతలు దాన్ని పాటిస్తున్నారు. మలయాళంలోనూ ఇటీవలే ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టారు. తమిళనాడులో నిర్మాతల సమాఖ్య కొన్ని వారాల క్రితమే ఆంక్షలతో కూడిన మార్గదర్శకాలు విడుదల చేశారు. సో ఇక మిగిలింది మన వైపు మాత్రమే. దిల్ రాజు గారే అన్నారు కాబట్టి ఆ దిశగా మార్పు వస్తుందేమో చూడాలి.

This post was last modified on August 17, 2024 9:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago