ఎన్నో వారాల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడబోతోంది. జూన్ నెల నుంచి సరైన సినిమాలు లేక అధిక శాతం థియేటర్ల కనీస నిర్వహణ ఖర్చులు రాక ఆకలితో ఉన్న బయ్యర్లకు, ప్రేక్షకులకు విందు భోజనం వడ్డించేందుకు ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు చిత్రాలు ఆగస్ట్ 15 రానుండటంతో అందరి కళ్ళు వాటి మీదే ఉన్నాయి. ‘మిస్టర్ బచ్చన్’ సందడి ముందు రోజు సాయంత్రమే ప్రీమియర్ల రూపంలో మొదలవుతోంది. రవితేజ మూవీకి ఇలా స్పెషల్ షోలు వేయడం అరుదు కావడంతో టికెట్ల అమ్మకాలు హాట్ కేకుల్లా మారిపోయాయి. దాదాపు అన్ని షోలు సోల్డ్ అవుట్ బోర్డులు పడుతున్నాయి.
ఇక ‘డబుల్ ఇస్మార్ట్’ బుకింగ్స్ విషయంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ ట్రెండింగ్ లోకి రావడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. రామ్, పూరి జగన్నాధ్ కలయిక మరో మాస్ హిస్టీరియా ఖాయమనే నమ్మకంతో ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. సంజయ్ దత్ విలనీ, మణిశర్మ సంగీతం అంచనాలు పెంచుతున్నాయి. చిన్న చిత్రమే అయినా ‘ఆయ్’ని బన్నీ వాస్, అల్లు అరవింద్ చాలా ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారు. నిఖిల్, శ్రీలీలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. నితిన్ నార్నె హీరోగా రూపొందిన ఈ విలేజ్ ఎంటర్ టైనర్ రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి షోలు మొదలుపెట్టనుంది.
ఇవి కాకుండా తమిళ డబ్బింగ్ ‘తంగలాన్’ మీద తెలుగులో ఓ మోస్తరు అంచనాలున్నాయి. విక్రమ్ ఇమేజ్ తో పాటు షాకింగ్ అనిపించే విభిన్నమైన వాతావరణంలో దర్శకుడు పా రంజిత్ తీసిన తీరు ఆసక్తి రేపుతోంది. టాక్ బాగా వస్తే పైన మూడింటిని తట్టుకుని నిలబడగలదు కానీ యావరేజ్ అనే మాట వచ్చినా ఇబ్బందే. ఇవి కాకుండా బాలీవుడ్ నుంచి స్త్రీ 2, ఖేల్ ఖేల్ మే, వేదాలు వస్తున్నా హైదరాబాద్ లాంటి నగరాలు మినహాయించి మిగిలిన చోట వాటికి బజ్ తక్కువే. జనవరి తర్వాత ఆ స్థాయి సందడి మళ్ళీ ఇప్పుడే కనిపిస్తోంది. ఇవి రెండు వారాలు నిలబడితే నెలాఖరులో సరిపోదా శనివారంతో జోష్ కొనసాగుతుంది
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…