ఎన్నో వారాల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడబోతోంది. జూన్ నెల నుంచి సరైన సినిమాలు లేక అధిక శాతం థియేటర్ల కనీస నిర్వహణ ఖర్చులు రాక ఆకలితో ఉన్న బయ్యర్లకు, ప్రేక్షకులకు విందు భోజనం వడ్డించేందుకు ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు చిత్రాలు ఆగస్ట్ 15 రానుండటంతో అందరి కళ్ళు వాటి మీదే ఉన్నాయి. ‘మిస్టర్ బచ్చన్’ సందడి ముందు రోజు సాయంత్రమే ప్రీమియర్ల రూపంలో మొదలవుతోంది. రవితేజ మూవీకి ఇలా స్పెషల్ షోలు వేయడం అరుదు కావడంతో టికెట్ల అమ్మకాలు హాట్ కేకుల్లా మారిపోయాయి. దాదాపు అన్ని షోలు సోల్డ్ అవుట్ బోర్డులు పడుతున్నాయి.
ఇక ‘డబుల్ ఇస్మార్ట్’ బుకింగ్స్ విషయంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ ట్రెండింగ్ లోకి రావడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. రామ్, పూరి జగన్నాధ్ కలయిక మరో మాస్ హిస్టీరియా ఖాయమనే నమ్మకంతో ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. సంజయ్ దత్ విలనీ, మణిశర్మ సంగీతం అంచనాలు పెంచుతున్నాయి. చిన్న చిత్రమే అయినా ‘ఆయ్’ని బన్నీ వాస్, అల్లు అరవింద్ చాలా ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారు. నిఖిల్, శ్రీలీలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. నితిన్ నార్నె హీరోగా రూపొందిన ఈ విలేజ్ ఎంటర్ టైనర్ రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి షోలు మొదలుపెట్టనుంది.
ఇవి కాకుండా తమిళ డబ్బింగ్ ‘తంగలాన్’ మీద తెలుగులో ఓ మోస్తరు అంచనాలున్నాయి. విక్రమ్ ఇమేజ్ తో పాటు షాకింగ్ అనిపించే విభిన్నమైన వాతావరణంలో దర్శకుడు పా రంజిత్ తీసిన తీరు ఆసక్తి రేపుతోంది. టాక్ బాగా వస్తే పైన మూడింటిని తట్టుకుని నిలబడగలదు కానీ యావరేజ్ అనే మాట వచ్చినా ఇబ్బందే. ఇవి కాకుండా బాలీవుడ్ నుంచి స్త్రీ 2, ఖేల్ ఖేల్ మే, వేదాలు వస్తున్నా హైదరాబాద్ లాంటి నగరాలు మినహాయించి మిగిలిన చోట వాటికి బజ్ తక్కువే. జనవరి తర్వాత ఆ స్థాయి సందడి మళ్ళీ ఇప్పుడే కనిపిస్తోంది. ఇవి రెండు వారాలు నిలబడితే నెలాఖరులో సరిపోదా శనివారంతో జోష్ కొనసాగుతుంది
ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…