ఎన్నో వారాల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడబోతోంది. జూన్ నెల నుంచి సరైన సినిమాలు లేక అధిక శాతం థియేటర్ల కనీస నిర్వహణ ఖర్చులు రాక ఆకలితో ఉన్న బయ్యర్లకు, ప్రేక్షకులకు విందు భోజనం వడ్డించేందుకు ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు చిత్రాలు ఆగస్ట్ 15 రానుండటంతో అందరి కళ్ళు వాటి మీదే ఉన్నాయి. ‘మిస్టర్ బచ్చన్’ సందడి ముందు రోజు సాయంత్రమే ప్రీమియర్ల రూపంలో మొదలవుతోంది. రవితేజ మూవీకి ఇలా స్పెషల్ షోలు వేయడం అరుదు కావడంతో టికెట్ల అమ్మకాలు హాట్ కేకుల్లా మారిపోయాయి. దాదాపు అన్ని షోలు సోల్డ్ అవుట్ బోర్డులు పడుతున్నాయి.
ఇక ‘డబుల్ ఇస్మార్ట్’ బుకింగ్స్ విషయంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ ట్రెండింగ్ లోకి రావడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. రామ్, పూరి జగన్నాధ్ కలయిక మరో మాస్ హిస్టీరియా ఖాయమనే నమ్మకంతో ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. సంజయ్ దత్ విలనీ, మణిశర్మ సంగీతం అంచనాలు పెంచుతున్నాయి. చిన్న చిత్రమే అయినా ‘ఆయ్’ని బన్నీ వాస్, అల్లు అరవింద్ చాలా ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారు. నిఖిల్, శ్రీలీలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. నితిన్ నార్నె హీరోగా రూపొందిన ఈ విలేజ్ ఎంటర్ టైనర్ రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి షోలు మొదలుపెట్టనుంది.
ఇవి కాకుండా తమిళ డబ్బింగ్ ‘తంగలాన్’ మీద తెలుగులో ఓ మోస్తరు అంచనాలున్నాయి. విక్రమ్ ఇమేజ్ తో పాటు షాకింగ్ అనిపించే విభిన్నమైన వాతావరణంలో దర్శకుడు పా రంజిత్ తీసిన తీరు ఆసక్తి రేపుతోంది. టాక్ బాగా వస్తే పైన మూడింటిని తట్టుకుని నిలబడగలదు కానీ యావరేజ్ అనే మాట వచ్చినా ఇబ్బందే. ఇవి కాకుండా బాలీవుడ్ నుంచి స్త్రీ 2, ఖేల్ ఖేల్ మే, వేదాలు వస్తున్నా హైదరాబాద్ లాంటి నగరాలు మినహాయించి మిగిలిన చోట వాటికి బజ్ తక్కువే. జనవరి తర్వాత ఆ స్థాయి సందడి మళ్ళీ ఇప్పుడే కనిపిస్తోంది. ఇవి రెండు వారాలు నిలబడితే నెలాఖరులో సరిపోదా శనివారంతో జోష్ కొనసాగుతుంది
This post was last modified on August 14, 2024 12:29 pm
సంవత్సరాలు, నెలల నుంచి కౌంట్ డౌన్ ఇప్పుడు రోజుల్లోకి వచ్చేసింది. దేవర పార్ట్ 1 విడుదలకు సరిగ్గా పది రోజులు…
బాలీవుడ్ సినీ నటి కాదంబరి జెత్వానీ ఇష్యూతో తెర మీదకు వచ్చిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా.. విశాల్…
నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తండేల్ ముందున్న అతి పెద్ద సమస్య విడుదల…
వినాయకచవితి నిమజ్జనం వేళలో నిర్వహించే లడ్డూ వేలం ఎంతటి ఆసక్తిని రేపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఏడాది…
"రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తే.. ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. ఇది మోడీ గ్యారెంటీ!" -ఎన్నికల సమయంలో బీజేపీ…
ఏపీలో కూటమికి నేతృత్వం వహిస్తున్న టీడీపీలో మరో కొత్త రచ్చ తెరమీదికి వచ్చింది. సీనియర్ నాయకులు ఎవ రూ పార్టీకి…