ఇటీవలే నిశ్చితార్థం జరుపుకున్న నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహ బంధం ఎక్కువ కాలం సాగదంటూ, కొన్నేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోతారని వేణుస్వామి జాతకం చెప్పడం ఎంత వివాదాస్పదమయ్యిందో తెలిసిందే. దీనికి నిరసనగా తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్, తెలుగు డిజిటల్ మీడియా అసోసియేషన్ సంయుక్తంగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాయి. గతంలో తప్పుడు జోస్యాలు చెప్పి పాపులారిటీ కోసం పాకులాడతారని ఈయన మీద ఎలిగేషన్లున్నాయి. జగన్ మళ్ళీ సీఎం అవుతారని, ప్రభాస్ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయని చెప్పి నవ్వులపాలయ్యాడు.
తాజాగా చైతు ఇంకా పెళ్లిపీటలు ఎక్కక ముందే విడిపోవడం గురించి వేణుస్వామి చెప్పడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇది చాలా దూరం వెళ్తోందని గుర్తించిన సదరు పెద్ద మనిషి ఇకపై సినిమా స్టార్లు, రాజకీయ నాయకులకు జోస్యం చెప్పనని ఒక వీడియో మెసేజ్ విడుదల చేశారు. నిజానికి బిగ్ బాస్ సీజన్ 8లో ఈయన ఎంపికైనట్టు టాక్ ఉంది. దానికి వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న నాగార్జున కొడుకు మీదే ఇలాంటి ఇష్యూ సృష్టించడంతో అక్కినేని అభిమానులు భగ్గుమన్నారు. మంచి ఆఫర్ చేయి దాకా వచ్చి పోతుందనే ఇలా సారీ చెప్పి ఉండొచ్చని నెటిజెన్లు ఎద్దేవా చేస్తున్నారు.
ఏది ఏమైనా సెలెబ్రిటీల విషయంలో అందులోనూ వ్యక్తిగత జీవితాల గురించి జాతకాలు చెప్పడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. ఎందరో తారలు వేణుస్వామితో పూజలు చేయించడం గతంలో చూశాం. ముఖ్యంగా హీరోయిన్లు ఈ వరసలో ముందున్నారు. ఇకనైనా వీటిని ఆపేయడం మంచిదని అభిమానులు కోరుతున్నారు. గుడ్డి నమ్మకంతో అవసరం లేని ప్రాధాన్యం ఇవ్వడం వల్లే వేణుస్వామి లాంటి వాళ్ళు ఏం చెప్పడానికైనా సిద్ధపడతారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. అన్నట్టు ఇలా యుటర్న్ తీసుకోవాల్సి వస్తుందని సదరు వేణుస్వామి ముందుగానే చూసుకున్నారో లేదో.
This post was last modified on August 12, 2024 6:21 pm
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…
పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని…
ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…