ఇటీవలే నిశ్చితార్థం జరుపుకున్న నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహ బంధం ఎక్కువ కాలం సాగదంటూ, కొన్నేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోతారని వేణుస్వామి జాతకం చెప్పడం ఎంత వివాదాస్పదమయ్యిందో తెలిసిందే. దీనికి నిరసనగా తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్, తెలుగు డిజిటల్ మీడియా అసోసియేషన్ సంయుక్తంగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాయి. గతంలో తప్పుడు జోస్యాలు చెప్పి పాపులారిటీ కోసం పాకులాడతారని ఈయన మీద ఎలిగేషన్లున్నాయి. జగన్ మళ్ళీ సీఎం అవుతారని, ప్రభాస్ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయని చెప్పి నవ్వులపాలయ్యాడు.
తాజాగా చైతు ఇంకా పెళ్లిపీటలు ఎక్కక ముందే విడిపోవడం గురించి వేణుస్వామి చెప్పడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇది చాలా దూరం వెళ్తోందని గుర్తించిన సదరు పెద్ద మనిషి ఇకపై సినిమా స్టార్లు, రాజకీయ నాయకులకు జోస్యం చెప్పనని ఒక వీడియో మెసేజ్ విడుదల చేశారు. నిజానికి బిగ్ బాస్ సీజన్ 8లో ఈయన ఎంపికైనట్టు టాక్ ఉంది. దానికి వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న నాగార్జున కొడుకు మీదే ఇలాంటి ఇష్యూ సృష్టించడంతో అక్కినేని అభిమానులు భగ్గుమన్నారు. మంచి ఆఫర్ చేయి దాకా వచ్చి పోతుందనే ఇలా సారీ చెప్పి ఉండొచ్చని నెటిజెన్లు ఎద్దేవా చేస్తున్నారు.
ఏది ఏమైనా సెలెబ్రిటీల విషయంలో అందులోనూ వ్యక్తిగత జీవితాల గురించి జాతకాలు చెప్పడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. ఎందరో తారలు వేణుస్వామితో పూజలు చేయించడం గతంలో చూశాం. ముఖ్యంగా హీరోయిన్లు ఈ వరసలో ముందున్నారు. ఇకనైనా వీటిని ఆపేయడం మంచిదని అభిమానులు కోరుతున్నారు. గుడ్డి నమ్మకంతో అవసరం లేని ప్రాధాన్యం ఇవ్వడం వల్లే వేణుస్వామి లాంటి వాళ్ళు ఏం చెప్పడానికైనా సిద్ధపడతారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. అన్నట్టు ఇలా యుటర్న్ తీసుకోవాల్సి వస్తుందని సదరు వేణుస్వామి ముందుగానే చూసుకున్నారో లేదో.
This post was last modified on August 12, 2024 6:21 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…