కోలీవుడ్ లో ఇప్పటిదాకా పలు ప్యాన్ ఇండియా ప్రయత్నాలు భారీ ఎత్తున జరిగాయి కానీ కంగువ మీదున్న అంచనాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. సూర్య హీరో కావడం ఒక ఎత్తయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, యూవీ సంస్థ భాగస్వామ్యంలో స్టూడియో గ్రీన్ భారీ నిర్మాణ విలువలు హైప్ అమాంతం పెంచేశాయి. యానిమల్ తో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బాబీ డియోల్ విలనిజంతో పాటు దిశా పటాని గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. దేవర వదులుకున్న పండగ డేట్ అక్టోబర్ 10ని అందుకున్న కంగువ ఎలా ఉండబోతోందనే ఉత్సుకత అందరి కళ్ళు ట్రైలర్ వైపు తిప్పేలా చేసింది.
ఎప్పుడో శతాబ్దాలనాటి కథ. నాగరిక ప్రపంచం ఏర్పడక ముందు దట్టమైన అడవిలో అటవీ తెగల జీవన పోరాటంలో నెత్తుటితో అధికారం కోసం పాకులాడే దుర్మార్గుడు (బాబీ డియోల్) ఒకడు. వందల వేల ప్రాణాలు గాలిలో, సముద్రంలో కలిసిపోతూ ఉంటే వాడిని ఎదిరించడానికి కంగువ (సూర్య) వస్తాడు. యుద్ధంలో సై అంటే సై అంటూ సవాల్ విసురుతూ తనను నమ్ముకున్న జాతికోసం తలలు నరికేందుకు సైతం వెనుకాడడు. నిత్యం ప్రమాదాలతో బ్రతికే కంగువ లక్ష్యం ఏంటి, మనం ఎన్నడూ చూడని ప్రపంచంలో తను చేయబోయే విధ్వంసం ఎలా ఉండబోతోందో తెరమీద చూడాలి.
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన నేపధ్య సంగీతానికి తోడు విఎఫెక్స్ ఎఫెక్ట్స్ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. స్టోరీ ఎక్కువ రివీల్ కాకుండా తెలివిగా కట్ చేసిన ట్రైలర్ లో అసలు విషయాలు దాచి పెట్టారు. గతంలో వచ్చిన పోస్టర్ లోని సూర్య కొత్త గెటప్ తాలూకు డీటెయిల్స్ ఏవీ ఇందులో లేవు. విడుదలకు దగ్గర మరో కొత్త ట్రైలర్ రాబోతోంది. వెట్రి పళనిస్వామి ఛాయాగ్రహణంతో సాంకేతిక విభాగాలు పోటీ పడ్డాయి. థియేటర్ అనుభూతిని డిమాండ్ చేసే కంగువ కోసం ఫ్యాన్సే కాదు సగటు మూవీ లవర్స్ సైతం ఎదురు చూసేలా మెప్పించారు.
This post was last modified on August 12, 2024 1:38 pm
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…